నండూరి రామమోహనరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
| name = నండూరి రామమోహనరావు
| residence =
| other_names =పాత్రికేయ భీష్ముడు,
| image =Nanduri-rama-mohan-rao.jpg
| imagesize = 200px
పంక్తి 11:
| native_place =
| death_date = 2 సెప్టెంబర్ 2011
| death_place = విజయవాడ
| death_cause = మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్‌
| death_cause =
| known = తెలుగు పాత్రికేయరంగ ప్రముఖులు,అభ్యుదయవాది, ‘ఆంధ్రజ్యోతి’ పూర్వ సంపాదకుడు
| occupation = "జన్మభూమి" అన్న పత్రికలో సబెడిటర్
| title =
| salary =
పంక్తి 35:
| weight =
}}
 
 
'''నండూరి రామమోహనరావు''' (24 ఏప్రిల్ 1927-2 సెప్టెంబర్ 2011) తెలుగు పాత్రికేయరంగ ప్రముఖులు. పాత్రికేయునిగానే కాక, రచయితగా కూడా ప్రసిద్ధులు. చాలాకాలం పాటు [[ఆంధ్రజ్యోతి]] పత్రిక సంపాదక బాధ్యతలు నిర్వహించారు. "బాల" అన్న పత్రికలోనూ, [[ఆంధ్రపత్రిక]]లోనూ 1940వ దశకంలో వీరి రచనలు ఎన్నో ప్రచురింపబడ్డాయి. "నరావతారం", "విశ్వరూపం" ఈయన ప్రముఖ రచనలు. సామాన్య జనాలకు సైన్సు సంగతులు పరిచయం చేయడంలో వీరి కృషి ఎన్నదగ్గది. ఇవికాక వీరు ఆంధ్రపత్రికలో [[మార్క్ ట్వేన్]] నవలలకు తెలుగు అనువాదాలు కూడా చేసారు.
 
== జీవితం==
నండూరి రామ్మోహనరావు కృష్ణాజిల్లాకృష్ణా విస్సన్నపేటజిల్లా లోబాపులపాడు మండలం ఆరుగొలను గ్రామంలో [[1927]] , [[ఏప్రిల్ 24న24]] న జన్మించారు.1937-42 మధ్య నూజివీడు, మచిలీపట్నం లలో హైస్కూలు విద్యనభ్యసించారు. రాజమండ్రి గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీలో 1942-47 మధ్య చదువుకున్నారు. రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలలో విద్యార్థిగా ఉండగానే ‘విజ్ఞానం’ అనే లిఖిత పత్రికను నడిపారు. నండూరి తన 21వ ఏటనే పాత్రికేయుడిగా తన ప్రస్థానం ప్రారంభించారు. 1944 ఏప్రిల్ 30వ తేదీన మేనమామ కూతురు రాజేశ్వరిని వివాహమాడారు. కొన్నాళ్ళు ఋషీకేశంలో ఉన్నారు. ఆ తరువాత 1947లో కొన్ని నెలలు ఉదయభారతి గురుకులంలో పనిచేశాక, "జన్మభూమి" అన్న పత్రికలో సబెడిటర్ ఉద్యోగంలో చేరారు. 1948-1960 మధ్యలో వివిధ స్థాయుల్లో "[[ఆంధ్రపత్రిక]]"లో పనిచేశారు. 1960-1994 దాకా [[ఆంధ్రజ్యోతి]] పత్రికలో వివిధ స్థాయుల్లో పని చేసి, సంపాదకులు గా పదవీ విరమణ చేశారు. ఆ సమయంలోనే "జ్యోతిచిత్ర", "వనితాజ్యోతి", "బాలజ్యోతి" వంటి పత్రికలకు వ్యవస్థాపక సంపాదకులుగా ఉన్నారు.
 
ఆయన జర్నలిస్టు జీవితం ‘ఆంధ్రపత్రిక’లో ప్రారంభమైంది. 1948 నుంచి 1960 వరకు ఆయన ‘ఆంధ్ర పత్రిక’లో పనిచేశారు. 1960లో సహ సంపాదకుడి హోదాలో ‘ఆంధ్రజ్యోతి’లో అడుగు పెట్టారు.1960 నుంచి 1994 దాకా… అంటే 34 సంవత్సరాల కాలం ఆయన ‘ఆంధ్రజ్యోతి’లో అక్షర యాత్ర చేశారు. ఆయన ఎంతో మందిని పాత్రికేయులుగా తీర్చి దిద్దారు. సూటిగా, సరళంగా ఉండే ఆయన సంపాదకీయాలు పాఠకులపై మంచి ప్రభావం చూపేవి. తొలితరం సంపాదకుడు నార్ల వెంకటేశ్వర రావుతో కలసి పని చేశారు. నార్ల నిష్క్రమణ అనంతరం 1980లో నండూరి రామమోహనరావు ‘ఆంధ్రజ్యోతి’ సంపాదకుడిగా పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టారు. ఆయన 1962, 1978, 1984, 1992లలో అమెరికాలోను, 1982లో రష్యాలో పర్యటించారు.
 
==అనువాద హనుమంతుడు==
బాపు – రమణలు నండూరిని ‘అనువాద హనుమంతుడు’ అని కొనియాడారు. సుప్రసిద్ధ ఆంగ్ల రచనలను అచ్చ తెలుగులో, అందరికీ నచ్చేలా, తనదైన ప్రత్యేక శైలిలో అనువదించడమే దీనికి కారణం. మార్క్‌ట్వేన్ రచించిన టామ్ సేయర్, హకిల్ బెరిఫిన్‌లను అవే పేర్లతో అనువదించారు. మార్క్‌ట్వేన్ మరో రెండు రచనలను రాజు – పేద, విచిత్ర వ్యక్తి పేరిట అనువదించారు. అలాగే… కాంచన ద్వీపం (రాబర్ట్ స్టీవెన్‌సన్) అనే మరో అనువాద రచన కూడా చేశారు.
 
61 సంవత్సరాలు దాటినా ఇప్పటికీ ఆ పుస్తకాలకు ఆదరణ ఉండడం విశేషం. నండూరి ఖగోళ, భౌతిక శాస్త్రాలను పరిశోధించి ‘విశ్వరూపం’ అనే పుస్తకం రచించారు. మానవాళి పరిణామ క్రమానికి సంబంధించిన నరావతారం, తత్త్వశాస్త్రాన్ని సులువుగా వివరించే ‘విశ్వ దర్శనం’ ఆయన కలం నుంచి జాలువారినవే. నండూరి.. సవ్యసాచి పేరుతో రాజకీయ వ్యంగ్య రచనలు, హరివిల్లు పేరుతో బాల గేయాలు, ఉషస్విని పేరిట కవితలు రచించారు. కథా గేయ సుధానిధి (లేదా యూసఫ్?) కూడా ఆయన రచనే.
 
మిత్రలాభం, మిత్ర భేదం (పంచతంత్ర కథలు) పేరిట బాపు వేసిన బొమ్మలకు నండూరి మాటలను అందించారు. ఇంద్రగంటి శ్రీకాంత శర్మతో కలిసి ‘మహా సంకల్పం’ అనే సంకలనాన్ని వెలువరించారు. సంపాదకీయాల సంకలనం అను పల్లవి, చిరంజీవులు, వ్యాఖ్యావళి ఆయన ఇతర రచనలు. నండూరి రామమోహనరావు రాసిన ఐదు పుస్తకాలను న్యూస్టూడెంట్ బుక్ సెంటర్ ఆధినేత బాబ్జీ ప్రచురించి 2006 మే 9వ తేదీన ఆవిష్కరించారు. వీటిని పద్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు, కళాప్రపూర్ణ మిక్కిలినేని రాధాకృష్ణ, స్వాతంత్య్ర సమరయోధుడు పరకాల పట్టాభిరామారావు, పాత్రికేయులు వీరాజీ, ఎస్.ప్రకాశరావులు ఆవిష్కరించారు. ఆ రోజున నండూరి రామమోహనరావును సత్కరించారు.
 
==హేమాహేమీలతో అనుబంధం==
నండూరి రామమోహనరావుకు అనేకమంది ప్రముఖ పాత్రికేయులు, రచయితలతో సన్నిహిత సంబంధాలున్నాయి. ఆంధ్రపత్రికలో పని చేస్తున్నపుడు వారపత్రికకు సంబంధించి కొడవటిగంటి కుటుంబరావు, పండితారాధ్యుల నాగేశ్వరరావు, తెన్నేటి సూరి, పిలకాగణపతిశాస్త్రి వంటి హేమాహేమీలతో సాహిత్యంపై చర్చించేవారు. ఆంధ్రపత్రిక వీక్లీలో ఆంగ్ల రచనలను తెలుగులోకి అనువదించి ప్రచురించాలని సంకల్పించినప్పుడు… అనువాద బాధ్యతలను నండూరికే అప్పగించారు. సాహితీ వేత్తలు ఆరుద్ర, శ్రీశ్రీలతోపాటు ‘ఆంధ్రజ్యోతి’ పూర్వ సంపాదకుడు రామచంద్రమూర్తి, ప్రస్తుత సంపాదకుడు కె.శ్రీనివాస్‌లతో నండూరికి అనుబంధం ఉంది.
 
==రచనలు==
"https://te.wikipedia.org/wiki/నండూరి_రామమోహనరావు" నుండి వెలికితీశారు