బొల్లిముంత శివరామకృష్ణ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 49:
 
==మృత్యుంజయులు==
అవి కమ్యూనిస్టు ఉద్యమం ఉధృతమైన రోజులు. బొల్లిముంత 1945లో టీచర్‌ ఉద్యోగానికి రాజీనామా చేసి, పూర్తి సమయం పార్టీకి అంకితం చేశారు. పార్టీ పనులమీద తిరుగుతూ మునగాల పరగణాలోని జగ్గయ్య పేటకు వెళ్ళి రావడం జరుగుతూ ఉండేది. అక్కడే తెలంగాణ పోరాటం గూర్చి వినడం, అందిన రిపోర్టులు చదువుకోవడం, విషయాలు తెలుసుకోవడం జరుగుతూ ఉండేది. వాటితో ఉత్తేజితుడైన యువకుడు బొల్లిముంత ఇరవై ఏడేళ్ళ వయసులో ‘మృత్యుంజయులు’ నవల రాశారు. కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాన 1946-51 మధ్య అర్ధ దశాబ్ద కాలం పాటు తెలంగాణ రైతులు సాయుధులై దోపిడీ వర్గాల మీద తిరుగుబాటు చేశారు. ఈ తిరుగుబాటులో కవులు, రచయితలు, కళాకారులు ఎంతోమంది భాగస్వాములయ్యారు. యాదగిరి, సుద్దాల, తిరునగరి, నాజర్‌, సుంకర, వాసిరెడ్డి, కాళోజి, దాశరథి, కుందుర్తి, సోమసుందర్‌, గంగినేని వంటి కవులు తమ అక్షరాయుధాలతో ముందు నిలిచారు.
 
తెలంగాణ పోరాటం ప్రారంభమైన ఒక సంవత్సరానికి బొల్లిముంత ‘మృత్యుంజయులు’ నవల 1947 అక్టోబర్‌ 25న విడుదల చేశారు. ఒక రకంగా కవుల కంటే కూడా తన నవలాయుధంతో ఆయన ముందు నిలిచారు. ఆ తర్వాత గంగినేని ‘ఎర్రజెండాలు’, వట్టికోట ‘ప్రజల మనిషి’, ‘గంగు’, మహీధర రామ్మోహనరావు ‘ఓనమాలు’, మృత్యు నీడల్లో’, తిరునగరి ‘సంగం’ వంటి నవలలు వెలువడ్డాయి. పోరాట విరమణకు ముందు, బొల్లిముంత నవల తర్వాత వెలువడింది లక్ష్మీకాంత మోహన్‌ ‘సింహ గర్జన’. దేశంలోని ఇతర ప్రాంతాల్లో రైతులు పంటలు పండించుకున్నందుకు శిస్తులు కడతారు. కానీ నాటి తెలంగాణలో శిస్తులు కట్టడానికి మాత్రమే పంటలు పడించాల్సి వచ్చేది. అంతటి దుర్భర స్థితిని సహజంగా చిత్రించింది మృత్యుంజయులు నవల. చచ్చేవాడికి రెండు చావులు ఉండవని దిన దిన గండంగా ప్రతిరోజూ చస్తూ బతకడం కన్నా భావి తరాల ఉజ్వల భవిష్యత్తు కోసం పోరాటంలో చావడమే మేలని జెండా పట్టి పోరాటంలో నేలకొరిగిన వీరులే ఈ మృత్యుంజయులు. నవలలోని ముఖ్య పాత్రలన్నీ పోరాటంలో మరణిస్తాయి.అంటే వీరమరణం పొందుతాయి. నవలా రచయిత దృష్టిలో వారంతా చావును జయించినవారు, మృత్యుంజయులు అని అర్ధం. తెలంగాణ పోరాట కాలంలో వెలువడిన తొలి నవలగా, ఒక చారిత్రక అవసరాన్ని గుర్తించి, ప్రజా పోరాటాన్ని నమోదు చేసిన నవలగా తెలుగు సాహిత్యంలో మృత్యుంజయులు నవలకు సుస్థిర స్థానం ఉంటుంది. నాటి కమ్యూనిస్టు నాయకులు చంద్రం ఈ నవలను బొల్లిముంతతో ఆరు సార్లు తిరగరాయించారట! రావి నారాయణ రెడ్డి ఈ నవలకు ముందు మాట రాశారు.
<!--
==సినీ రచయితగా...==
 
కమ్యూనిస్టు పార్టీ చీలిపోక ముందే 1964లో ఆత్రేయ ప్రోత్సాహంతో బొల్లిముంత శివరామకృష్ణ ఆయనకు సహాయకుడుగా మద్రాసు వెళ్ళారు. మొదట్లో తమిళ సినిమాలకు అనువాదాలు చేస్తుండేవారు. ఆత్రేయ స్వయంగా నిర్మించి దర్శకత్వం వహించిన ‘వాగ్దానం’కు బొల్లిముంత తొలిసారి స్వయంగా మాటలు రాశారు. ‘తిరుపతమ్మ కథ’కు సంభాషణలు రాసేసరికి ఆ కళలో మరింత పట్టు సాధించారు. ఆ రకంగా ‘మనుషులు మారాలి’ చిత్రం సంభాషణలో పెద్ద హిట్టయ్యింది. దాంతో బొల్లిముంత మద్రాసులో స్థిరపడాల్సి వచ్చింది. సుమారు నలభై ఐదు సినిమాలకు సంభాషణలు రాశారు. మధ్యలో కొన్ని పాటలు కూడా రాశారు. ‘కాలం మారింది’కి రాష్ట్ర ప్రభుత్వ అవార్డు, ‘నిమజ్జనం’కు జాతీయ అవార్డు లభించాయి.
 
==సంపాదకత్వం==
 
బొల్లిముంత ‘ప్రజాపక్షం’ అనే మాసపత్రికకు సంపాదకత్వ బాధ్యతలు స్వీకరించారు. తెలుగు అకాడెమీ పక్కన పత్రిక ఆఫీసు కూడా ఏర్పాటు చేశారు. అయితే పత్రిక కొన్ని నెలలు మాత్రమే నడిచింది. ఆ తరువాత ఆయన మళ్ళీ తెనాలి వెళ్ళిపోయారు.
 
 
 
మృత్యుంజయులు నవల
అవి కమ్యూనిస్టు ఉద్యమం ఉధృతమైన రోజులు. బొల్లిముంత 1945లో టీచర్‌ ఉద్యోగానికి రాజీనామా చేసి, పూర్తి సమయం పార్టీకి అంకితం చేశారు. పార్టీ పనులమీద తిరుగుతూ మునగాల పరగణాలోని జగ్గయ్య పేటకు వెళ్ళి రావడం జరుగుతూ ఉండేది. అక్కడే తెలంగాణ పోరాటం గూర్చి వినడం, అందిన రిపోర్టులు చదువుకోవడం, విషయాలు తెలుసుకోవడం జరుగుతూ ఉండేది. వాటితో ఉత్తేజితుడైన యువకుడు బొల్లిముంత ఇరవై ఏడేళ్ళ వయసులో ‘మృత్యుంజయులు’ నవల రాశారు. కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాన 1946-51 మధ్య అర్ధ దశాబ్ద కాలం పాటు తెలంగాణ రైతులు సాయుధులై దోపిడీ వర్గాల మీద తిరుగుబాటు చేశారు. ఈ తిరుగుబాటులో కవులు, రచయితలు, కళాకారులు ఎంతోమంది భాగస్వాములయ్యారు. యాదగిరి, సుద్దాల, తిరునగరి, నాజర్‌, సుంకర, వాసిరెడ్డి, కాళోజి, దాశరథి, కుందుర్తి, సోమసుందర్‌, గంగినేని వంటి కవులు తమ అక్షరాయుధాలతో ముందు నిలిచారు.
 
తెలంగాణ పోరాటం ప్రారంభమైన ఒక సంవత్సరానికి బొల్లిముంత ‘మృత్యుంజయులు’ నవల 1947 అక్టోబర్‌ 25న విడుదల చేశారు. ఒక రకంగా కవుల కంటే కూడా తన నవలాయుధంతో ఆయన ముందు నిలిచారు. ఆ తర్వాత గంగినేని ‘ఎర్రజెండాలు’, వట్టికోట ‘ప్రజల మనిషి’, ‘గంగు’, మహీధర రామ్మోహనరావు ‘ఓనమాలు’, మృత్యు నీడల్లో’, తిరునగరి ‘సంగం’ వంటి నవలలు వెలువడ్డాయి. పోరాట విరమణకు ముందు, బొల్లిముంత నవల తర్వాత వెలువడింది లక్ష్మీకాంత మోహన్‌ ‘సింహ గర్జన’. దేశంలోని ఇతర ప్రాంతాల్లో రైతులు పంటలు పండించుకున్నందుకు శిస్తులు కడతారు. కానీ నాటి తెలంగాణలో శిస్తులు కట్టడానికి మాత్రమే పంటలు పడించాల్సి వచ్చేది. అంతటి దుర్భర స్థితిని సహజంగా చిత్రించింది మృత్యుంజయులు నవల. చచ్చేవాడికి రెండు చావులు ఉండవని దిన దిన గండంగా ప్రతిరోజూ చస్తూ బతకడం కన్నా భావి తరాల ఉజ్వల భవిష్యత్తు కోసం పోరాటంలో చావడమే మేలని జెండా పట్టి పోరాటంలో నేలకొరిగిన వీరులే ఈ మృత్యుంజయులు. నవలలోని ముఖ్య పాత్రలన్నీ పోరాటంలో మరణిస్తాయి.
 
అంటే వీరమరణం పొందుతాయి. నవలా రచయిత దృష్టిలో వారంతా చావును జయించినవారు, మృత్యుంజయులు అని అర్ధం. తెలంగాణ పోరాట కాలంలో వెలువడిన తొలి నవలగా, ఒక చారిత్రక అవసరాన్ని గుర్తించి, ప్రజా పోరాటాన్ని నమోదు చేసిన నవలగా తెలుగు సాహిత్యంలో మృత్యుంజయులు నవలకు సుస్థిర స్థానం ఉంటుంది. నాటి కమ్యూనిస్టు నాయకులు చంద్రం ఈ నవలను బొల్లిముంతతో ఆరు సార్లు తిరగరాయించారట! రావి నారాయణ రెడ్డి ఈ నవలకు ముందు మాట రాశారు.
 
సినీ రచయితగా...
కమ్యూనిస్టు పార్టీ చీలిపోక ముందే 1964లో ఆత్రేయ ప్రోత్సాహంతో బొల్లిముంత శివరామకృష్ణ ఆయనకు సహాయకుడుగా మద్రాసు వెళ్ళారు. మొదట్లో తమిళ సినిమాలకు అనువాదాలు చేస్తుండేవారు. ఆత్రేయ స్వయంగా నిర్మించి దర్శకత్వం వహించిన ‘వాగ్దానం’కు బొల్లిముంత తొలిసారి స్వయంగా మాటలు రాశారు. ‘తిరుపతమ్మ కథ’కు సంభాషణలు రాసేసరికి ఆ కళలో మరింత పట్టు సాధించారు. ఆ రకంగా ‘మనుషులు మారాలి’ చిత్రం సంభాషణలో పెద్ద హిట్టయ్యింది. దాంతో బొల్లిముంత మద్రాసులో స్థిరపడాల్సి వచ్చింది. సుమారు నలభై ఐదు సినిమాలకు సంభాషణలు రాశారు. మధ్యలో కొన్ని పాటలు కూడా రాశారు. ‘కాలం మారింది’కి రాష్ట్ర ప్రభుత్వ అవార్డు, ‘నిమజ్జనం’కు జాతీయ అవార్డు లభించాయి.
 
రచనలు అభూత కల్పనలవైపు కాక జీవిత వాస్తవాలవైపు సాగాలి. సమస్యలు చర్చించాలి. పరిష్కారాలను సూచించాలి. యువ రచయితలకు సరైన మార్గదర్శకత్వం నిర్దేశించాలి. అప్పుడే ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుంది అని తరచూ చెబుతుండేవారు బొల్లిముంత శివరామకృష్ణ.
వారితో నా పరిచయం చాలా సాదా సీదాగా జరిగింది. అది 1993-97 మధ్య కాలం. ఓ కుర్రాడొచ్చి ‘మా పెదనాన్న వస్తానన్నారు. ఇంట్లో ఉంటున్నారా?’ అని అడిగాడు. ఎవరో సాహిత్యాభిమాని అయి ఉంటాడనుకుని ‘సరే, తీసుకురా.. ఉంటాను’ అన్నాను. తీరా చూస్తే ఆయన సాహితీ దిగ్గజం బొల్లిముంత శివరామకృష్ణ! అప్పటికే డెబ్బయ్యేళ్ళ పెద్దాయన. అభ్యుదయ నవలా రచయితగా, ‘మనుషులు మారాలి’ చిత్ర రచయితగా పెద్ద పేరు సంపాదించుకున్నారాయన. ఆయనకు నాపై ఏర్పడిన వాత్సల్య పూరిత అభిమానానికి కృతజ్ఞతలతో వినమ్రంగా నమస్కరించి కూర్చోబెట్టాను.
 
తీసుకొచ్చిన కుర్రాడి ఇంటిపేరు కూడా బొల్లిముంత అన్న విషయం మరిచిపోయాను. ఎందుకంటే అతన్ని మా ఇంట్లో రమణ అని పిలుస్తుండేవాళ్ళం. అతనే కవి బొల్లిముంత వెంకట రమణారావుగా రూపుదిద్దుకున్నాడు. అది ఆ తరువాతి విషయం. శివరామకృష్ణ వాళ్ళబ్యాయి హైదరాబాద్‌ విశాలాంధ్ర ప్రచురణాలయంలో పనిచేస్తుండేవాడు. అందువల్ల ఆయన తెనాలి నుంచి ఎప్పుడు కొడుకు దగ్గరకు హైదరాబాద్‌ వచ్చినా మా ఇంటికి తప్పక వస్తుండేవారు. నేను దగ్గరలో ఉన్న దండమూడి మహీదర్‌, సుందరయ్య విజ్ఞాన కేంద్రం లైబ్రేరియన్‌ రాజు, రేడియో చిరంజీవి మొదలైన వాళ్ళకు కబురు పెడుతుండేవాడిని. ఓ సారి మా ఇంట్లో, మరోసారి సుందరయ్య పార్కులో కూర్చుని సాహిత్యం గురించి మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. ఒక్కోసారి ఆయనకు ఓపిక ఉందంటే చిక్కడపల్లి నుండి అలా హిమయత్‌ నగర్‌ దాకా వెళుతుండేవాళ్ళం. డా ఏటుకూరి ప్రసాదో, బూదరాజు రాధాకృష్ణో ఎవరో ఒకరు కలుస్తుండేవాళ్ళు. మళ్ళీ ముచ్చట్లు. గజ్జెల మల్లారెడ్డి కొంతకాలం చిక్కడపల్లిలో ఉన్నారు. అప్పుడు అదో మీటింగ్‌ ప్లేస్‌. తండ్రి వయస్సున్న పెద్దవాళ్ళతో ఈయనకు ఈ స్నేహాలేమిటని నన్ను చూసి కొందరు ఆశ్చర్యపోతుండేవాళ్ళు.
 
సంపాదకత్వం
నాకు గుర్తుంది. ఆ రోజుల్లోనే బొల్లిముంత ‘ప్రజాపక్షం’ అనే మాసపత్రికకు సంపాదకత్వ బాధ్యతలు స్వీకరించారు. తెలుగు అకాడెమీ పక్కన డా మిత్ర ఉండే వీధిలో పత్రిక ఆఫీసు కూడా ఏర్పాటు చేశారు. పత్రిక ప్రారంభోత్సవం త్యాగరాయ గానసభ ఆడిటోరియంలో ఘనంగా జరిగింది. ప్రారంభ సంచికలో తెలంగాణ ప్రజల భాషలో నేను ఒక కవిత రాశాను. అయితే పత్రిక కొన్ని నెలలు మాత్రమే నడిచింది. ఆ తరువాత ఆయన మళ్ళీ తెనాలి వెళ్ళిపోయారు. మేం మళ్ళీ కలుసుకునే అవకాశం రాలేదు. ఆయన ఏడు జూన్‌ రెండు వేల ఐదున మరణించారని తెలుసుకుని బాధపడ్డాం. ఆ మరుసటి నెలే జులై 2005 సంచికను ‘ప్రజాసాహితి’ బొల్లిముంత శివరామకృష్ణ సంస్మరణలో వెలువరించింది. ఉపాధ్యాయుడిగా, ఉద్యమకారుడిగా, అరసం నేతగా, కమ్యూనిస్టు కార్యకర్తగా, నవలా రచయితగా, సినీ రచయితగా, సంపాదకుడిగా బహుముఖీనమైన ప్రతిభను కనరపరచిన బొల్లిముంత శివరామకృష్ణ సాహిత్య ప్రపంచంలో మృత్యుంజయుడిగా నిలిచారు.
 
-->
 
==సినిమా రచయితగా==