రేమెళ్ళ అవధానులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
అవధానులు కు హైదరాబాదు లోని NIMS డైరెక్టరు [[కాకర్ల సుబ్బారావు]] తో పరిచయం ఏర్పడింది. ఆయన కోరిక మేరకు NIMS ను కంప్యూటరీకరణ చేసి, అక్కడే సుమారు 18 సంవత్సరాలు పని చేశాడు. NIMS లో పనిచేస్తున్నప్పుడే ఒక సందర్బంలో TTD వారు ప్రచురించిన పుస్తకాలను చడవడం తటస్తించింది అవదానుల వారికి. దాని వలన తెలిసిన విషయమేమంటే.... వేదాల గురించి వున్న మొత్తం 1131 శాఖలకు గాను 7 శాఖలు మాత్రమే మిగిలాయని. అవి కూడ అంత్రించి పోవడానికి ఎంతో కాలం పట్టదనీ అర్థ మయి పోయింది. వాటినన్నా కాపాడుకోవాలంటే కనీసం వాటిని రెకార్డింగ్ చేస్తే తాత్కాలికంగా నైనా వాటిని కాపాడు కోవచ్చనిపించింది. కానీ ఋగ్వేదం మరీ ప్రమాదంలో వున్నదని తెలిసింది. తనకు యజుర్వేదం మాత్రమే తెలుసు. ఋగ్వేదం తెలిసిన వారెవరున్నారా? యని అన్వేషించగా మహారాష్ట్ర లో ఒకాయన వున్నాడని తెలిసి అక్కడికి వెళ్ళి అతన్ని కుటుంబం సమేతంగా తీసుకొచ్చి వారి పోషణా బాద్యతలన్నీ తానే తీసుకొని 1992 లో వేదాల రికార్డింగ్ మొదలు పెట్టారు.
 
అదే సమయానికి TTD వారు తిరుపతిలో అఖిలభారత వేదశాస్త్ర సమ్మేళనం నిర్వహించారు. దానికి అప్పటి భారత దేశ అధ్యక్షుడు శ్రీ శంకర్ దయాళ్ శర్మ వస్తున్నారనీ ఆ సందర్బంగా తనను వేదాల గురించి ఒక ప్రదర్శన ఇవ్వవలసినదిగా TTD వారు కోరగా 'నమకం' లోనిమూడు మంత్రాలనూ, వాటి అర్థాలనూ 'సీ లాంగ్వేజి సహాయంతో కంప్యూటర్ లో పెట్టి చూపగా శంకర్ దయాళ్ శర్మగారు చాలసంతోషించి ఈ ప్రాజెక్టుని పూర్తి చేయమని అవదాని గారికి చెప్పారు. కానీ ఈ ప్రాజెక్టును ప్రారంబించాలంటే తనకు ఒక మంచి కంప్యూటర్ కావాలి. దానిని కొనే స్థోమత అవదానుల గారికి లేదు. మనసుంటే మార్గము దేవుడే చూపిస్తాడన్నట్టు.... తనకు తెలిసిన మిత్రుడు సోమయాజులు గారు ఆ విషయాన్ని 'అశ్విని హైర్ ఆయిల్ ' అధినేత అయిన సుబ్బారావుగారికి తెలుపగా,... సుబ్బారావుగారి ఉదారంగా ఒకలక్షా ఇరవై వేల రూపాయాలను ఇవ్వగా దాంతో ఒక అధునూతన కంప్యూటర్ కొన్నారు అవదానిగారు. కంప్యూటర్ మీద పని చేస్తున్న వారికి జీత బత్యాలను .... తన జీతంలో నుండి ఇస్తున్నందున ఎక్కువ మందిని పెట్టుకోలేక పోయారు. దానికి ప్రత్యామ్నాయంగా విరాళాలు సేకరించడానికి వేదభారతి ట్రస్టు ను ప్రారంబించారు. చేయవలసిన పని ఎక్కువగా వుండటంతో అందరితో కలిసి తాను కూడ రాత్రుళ్ళు పనిచేసేవారు.

ఆ సందర్బంలో వేదాలలో సైంసు, లెక్కలు, వైద్యం, అంతరిక్ష శాస్త్రం మొదలగు శాస్త్రాలనీ వేదాలలో కనబడ్డాయి అవదానిగారికి. ఆ స్పూర్తితో పనిని మరింత వేగిరి పరచి 1995 నాటికి యజుర్వేదానికి 7 అనుక్రమణికలు వ్రాసి కంప్యూటరీకించి దేశంలోనే మొట్టమొదటి సారిగా మల్టీమీడియాలో శంకర్ దయాళ్ శర్మ గారికి చూపించారు. దానిని అప్పటి దేశ ప్రధాని అటల్ బీహారీ వాజ్ పేయి ఆవిష్కరించారు. ప్రశంచించారు. ఆ విధంగా అవదాని గారి చిరకాల కోరిక కొంత వరకైనా నెరవేరింది. వేదభారతి ట్రష్ట్ ద్వారా ఇప్పటివరకూ 700 గంటలు మాత్రమే రెకార్డింగ్ పూర్తయింది. దానిని మల్టీమీడియా సీడీ ల రూపంలో ప్రజలకు అందుబాటులోనికి తెచ్చారు. కానీ మిగిలిన వేదశబ్దాల్ని రికార్డింగ్ చేస్తే సుమారు 2500 గంటల నిడివి గల రికార్డ్ తయారు కాగలదు. అందుకు అవదానిగారు ఒక్కనితో అది సాద్యమయ్యే పని కాదు. విద్వాంసులు, వదాన్యులు చేయూత నిస్తే అదేమంత కష్టమైన పని కాదంటారు అవదానిగారు. ఆవిదంగా మన వేద విజ్ఞానాన్ని పరిరక్షించు కున్న వాళ్ళమౌతారు.
 
పరమాణు భౌతిక శాస్త్రంలో ఎం.ఏ చేసిన అవదానిగారు తనకు ఆసక్తి కరమైన వేదాలలోని యజుర్వేదం నేర్చుకున్నారు. ఏదైనా శాస్త్రం నేర్చుకోవాలనే అభిలాషతో 'మిమాంస ' శాస్త్రం నేర్చుకున్నారు. ఆ తర్వాత ఎమ్మె సంస్కృతం, జ్యోతిషం, చేశారు. అదే విదంగా ''వేదాల్లో సైన్సు '' ''భూకంపాలు '' '' జ్యోతిషం'' అనే అంశాలమీద పీ.హెచ్.డీలు చేశారు. తాను చేసిన బహుభాషా మల్టీమీడియా వేది డేటాబేస్ డిజైన్ కి భారత ప్రభుత్వం పేటెంట్ ఇచ్చి, ''సంస్కృత మిత్ర '' బిరుదుతో సత్కరించింది.
"https://te.wikipedia.org/wiki/రేమెళ్ళ_అవధానులు" నుండి వెలికితీశారు