మాల్గుడి కథలు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 19:
==మాల్గుడి కథలగురించి-టూకీగా==
*'''జ్యోతిష్కుడి జీవితంలో ఒకరోజు ''':ఎన్నో ఏళ్ళక్రితం, ఈజ్యోతిష్కుడు,200మైళ్ళ అవలనున్న వూరినించివచ్చాడుమల్గుడికి.జ్యోతిష్యంరాకపొయిన తన మాటలచాతుర్యంతో,తెలివితేటలతో ప్రజలను మాయపెట్టి,మభ్యపెట్టి జీవనం కొనసాగిస్తున్నాడు.తనవూరినింఛి హఠాత్తుగా ఎందుకొచ్చాడో,అజ్ఞాతంగా బ్రతుకుతున్నవిషయం ఎవ్వరికి తెయదు.ఒకరోజు సాయంత్రం,చిక్కట్లు కమ్మిన వేళ తనవద్దకు జాతకం చెప్పించుకోవటానికి వచ్చిన వ్యక్తిని చూసి అవాక్కు అవ్వుతాడు.ఎవ్వరావ్యక్తి?ఏమిటాకథ?
*'''తప్పిపోయిన వుత్తరం''':ఇప్పుడంటే అంతా '''సెల్లు'''మయం.ఎవ్వరిచేతిలో చూసిన పిడెకెడంత సెల్లు చేసే హంగామా అంతాఇంతాకాదు.శుభమైన,అశుభమైన,అవసరమైన,అనవసరమైన అంతా సొల్లు సెల్లుమయమే. ఇందుగలదు,అందులేదని సందేహం వలదు,ఎందెందు చూసిన అందందే చెవికి అతుక్కుపోయి సెల్లుదర్సనమిస్తుంది.కాని 50-60సంవత్సరాలక్రితం ఒకరినుంచి మరొకరికిసమాచారాన్ని చేరవేసె ఉత్తమసాధనము '''వుత్తరము '''.అప్పటికి టెలిఫొనులు సామాన్యులకు అందుబాటులో లేనిరోజులవి.పేదవాడైన,పెద్దవాడైన సమాచారం కావాలన్నా,పంపాలన్నా తపాలే ఆధారం.అండుకే అప్పుడు ఇంటింటికి వుత్తరాలను చేరవేసె తపాలా మనిషి/పోస్ట్మాన్(post man),ప్రతి ఇంటివారికి అవసరమైనవాడే.ప్రతిరోజు పోస్టుమేన్ వచ్చెసమయానికి అప్తుడయ్యిన మనిషికై చూసినట్లు ఎదురుచూసేవారు.పోస్టుమేన్ కూడా అలాగే గ్రామస్తులతో కుటుంబ సభ్యుడులా మెలిగేవాడు.శుభవార్తతెచ్చినప్పుడు వారిసంతోషంలో తాను పాలుపంచుకొనేవాడు,అశుభవార్త అయ్యినచో వారితోపాటూ తాను దుఃఖంలో పాలుపంచుకొనేవారు.ఈ కథలోని పోస్టుమేన్ కూడా అచ్చు ఆలాంటి వాడే.అంతరితలలో నాలికలా వుండేవాడు.ముఖ్యంగా మల్గుడిలోని,వినాయకవీధిలోని 10వ నెంబరు ఇంటిలోని రామానుజం తో మరింత సన్నిహితంగా వుండేవాడు.రామానుజం కూతురు కామాక్షి పుట్టినప్పడినుండి,కామాక్షికి పెళ్ళీడురాగానే పోస్టుమేన్ ఒకమంచి డిల్లీసంబంధం కుదిర్చాడు.వరుడు ఉన్నతశిక్షణకై 20రోజుల్లో వెళ్ళవలసిరావటం,అతరువాత 3సంవత్సరాలవరకు పెళ్ళిచేయుటకు కుదరదు.అందువలన 20రోజుల్లో పెళ్ళిజరగాలి.రామానుజం సమయంతక్కువగావుందని,ఈలోపు జరుగగూడని అశుభం ఏదైన జరిగినచో పెళ్ళి మూడుసంవత్సరాలు వాయిదా పడుతుందని కంగారుపడగా భయంవలదని ధైర్యం చెప్పి,పోస్టుమేన్ దగ్గరుండి,అన్నితానై ఆశుభకార్యం పూర్తి చేస్తాడు.పెళ్లిజరిగిన15 రోజులకు పోస్టుమేన్ ఒకవుత్తరం,ఒక టెలిగ్రాం
==మూలాలు==
|