అరుణాచల్ ప్రదేశ్లోప్రదేశ్లో నది ప్రవేశించిన చోట ఈ నది పేరు ''సియాంగ్'' అక్కడ చాలా ఎత్తు నుంచి చాల వేగంగా కిందికి దిగుతుంది. పర్వత పాద ప్రాంతంలో ఈ నదిని [[దిహంగ్]] అంటారు. అక్కడ నుండి 35 కిలోమీటర్లు ప్రవహించాక [[దిబంగ్]], [[లోహిత్]] అనే మరో రెండు నదులతో సమాగమం అవుతుంది. ఈ సంగమ కేంద్రం నుండి ఈ నది చాలా వెడల్పు అవుతుంది, ఇక్కడ నుండి ఈ నది బ్రహ్మపుత్రగా పేరొందింది. సియాంగ్, దిబంగ్, లోహిత్ నదులు జల విద్యుదుత్పత్తికి ఎంతో అనుకూలమైనవి. భారత ప్రభుత్వం వీటి మీద ఆనకట్టలు కట్టడానికి కృషి చేస్తోంది. అస్సాంలో ఈ నది వెడల్పు కొన్ని చోట్ల 10 కిలోమీటర్లు దాకా ఉంటుంది. జోర్హాత్ కి దగ్గరలో రెండు పాయలుగా విడిపోయి 100 కిలోమీటర్ల దిగువన కలవడం ద్వారా ఈ నది [[మజూలి]] అనే ద్వీపాన్ని ఎర్పరుస్తోందిఏర్పరుస్తోంది. మజూలి ప్రపంచంలోనే అతి పెద్దదైన నదీ ద్వీపం. గౌహతి దగ్గర్లో [[హజో]] అనే గ్రామం దగ్గర షిల్లాంగ్ పీఠభూమిని కోసుకుంటూ ప్రవహించడంవల్ల నది వెడల్పు చాలా సన్నగా మారుతుంది. ఎన్నో శత్రు దాడులను ఎదుర్కోవడానికి ఈ విశాలమైన నది అస్సాంకి అండగా ఉండేది. నది సన్నబడ్డ ప్రాంతం దగ్గరే [[సరాయ్ ఘాట్]] యుద్ధము జరిగింది. ఇక్కడ నదిపై నిర్మించిన రైలు రోడ్డు వంతెనకు [[సరాయ్ ఘాట్ వంతెన]] అని పేరు పెట్టారు. మజొలి ద్వీపం ఈ నది మధ్య లొమధ్యలో కలదు. ఇది జొర్హట్ కు సమీపం లొసమీపంలో కలదు.
బ్రహ్మపుత్ర యొక్క పురాణ సంస్కృత నామం ''లౌహిత్య''. దీనినుండే అస్సాంలో ఈ నదిని పిలిచే పేరు ''లుయిత్'' వ్యుత్పత్తి చెందింది. స్థానికంగా అక్కడ నివసించే [[బోడో]] లు ఈ నదిని ''భుల్లం - బుతుర్'', అని పిలుస్తారు. అంటే బోడో భాషలో 'గర గర శబ్ధం చేసేది' అని అర్ధం. దీన్నే ''బ్రహ్మపుత్ర'' అని సంస్కృతీకరించారు.