వర్గం:తెలుగు రంగస్థల నటులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
 
[[వర్గం:తెలుగు నాటకరంగం]]
 
పారుపల్లి సుబ్బారావు : కృష్ణా జిల్లా శ్రీకాకుళం లో జన్మించారు.స్ఫురద్రూపం , చక్కని గాత్ర మాధుర్యం. తమ అన్నగారు పారుపల్లి రామకృష్ణయ్య పంతులు ( డా.మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారి గురువు) గారి సంగీతాన్ని నేర్చుకొని, మైలవరం కంపెనీలో నాటి ప్రసిద్ధ సంగీత దర్శకుడు ( పరబ్రహ్మ పరమేశ్వర -ప్రార్థనా గీతానికి సంగీతాన్ని సమకూర్చిన వారు) పాపట్ల కాంతయ్య గారివద్ద మరాఠీ , పార్సీ సంప్రదాయ రీతుల్ని అభ్యసించారు.స్త్రీ పాత్రధారణకు ప్రసిద్ధి.రసపుత్ర విజయం లో విమల, లవకుశ లో రాముడు ఇంకా సావిత్రి,లీలావతి పాత్రలను పోషించారు.
 
పులిపాటి వెంకటేశ్వర్లు : గుంటూరు జిల్లా తెనాలి లో 1890 సెప్టెంబర్ 15న జన్మించారు.11వ ఏట రంగస్థలం పై ప్రవేశించి స్థానం నరసింహా రావు,బందా కనకలింగేశ్వర్ రావు,బళ్ళారి రాఘవ వంటి మహామహుల సరసన మద్రాసు,మైసూరు,మహారాష్ట్ర,బెంగాల్ వంటి ప్రాంతాల్లో ప్రదర్శనలనిచ్చారు.నాటకాలలో అర్జునుడు,నక్షత్రకుడు,భవానీ శంకరుడు,సుబుద్ధి,చెకుముకి శాస్త్రి,వెంగళరాయడు,భరతుడు,నారదుడు పాత్రలను పోషించడమే కాక, సినిమా రంగం లో ప్రవేశించి చింతామణిలో భవానీ శంకరుడు,హరిశ్చంద్ర లో నక్షత్రకుడు,సారంగధరలో సుబుద్ధి,పాశుపతాస్త్రం లో నారదుడు గా నటించారు. మోహినీ రుక్మాంగద, సతీ తులసి, చంద్రహాస, తల్లిప్రేమ, విష్ణుమాయ చిత్రాల్లో వివిధ పాత్రలు పోషించారు.వీరికి రెండుసార్లు గజారోహణం జరిగింది.1960లో సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ లభించింది.