అంగ్ సాన్ సూకీ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
||
పంక్తి 12:
== వ్యక్తిగత జీవితం ==
ఆంగ్ సాన్ సూకీ 1945 జూన్ 19 తారీఖున రంగూన్ (ప్రస్తుతం యాంగన్) లో పుట్టింది. ఆమె తండ్రి అయిన ఆంగ్ సాన్ 1947 లో బర్మా సైన్య స్థాపకుడే కాక బర్మీయుల స్వాతంత్రం కొరకు ఆంగ్లేయులతో దౌత్యం నడిపాడు. అదే సంవత్సరం ఆయన తన రాజకీయ శత్రువుల చేత కాల్చి చంపబడ్డాడు. ఆమె తన తమ్ములైన సాన్ లిన్ మరియు ఆంగ్ సాన్ ఊ తల్లి పోషణలో బర్మాలో నివసించారు. ఆంగ్ సాన్ ఊ తమ ఇంటి వద్ద ఉన్న అలంకార సరస్సులో పడి తన ఎనిమిదవ సంవత్సరంలో మరణించాడు. పెద్ద సహోదరుడైన సాన్ లిన్ కాలిఫోర్నియా లోని [[శాన్ డియోగో ]] కు వలస వెళ్ళి తరువాత సంయుక్తరాష్ట్రాల పౌరుడు అయ్యాడు. ఆంగ్ సాన్ మరణించిన తరువాత కుటుంబం ఇన్యా లేక్ ప్రాంతానికి నివాసం మార్చుకున్నది. అక్కడ సూకీకి
సూకీ తల్లి ఖిన్కీ కొత్తగా రూపొందించబడిన బర్మా ప్రభుత్వంలో రాజకీయ ప్రాముఖ్యత సంపాదించింది. 1960లో ఆమె భారతదేశప్రభుత్వానికి మరియు నేపాల్ ప్రభుత్వానికి రాజకీయ ప్రతినిధులను నియమించింది. ఆమెను అనుసరించిన ఆంగ్ సాన్ సుకీ ఢిల్లీ లోని జీసెస్ అండ్ మేరీ స్కూల్ కాన్వెంటులో విద్యాభ్యాసం పూర్తిచేసి న్యూఢిల్లీ శ్రీ రాం కాలేజ్లో పట్టభద్రురాలైంది. ఆమె 1964లో పొలిటికల్ పట్టభద్రురాలైంది. సూకీ తన విద్యాభ్యాసం కొనసాగించి 1969లో ఆక్స్ఫర్డ్ హాస్ కాలేజ్ నుండి ఫిలాసఫీ, పాలిటిక్స్ మరియు ఎకనమిక్స్ మాస్టర్ డిగ్రీ పొందింది. విద్యాభ్యాసం తరువాత ఆమె కుటుంబ మిత్రుడూ ఒకప్పుడు బర్మా పాప్ గాయకుడు అయిన మా తాన్ ఈ తో [[న్యూయార్క్]] నగరంలో నివసించింది. ఆమె సంయుక్త రాష్ట్రాలలో మూడు సంవత్సరాలు ప్రణాళిక వ్యవహారాల శాఖలో పని చేసింది. 1971లో సూకీ టిబెటన్ సంస్కృతి స్కాలర్" డాక్టర్ మైకేల్ ఆరిస్" ను వివాహం చేసుకుని భూటాన్లో నివసించసాగింది.
1988లో బర్మాకు తిరిగి వచ్చిన సూకీ ప్రారంభంలో రోగగ్రస్థురాలైన తల్లి కొరకు అక్కడే ఉండి పోయింది. తరువాత మెల్లగా ప్రజాస్వామ్య ఉద్యమానికి నాయకత్వం వహించింది.
పంక్తి 37:
ఆంగ్ సాన్ సూకీ 21 సంవత్సరాల కాలంలో 15 సంవత్సరాలు గృహనిర్బంధంలోనే జీవితం గడిపింది. ఆమె రాజకీయజీవితం ఆరంభించిన కాలం నుండి ఆమెకు అనేక సందర్భాలలో తనపార్టీ నాయకులతో సమావేశాలు, విదేశీ అతిధులతో కలయిక వంటివి నిరాకరించబడ్డాయి. సూకీ ఒక ముఖాముఖిలో తాను గృహనిర్బంధం లో ఉన్న సమయయంలో ఆమె తన భర్త పంపిన మనస్తత్వ పుస్తకపఠనం, రాజకీయాలు మరియు జీవితకథలను చదవడంతో గడిపానని వివరించింది. ఆమె కొన్నిమార్లు పియానోవాయించడం, అనుమతించిన అతిధులతో సమావేశాలు వంటి వాటితో ఆమె సమయం గడిచింది. మాధ్యమం కూడా సూకీని చూడడానికి వీలుపడకుండా కట్టడి చేయబడింది. 1994 సెప్టెంబర్ 20 తేదీన పత్రికా సంపాదకుడైన మౌరిజియో జియూలినో ఆమె చాయాచిత్రాలు తీస్తున్న సమయంలో అధికారులతో అడ్డగించబడి ఫొటో ఫిలిం, టేపులు మిగిలిన వ్రాతలు స్వాధీనం చేసుకొనబడ్డాయి. బదులుగా ఆమె గృహనిర్బంధ కాలంలొ 1994 లో బర్మా నాయకుడైన జనరల్ ఖిన్ న్యుయంట్ తో మొదటిసారిగా సమావేశం జరిగింది. సూకీ ఆరోగ్యం క్షీణించి కొన్ని సందర్భాలలో ఆసుపత్రిలో చేర్చబడింది.
బర్మా ప్రభుత్వం సూకీని అడ్డగించి గృహనిర్బంధం లో పెట్టడం బర్మాదేశం సమాజ శాంతి భద్రత లను మరియు దేశ స్థిరత్వాన్ని భూస్థాపితం చేసినట్లు భావించబడింది. 1975లో అమలు చేయబడిన "స్టేట్ ప్రొటెక్షన్ ఏక్ట్" (ఈ చట్టం ప్రభుత్వానికి ప్రజలను విచారణ లేకుండా ఐదు సంవత్సరాల కాలం నిర్బంధం లో ఉంచడానికి అనుమతిస్తుంది) మరియు సెక్షన్ 22 చట్టం " తిరుగుబాటు దార్ల ప్రమాదం నుండి దేశాన్నిరక్షించాలి " అన్న కారణంతో అమలుకు తీసుకురాబడింది. ఆమె తన విడుదల కొరకు వదలకుండా అప్పీలు చేస్తూనే వచ్చింది. 2010 నవంబర్ 12 న నిరంకుశ ప్రభుత్వం నేపథ్యంలో పనిచేసిన " యూనియన్ సాలిడారిటీ అండ్ డెవలప్ మెంట్ పార్టీ (యు.ఎస్.డి.పి)ఎన్నికలలో గెలిచిన తరువాత దాదాపు 20 సంవత్సరాల
=== ఐక్యరాజ్యసమితి జోక్యం ===
ఐక్యరాజ్యసమితి (యు.ఎన్) జుంటా మరియు సుకీ
ఐఖ్యరాజ్యసమితి ప్రత్యేక దూత రాజాళీ ఇస్మాయిల్ " ఆంగ్ సాన్ సుకీ " ని కలుదుకున్నాడు. బర్మాలో తిరిగి ప్రవేశించడానికి అనుమతించని కారణంగా ఇస్మాయిల్ తన పదవికి రజీనామా చేసాడు. 2006లో ఇబ్రహీం గాంబారి " యుఎన్ అండర్ సెక్రెటరీ-జనరల్ (యు.ఎస్.జి) ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ పొలిటికల్ అఫైర్స్ " ఆంగ్ సాన్ సుకీని కలుసుకున్నాడు. 2004 తరువాత సుకీతో విదేశీదూత సమావేశం ఇదే. అదే సంవత్సరం తరువాత మరొకసారి అయన సుకీని కలుసుకుని సంభాషించాడు. 2007 అక్టోబర్ 2వ తేదీన గాంబారి తిరిగి వచ్చి షూ మరియు ఇతర సభ్యులను కలుసుకున్న తరువాత నైపిడాలో సుకీతో సంభాషించాడు. బర్మా టెలివిషన్ గాంబారి మరియు సుకీ సమావేశం ప్రసారం చేసింది. ఖైదు చేసిన నాలుగు సంవత్సరాల అనంతరం సుకీ మాధ్యమంలో కనిపించడం ఇదే మొదటి సారి.
|