పురాతనకాలం నుండీనుండి ఒమన్ ఒక ముఖ్యమైన వర్తక కేంద్రం. 1508లో [[మస్కట్]] నౌకాశ్రయాన్ని పోర్చుగీసువారు ఆక్రమించారు. కాని 1650లో స్థానికులు వాళ్ళను వెళ్ళగొట్టారు. 1659లో [[ఒట్టొమన్ సామ్రాజ్యం]] ఒమన్ను ఆక్రమించింది. 1741లో వారిని ఓడించి సుల్తాన్ అహ్మద్ బిన్ సయిద్ రాజ్యపాలన ప్రాంభించాడు. అప్పటినుండి ఇప్పటివరకూ అదే సుల్తానుల వంశపాలన సాగుతున్నది. మధ్యలో (1743 నుండి 1746 వరకు) కొద్దికాలం ఒమన్ను పర్షియా ఆక్రమించింది.
పంక్తి 343:
== ఒమన్లో భారతీయులు ==
ఒమన్లో షుమారు 350,000 మంది భారతీయులు ఉన్నారు <ref name=indemb-oman>http://www.indemb-oman.org/indo_oman_community.shtml</ref>. అంటే మొత్తం 560,000 విదేశీయులలో 60% పైగా భారతీయులే అన్నమాట. వీరు దేశంలో దాదాపు అన్ని ప్రాంతాలనుండీప్రాంతాలనుండి వచ్చినవారు, అన్ని మతాలకు చెందినవారు ఉన్నారు. కాని కేరళ, తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలనుండి వచ్చినవారు అధికంగా ఉన్నారు. గమనించదగిన మరో ముఖ్యమైన విషయమేమంటే భారతీయులు దాదాపు అన్ని రంగాలలోనూ పనిచేస్తున్నారు. సామాన్యమైన (ప్రత్యేక నైపుణ్యం అవుసరంఅవసరం లేని) కూలిపనులు చేసేవారు, సాంకేతిక, వ్యాపార నిపుణులు, డాక్టర్లు, ఇంజినీరులు, దుకాణాలు నడిపేవారు, ఇంటిలో పనిమనుషులుగా పనిచేసే మహిళలు, మేనేజర్లు - ఇలా దాదాపు అన్నిరంగాలలోనూ విస్తరించి ఉన్న భారతీయ పౌరులు ఒమన్ ఆర్ధిక వ్యవస్థ అభివృద్ధిలో ఒక ముఖ్యమైన పాత్ర నిర్వహిస్తున్నారు. దేశంలో షుమారు 2000 మంది భారతీయ డాక్టర్లు ఉన్నారని అంచనా.
పంక్తి 349:
15వ శతాబ్దంనుండీశతాబ్దంనుండి ఒమన్-భారత దేశాల మధ్య వర్తక సంబంధాలున్నాయని చరిత్రకారులు గుర్తించారు. ముందుగా గుజరాత్ (కచ్), సంధ్, ఖోజా (లవాతియా) ప్రాంతాలవారు వర్తక వాణిజ్యాలలో ప్రముఖ వర్గంగా ఉండేవారు. హిందూ వర్తక సంఘం (బనియా)వాఱు ఇక్కడ 'హిందూ మహాజన్ సంఘం' గా గుర్తించబడ్డారు. చిరకాలంనుండి ఉన్న కుటుంబంవారు 8 తరాలనుండి ఇక్కడే ఉన్నట్లు పేర్కొన్నారు.
భారతీయులలో హిందువులకోసం మస్కట్లో రెండు హిందూ దేవాలయాలు ఉన్నాయి. వాటిలో శివాలయం 100 ఏండ్ల కంటే పురాతనమైనదని అంటారు. కంపెనీ క్యాంపు ప్రాంతాలలో గురుద్వారా, అమ్మవారి మందిరం వంటి ప్రార్ధనా సదుపాయాలున్నాయి. 1996 డిసెంబరులో అమలుచేయబడ్డ దేశపు మౌలిక న్యాయ చట్టం ద్వారా ఎవరైనా స్వేచ్ఛగా ప్రార్ధన చేసుకొనే సదుపాయం కల్పించారు.