నాయక్ (సినిమా): కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
సుల్తాన్ ఖాదర్ (చర్చ | రచనలు) |
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
||
పంక్తి 48:
చెర్రీ (చరణ్) సరదా కుర్రాడు. సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తుంటాడు. అనుకోకుండా బాబాయ్ జిలేబి (బ్రహ్మానందం) కారణంగా హీరోయిన్ మధు(కాజల్) పరిచయమవుతుంది. ఆమెతో ప్రేమలో మునిగి తేలుతున్న తరుణంలో, సమాంతరంగా మరో కథ నడుస్తుంటుంది. రౌడీలను, డిఐజిని చెర్రీ చంపడం, అతగాడి కోసం సిబిఐ వెదుకుతుండడం. తీరా విశ్రాంతికి వచ్చేసరికి చంపుతున్నది చెర్రీ కాదని, అతగాడిలాగే వుండే సిద్ధార్థ నాయక్(చరణ్) అని తేలుతుంది. దీంతో కథ ఫ్లాష్బ్యాక్లో కలకత్తాకు చేరుతుంది. కలకత్తాలో డాక్టర్గా పనిచేస్తున్న రాజీవ్ కనకాల బావమరిది ఈ సిద్ధార్థ. అనుకోని పరిస్థితుల్లో రావత్ (ప్రదీప్రావత్) అనుచరుడి చేతిలో హతమవుతాడు రాజీవ్. దాంతో సిద్దార్థ ఆ అనుచరుణ్ణి చంపేస్తాడు. అప్పటికే రావత్ అతగాడి అనుచరుల చేతుల్లో విలవిలలాడుతున్న కలకత్తా జనం అతగాడిని తమ నాయకుడిగా భుజాలకెత్తుకుంటారు. దీంతో సిద్దార్ధ తన జనంతో, బలంతో రావత్ ఆటలు కట్టించేందుకు ప్రయత్నిస్తాడు. దానికి ప్రతిగా అతగాడు సిద్దార్ధను తీవ్రంగా గాయపరిచి, మరణించాడనుకుని, గంగానదిలో పారేస్తాడు. బతికొచ్చిన సిద్దార్థ మరోసారి రావత్ను చంపాలని ప్రయత్నించడంలో, చెర్రీ పాత్రతో జతకలుస్తుంది. చివరకు ఏం జరిగిందన్నది మిగిలిన కథ.
సాధారణంగా ఫ్యాక్షన్ సినిమాలు లేదా ఫ్లాష్బ్యాక్ భారీగా వున్న సినిమాలు రెండో సగం నుంచి ప్రారంభమై, ఇంటర్వెల్ బ్యాంగ్ దగ్గర వెనక్కు ప్రయాణిస్తాయి. ఒకే హీరోలో రెండు రకాల షేడ్స్ను ప్రేక్షకులు చూస్తారు. అయితే ఈసారి దర్శకుడు వినాయక్ కొత్త ప్రయోగం చేసాడు. రెండు షేడ్స్తో ఒక హీరో కాకుండా డబుల్రోల్ను ఎంచుకున్నాడు. అయితే రాముడు భీముడు దగ్గర నుంచి అదుర్స్ వరకు ఇదీ కొత్త కాదు. కొత్తేమిటంటే, రెండు క్యారెక్టర్లు మన కళ్ల ముందు కదుల్తున్నా, ఇంటర్వెల్ బ్యాంగ్ వరకు పసిగట్టకపోవడం. స్క్రిప్ట్ను అంత పకడ్బందీగా తయారు చేసుకున్నందుకు మెచ్చుకోవాలి. అయితే ఒకసారి విషయం తెలిసాక, మలి సగం వ్యవహారం పాత చింతకాయపచ్చడి అయిపోయాక, సినిమాలో పసందు తగ్గిపోయింది. ఇంటర్వెల్ కాగానే ‘ఇంకేముంది..్ఫ్లష్బ్యాక్, హీరోకి అన్యాయం, పగతీర్చుకోవడం, చివర్లో శుభం కార్డు’ అని ప్రేక్షకులు ఓ అవగాహనకు వచ్చేస్తారు. పైగా ఈ మలి సగాన్ని డీల్ చేయడంలో కూడా పెద్దగా కొత్తదనం కోసం దర్శకుడు అస్సలు ప్రయత్నించలేదు. క్లయిమాక్స్ ముందు హీరోలను ఒకదగ్గరికి చేర్చడం ‘అదుర్స్’ను, రౌడీలను గదులో పెట్టి సాపు చేయడం ‘శివాజీ’ని గుర్తుచేస్తాయి. క్లయిమాక్స్ ఈ కాలంలో తీయాల్సింది కాదు. రాఘవేంద్రరావు సినిమాల టైపు. చిరంజీవి కాలం పాటనే కాదు, క్లయిమాక్స్ను కూడా రీమిక్స్ చేసినట్లుంది.
సినిమా అవుట్ అండ్ అవుట్ రామ్చరణ్ చుట్టూ తిరిగింది. అతగాడు కూడా తన డైలాగ్ మాడ్యులేషన్ను బాగా మెరుగుపర్చుకున్నాడు. డ్యాన్స్లు
థమన్ నేపథ్యసంగీతం బాగుంది. ‘శుభలేఖ రాసుకున్నా’ పాటను చెడగొట్టకున్నా, చిత్రీకరణ పెద్దగా ఆకట్టుకోలేదు. లొకేషన్ అద్భుతంగా వున్నా, నృత్యరీతులు సరిగ్గా కుదరలేదు. ‘యవ్వారమంతా ఏలూరే’ పాట హుషారుగా సాగింది. లైలా ఓ లైలా పాట సంగీతాన్ని మళ్లీ డిస్కో కాలం నాటికి తీసుకెళ్లింది. సినిమాకు భారీతనం తేవడానికి ఫైట్లను మరీ పీక్కు తీసుకెళ్లిపోయారు.
ఇవన్నీ ఇలా వుంటే, ఫ్లాష్బ్యాక్ అంత వున్నాక, ఏవీ తెలియనట్లు సిబిఐ మొదటి సగంలో వెదుకులాడడం ఏమిటో?
|