రబ్బరుగింజల నూనె: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 27:
 
రబ్బరువిత్తనంల నుండి నూనెను రోటరి మిల్లులు, స్క్రూప్రెస్ (ఎక్సుపెల్లరు)ల ద్వారా నూనెను తీయుదురు. సాల్వెంట్‌ ప్లాంట్ ద్వారా ఎక్కువనూనెను విత్తనంలనుండి పొందు అవకాశం వున్నను, ఇండియాలో సాల్వెంట్‌ ప్లాంట్ ద్వారా నూనెను తీస్తున్నట్లు వివరాలు లభ్యం కాలేదు.
రబ్బరుతోటలసాగు కేరళలో అధికంగా వున్నప్పటికి, రబ్బరువిత్తనంల నుండి నూనెతీయు పరిశ్రమలు మాత్రం [[తమిళనాడు]]లో వున్నాయి. తమిళనాడులోని అరుపుకొట్టాయ్‌, థెంగాసి, మరియు నాగర్‌కోయిల్‌లో అధికంగా రబ్బరువిత్తనముల నుండి నూనెతీయు పరిశ్రమలున్నాయి. యిందుకుకారణం కేరళలో విత్తనదిగుబడి సమయంలో అక్కడ వర్షంఎక్కువగా పడుతుండటం మరియు వాతవరణంలోవాతావరణంలో తేమఅధికంగా వుండటం వలన విత్తనంనెమ్ము ఎక్కె అవకాశం వున్నది. అదే సమయంలో తమిళనాడులో వాతవరణ అనుకూలంగా వుండటం వలన నూనెతీయు పరిశ్రమలు అక్కడ అభివృద్ధిచెందాయి.
 
తాజాగా సేకరించిన విత్తనాలలో తేమశాతం 25 % వరకు వుండును. విత్తనాలను కళ్లంలో ఆరబెట్ట్టి తేమ శాతంను 6-8 % కు తగ్గించెదరు. కొన్నిపరిశ్రమలో 'రోటరొ డ్రయరు 'ద్వారా తేమను తగ్గించెదరు, గాలిని 60-70<sup>0</sup>Cవరకు వేడిచేసి రొటరి డ్రమ్‌కు పంపి విత్తనాలను వేడిచేసి విత్తనాలలోని తేమను తగ్గించెదరు. ఎక్కువవుష్ణొగ్రత కారణంగా ఉత్పత్తి అగునూనె రంగు పెరుగును. అందుచే 60-70<sup>0</sup>Cవరకు మాత్రమే వేడిచేసిన గాలిని పంపెదరు. చిన్నకెపాసిటివున్న పరిశ్రమలో విత్తనాలను కళ్లంలోఎండలో ఆరబెట్టెదరు. తేమ శాతంను 6-8% వరకు వున్న రబ్బరువిత్తనాలను మొదట జల్లెడ(screener)లో జల్లించి మట్టి పెళ్లలు, చిన్నచిన్నరాళ్ళు, పుల్లలవంటి వాటిని తొలగించెదరు.
"https://te.wikipedia.org/wiki/రబ్బరుగింజల_నూనె" నుండి వెలికితీశారు