సాయంకాలమైంది: కూర్పుల మధ్య తేడాలు

మొలక
 
కథ
పంక్తి 1:
{{మొలక}}
[[సాయంకాలమైంది]] [[గొల్లపూడి మారుతీరావు]] రాసిన ఒక నవల. దీనిని శ్రీ వైష్ణవ సాంప్రదాయ నేపథ్యంలో రాశారు. ఇది ఆంధ్రప్రభ వారపత్రికలో 2001 సంవత్సరంలో ధారావాహికగా వెలువడింది.
==కథ==
పద్మనాభం అనే ఊర్లోని పరమ నైష్ఠిక వైష్ణవ బ్రాహ్మణుల ఇంట జన్మించిన చిన తిరుమలాచార్యుల చుట్టూ కథ పరిభ్రమిస్తూ ఉంటుంది. అతని తల్లిదండ్రులు సుభద్రాచార్యులు, వరదమ్మ. అదే ఊళ్ళోని కుంతీనాథ స్వామిని ఆరాధిస్తూ జీవనం సాగిస్తుంటారు. మొదట్లో తండ్రి అడుగు జాడల్లోనే అర్చకత్వం నేర్చుకుంటున్న చిన తిరుమలాచార్యుల ప్రతిభను గుర్తించిన వెంకటాచలం అతనికి ఆంగ్లవిద్య మీద ఆసక్తిని కలిగిస్తాడు. సుభద్రాచార్యులు మొదట్లో ఇందుకు అంగీకరించలేకపోయినా కొడుకు ఆసక్తిని గమనించి, వరదమ్మ, వెంకటాచలం, తదితరుల ప్రోద్భలంతో అందుకు అంగీకరిస్తాడు. చిన తిరుమలాచార్యులు నెమ్మదిగా పాఠశాల విద్య దాటి కళాశాలకు చేరుకుంటాడు. అక్కడి తన ప్రతిభకు ముగ్ధుడైన ఆచార్యులు అమెరికాలోని జెనరల్ ఎలక్ట్రిక్ సంస్థకు ఈ ప్రతిభను చేరవేస్తారు. చదువు పూర్తి కాగానే అమెరికాలో ఉద్యోగం వస్తుంది. అలా చిన తిరుమలాచార్యుల అందరినీ వదిలి అమెరికాకు ప్రయాణవుతాడు. ఇక్కడ తల్లిదండ్రులకు కుమారుడి మీద బెంగ మొదలౌతుంది. కానీ బయటకు చెప్పుకోలేరు. చివరకు తల్లిదండ్రుల ఆఖరి చూపుకు కూడా నోచుకోలేక పోతాడు.
 
[[వర్గం:తెలుగు నవలలు]]
"https://te.wikipedia.org/wiki/సాయంకాలమైంది" నుండి వెలికితీశారు