సత్యహరిశ్చంద్రీయం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
|||
పంక్తి 14:
కాశీవిశ్వనాధుని దర్శించి వచ్చిన పిమ్మట నక్షత్రకుడు గడువు పూర్తైనదని ఋణము తీర్చమని ఒత్తిడి చేయగా, చంద్రమతిని, లోహితుని కాలకౌశికుడను బ్రాహ్మణునకు విక్రయించి, ఆ సొమ్ము నక్షత్రకునకీయగా, అది తన బత్తెమునకు సరిపోయినదని, గురువు గారి ఋణము తీర్చమనగా వీరబాహుడను కాటికాపారికి తనను తాను విక్రయించుకొనును. ఆ సొమ్ము నక్షత్రకునొసగి ఋణవిముక్తుడగును.
=== షష్ఠాంకము ===
కాలకౌశికుని ఇంట దాసిగా చంద్రమతి, వీరబాహుని సేవకునిగ వీరదాసు అను పేరుతో హరిశ్చంద్రుడు కుదిరినారు. చితుకలు తెచ్చుటకు కాలకౌశికుని శిష్యులతో అడవికి వెళ్లిన లోహితాస్యుడు పాము కాటుకు మరణించును. పని పూర్తగు వరకు కదలరాదని కాలకౌశికుని భార్య ఆజ్ఞాపించుటతో అర్ధరాత్రి వరకు ఇంటి పనులు చేసి పిమ్మట చంద్రమతి కుమారుని తీసుకొని హరిశ్చంద్రుడు కావలిగా ఉన్న సశ్మానమునకు కొని వచ్చి శవదహనము నకు పూనుకొనును. హరిశ్చంద్రుడు అది గమనించి కాటి సుంకము చెల్లింప కుండా శవదహనము కానింప రాదని గద్దించును. తన వద్ద సొమ్మేమి లేదనగా నగనేదైనా అమ్మి కాటిసుంకం చెల్లింప మనును. అంతట హరిశ్చంద్రుడు ఆమ మెడలో ఉన్న మాంగళ్యాన్ని ఏ ధరకైనా అమ్మమనును. వసిష్ఠుని వరము వలన భర్తకు దక్క తన మాంగల్యము ఎవరికి కనిపించదని, అందు చేత ఆమె అతని భర్త హరిశ్చంద్రుని గా గుర్తించును. ఇద్దరూ కుమారుని మరణమునకు వగచి, ఆమె యజమానురాలిని అడిగి సొమ్ము తీసుకురామని హరిశ్చంద్రుడు పలుకును. ఇంతలో విశ్వామిత్రుడు సృష్టించిన దొంగలు కాశీ రాజు కుమారుని వధించి సొమ్ములపహరించి, కాటి సుంకమును యజమానురాలి వద్ద తీసుకొనుటకు వచ్చుచున్న చంద్రమతి పై వడవైచి మాయమగుదురు. దొంగలను వెంబడించు రాజభటులు ఆమెనే దొంగగా, హంతుకురాలిగా భావించి రాజు వద్దకు కొనిపోవుదురు. ఆమె వద్ద దొంగసొత్తును చూసి, ఆమెను దోషిగా నిర్ధాకరించి రాజు, శిరచ్చేదము శిక్షగా విధించును. ఆమెను వధించు బాధ్యత కాటి
== పాత్రపోషణ ==
|