తరిమెల నాగిరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చిదిద్దుబాటు సారాంశం లేదు |
విశేషాలు వ్యాసంలో కలిసి వ్రాశాను |
||
పంక్తి 39:
పాఠశాల రోజుల నుండే సమాజములోని అసమానతలకు వ్యతిరేకంగా తిరుగుబాటు లక్షణాలు కనబరిచాడు. [[మద్రాసు]]లోని [[లయోలా కళాశాల]]లో ఇంటర్మీడియట్ (10+2) చదివేరోజుళ్ళో తన జాతీయతా భావాల కారణంగా కళాశాల యాజామాన్యానికి, ఆచార్యులతో నాగిరెడ్డికి పొసగలేదు. లయోలా కళాశాల యాజమాన్యము నాగిరెడ్డికి [[జవహర్ లాల్ నెహ్రూ]] బహిరంగ ఉపన్యాసాలకు హాజరైనందుకూ, రామస్వామి ముదలియార్ కు, సత్యమూర్తికి మధ్య జరిగిన ఎన్నికల ప్రచారములో పాల్గొన్నందుకు మరియు వ్యాసరచనా పోటీలలో మహమ్మద్ బిన్ తుఘ్లక్ ను ప్రశంసించినందుకు, అనేకసార్లు జరిమానా విధించింది.
నాగిరెడ్డి లయోలా కళాశాల తరువాత [[వారణాసి]], [[బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం]]లో విద్యనభ్యసించాడు. వారణాసిలో ఉన్న నాలుగేళ్ళలో నాగిరెడ్డి [[కమలాదేవి ఛటోపాధ్యాయ]], [[జయప్రకాశ్ నారాయణన్]], [[అచ్యుత్ పట్వర్ధన్]] వంటి వారిచే ప్రభావితుడయ్యాడు. కమ్యూనిజం మరియు మార్క్సిజంతో ఈయనకు వారణాసిలోనే పరిచయమయ్యింది. రష్యన్ విప్లవము మరియు స్టాలిన్ నాయకత్వము గురించి విస్తృతముగా చదివి, భారతదేశములో కూడా మార్క్సిజాన్ని అమలుచేయవచ్చని నమ్మటం ప్రారంభించాడు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో ఉపకులపతిని నిలదీశారు. మహాత్మాగాంధీకి అది తెలిసి తరిమెల నాగిరెడ్డి వైస్ ఛాన్సలర్కి క్షమాపణలు చెప్పాలని ఉత్తరం రాశారు. నాగిరెడ్డి అందుకు ఒప్పుకోలేదు. తిరస్కరించారు.
నాగిరెడ్డి తన ప్రభుత్వ వ్యతిరేక రాజకీయకలాపల వళ్ల అనేకమార్లు [[జైలు]]కు వెళ్లాడు. 1940లో రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ''యుద్ధం మరియు ఆర్ధిక వ్యవస్థపై దాని ప్రభావం'' అన్న పుస్తకం వ్రాసి ప్రభుత్వము యొక్క ఆగ్రహానికి గురై జైలుకు వెళ్ళాడు. తిరుచిరాపల్లి జైలునుండి విడుదల కాగానే మరలా 1941లో భారతీయ రక్షణ చట్టము కింద అరెస్టయ్యాడు. 1946లో ప్రకాశం ఆర్డినెన్సు కింద అరెస్టయ్యి 1947లో విడుదల చేయబడ్డాడు.
1968లో నాగిరెడ్డి సి.పి.ఐ (ఎం) నుండి విడిపోయి [[ఆంధ్ర ప్రదేశ్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ కమ్యూనిష్ట్ రెవల్యూషనరీస్]] (ఎ.పి.సి.సి.ఆర్) - ఆంధ్ర ప్రదేశ్ కమ్యూనిష్టు ఉద్యమకారుల సమన్వయ కమిటీని స్థాపించాడు. సి.పి.ఐ (ఎం) కార్యకర్తలను కొత్తపార్టీలోకి ఆకర్షించడంలో సఫలం అయ్యాడు. కొద్దికాలం ఎ.పి.సి.సి.ఆర్ [[అఖిల భారత కమ్యూనిష్టు ఉద్యమకారుల సమన్వయ కమిటీ]]లో కలసివుంది. రెడ్డి 1976లో తను మరణించేదాకా ఎ.పి.సి.సి.ఆర్ నాయకునిగా కొనసాగాడు.
నాగిరెడ్డి రచనలలో ముఖ్యమైనది ''ఇండియా మార్ట్గేజ్డ్'' (తాకట్టుపెట్టబడిన భారతదేశం). నాగిరెడ్డి [[1976]], [[జులై 28]]న మరణించాడు. ఆయన భౌతికకాయాన్ని తరిమెలకు తీసుకెళ్తుండగా కల్లూరు వద్ద పోలీసులు భౌతికకాయాన్ని అరెస్టు చేశారు. ప్రజలు తండోపతండాలుగా రావడంతో పోలీసులు వెనక్కి తగ్గారు. పోస్టుమార్టం తర్వాత భౌతికకాయాన్ని బంధువులకప్పగించారు.
==బయటి లింకులు==
*[http://naxalrevolution.blogspot.com/2006/09/legacy-and-history-of-indian-maoism.html భారతీయ మావోయిజం యొక్క చరిత్ర - తరిమెల నాగిరెడ్డి మరియు తెలంగాణా సాయుధ పోరాటానికి నివాళులు]
|