వీరమాచనేని ఆంజనేయ చౌదరి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:గుంటూరు జిల్లా ప్రముఖులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
వీరు 23 డిసెంబర్ 1891 తేదీన అనగా [[నందన]] నామ సంవత్సరం మార్గశిర మాసంలో గుంటూరు జిల్లాలోని [[దుగ్గిరాల]] గ్రామంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు కోటయ్య మరియు లక్ష్మమ్మ. చిన్నతనంలోనే తల్లితోపాటు ఆధ్యాత్మ రామాయణ కీర్తనలు పాడేవాడు. పెద్దగా చదువుకోలేదు. అయినా ప్రతిరోజు ఆంజనేయస్వామి గుడికి వెళ్ళి అర్చకులు చదివే శ్లోకాలను ఒక్కసారి విని తిరిగి చెప్పేవాడు.
 
పది సంవత్సరాల వయసులో తల్లిదండ్రులతో మేనమామల గ్రామం రేపల్లె తాలూకాలోని [[నల్లూరు (రేపల్లె)|నల్లూరు]] చేరారు. అక్కడ వ్యవసాయపనులు చేసుకొంటూ తీరికవేళల్లో పురాణ, హరికథా కాలక్షేపాలకు వెళ్ళి భారత, భాగవత, రామాయణ కథా విశేషాలను గ్రహించి అందులోని పద్యాలను కంఠస్థం చేశారు. కొందరు ఆచార్యులను స్నాన మంత్రాలు, సూర్యనమస్కారాలు మొదలైన వాటిని నేర్పడానికి తిరస్కరించారు. ఆ మంత్రాలను తాను ఎందుకు నేర్చుకోకూడదు అనే ఆలోచన మొదలై అన్వేషించారు. తమ పురోహితులు రఘునాయకులు గారు చదివే మంత్రాలకు ఆకర్షితులై వారు గ్రామంలో జరిపించే శుభాశుభ కార్యాలన్నిటికి హాజరై కర్మకాండను గ్రహించారు. కానీ మంత్రభాగం నేర్చుకోలేకపోయారు. కొంతకాలానికి ప్రతాపరామయ్య అనే అద్వైత వేదాంత గురువును ఆశ్రయించి వారిద్వారా శ్రీరామమంత్రోపదేశాన్ని పొందారు.
 
ఒకనాటి రాత్రి స్వామివారు కలలో ప్రత్యక్షమై తన నాలుకపై బీజాక్షరాల్ని వ్రాసి అంతర్ధానమయ్యారు. తదనంతరం సాధువులను ఆశ్రయించి వేదాంత తత్వాన్ని వింటూ పురాణ స్రవణం చేస్తూ పూజాపునస్కారాలు చేస్తూ కాలం గడిపారు.
 
[[వర్గం:1891 జననాలు]]