శ్యామశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 3:
==బాల్యం==
ఈయన అసలు పేరు "వేంకట సుబ్రహ్మణ్యము". ఈయన [[తంజావూరు]] జిల్లాలోని [[తిరువారూరు]] గ్రామంలో [[ఏప్రిల్ 26]] , [[1762]] న కృత్తికా నక్షత్రమున విశ్వనాధ అయ్యరు గారికి జన్మించిరి. వీరిని తల్లిదండ్రులు "శ్యామకృష్ణా" యని ముద్దుగా పిలిచేవారు. అదే ఈయన కృతుల లో ఈయన ముద్ర అయినది. ఈయన బంగారు [[కామాక్షి]] ఉపాసకుడు. అమ్మపై తప్ప వేరొకరి పై రచనలు చేయలేదు. ఈయన కలగడ, మాంజి, చింతామణి మొదలగు అపూర్వ రాగములను కల్పించాడు. [[త్యాగరాజు|త్యాగరాజా]]దులచే కొనియాడబడిన ఈయన లయజ్ఞానము శ్లాఘనీయమైనది. [[ఆనంద భైరవి]] రాగమన్న ఈయనకు చాల యిష్టమని చెప్తారు. ఆంధ్ర గీర్వాణ భాషా కోవిదుడై ఈయన కృతులలో ముఖ్యమైనవి: ఓ జగదంబా, హిమాచలతనయ, మరి వేరే గతి యెవ్వరమ్మా, హిమాద్రిసుతే పాహిమాం, శంకరి శంకురు, సరోజదళనేత్రి, పాలించు కామాక్షి, కామాక్షీ ([[స్వరజతి]]), కనకశైలవిహారిణి, దేవీ బ్రోవ సమయమిదే, దురుసుగా, నన్ను బ్రోవు లలిత, మొదలగునవి. ప్రఖ్యాత వాగ్గేయకారుడైన [[సుబ్బరాయశాస్త్రి]] ఈయన కుమారుడే.
==సంగీత సేవలుజ్ఞానం==
వీరు తెలుగు నందును, సంస్కృతమునందును పండితులు. తమ మేనమామ వద్ద సంగీత ఆరంభ పాఠములు అభ్యసించిరి. వీరు 18 వ యేట తలిదండ్రులతో తంజావూరు చేరుకొనిరి. అచట ఆంధ్ర పండితులైన సంగీత స్వామి అను సన్యాసి [[కాశీ]] నుండి దక్షిణ హిందూ యాత్రకు వచ్చి, అది చాతుర్మాసము గాన తంజావూరి లోనే ఆ నాలుగు నెలలు ఉండిపోయిరి. ఒక దినము శ్యామ శాస్త్రి గారి యింటిలో వారికి భిక్ష జరిగెను. భిక్ష జరిగిన వెనుక శాస్త్రి గారి తండ్రి తన కుమారుని ఆ సన్యాసి గారికి చూపి ఆశీర్వదింపగోరిరి. శ్యామశాస్త్రిని చూచిన వెంటనే అతడు గొప్ప పండితుదు కాగలడని సంగీతస్వామి తెలుసుకొనెను. అప్పటి నుండి సంగీత విద్య అభ్యసించిరి. తాళశాస్త్రము లోను, రాగ శాస్త్రములో అఖండ పండితుడైన సంగీతస్వామి వద్ద బాగుగా విద్యనభ్యసించిరి. చాతుర్మాసము కాగానే సంగీతస్వామి కాశీకి వెళ్ళునప్పుడు గాంధర్వ విద్యాగ్రంథముల నిచ్చి "నీవు సంగీత శాస్త్రమును సమగ్రంగా అభ్యసించితివి. తంజావూరు ఆస్థాన విధ్వాంసుడైన పచ్చి మిరియము ఆది అప్పయ్య గారి సంగీతమును తరచు విను చుండుము" అని చెప్పి వెడలిపోయిరి.
 
గురువాజ్ఞ ప్రకారమే శాస్త్రి గారు ఆది అప్పయ్య గారితో స్నేహము చేసికొని వారి గానమును తరచు వినుచుండిరి. అది అప్పయ్య గారికి శాస్త్రిగారనిన అపరిమిత ప్రేమ, భక్తియు నుండెడివి. ప్రేమతో "కామాక్షి" అని పిలుచుటయు కలదట.
==రచనలు==
వీరు మధురకు వెళ్లినపుడు మీనాక్షి దేవిని స్తుతించుచు తొమ్మిది కృతులు పాడిరి.("నవరత్నమాలిక") . శాస్త్రి గారి రచనలు కదళీపాకములు. వీరికి ఆనందభైవరీ రాగంపై అనురాగమెక్కువ యున్నట్లు కనిపించును. ఆనందభైరవిలో చాలా కృతులను రచించిరి. సాధారనముగా చాపుతాళము లో నెక్కువ కృతులు, స్వరజతులు రచించునట్లు తెలియుచున్నది.
 
==ఇంకా చూడండి==
"https://te.wikipedia.org/wiki/శ్యామశాస్త్రి" నుండి వెలికితీశారు