యలవర్తి నాయుడమ్మ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 25:
సామాన్య రైతు కుటుంబంలో పుట్టి పెరిగి శాస్త్ర సాంకేతిక రంగంలో ఉన్నత శిఖరాలను చేరుకొని మన దేశానికి ఖ్యాతిని ఆర్జించి పెట్టిన ప్రొఫెసర్ నాయుడమ్మ పలు ప్రతిష్టాత్మక హోదాలను అందుకున్నారు. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (న్యూఢిల్లీ) సంస్థకు డైరక్టరు జనరల్ (1971-77) గా ఉన్నారు. జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (న్యూఢిల్లీ) కి వైస్ ఛాన్సలర్ (1981) గా ఉన్నారు. మద్రాసు యూనివర్సిటీకి గౌరవాచార్యులుగా సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (మద్రాసు) కు డిస్టింగ్విష్ శాస్త్రవేత్తగా (1977) గా పలు సంస్థలలో వివిధ బాధ్యతాయుతమైన పదవులు నిర్వహించారు.
==వివిధ రంగాలలో విశేష పరిశోధనలు==
నాయుడమ్మ ఖనిజాలు, మొక్కలు, ఆల్డిహైడ్స్ మొదలైన వాటి కలయిక నిర్మాణ శైలి రంగాలలో కూడా విశేష పరిశోధనలు చేశారు. ఇవన్నీ తోళ్ళు పదును చేసే వినూత్న ఏజంట్స్ గా వివరించి, అంతర్జాతీయ గుర్తింపును పొందారు. "జన్మచేత రైతును, వృత్తిచేత అస్పృశ్యుడిని" అని తమ చర్మ శాస్త్ర సాంకేతిక పరిశోధనా వృత్తిని గురించి అప్పుడప్పుడు చమత్కరించేవారు. ఈయన పరిశోధనా కృషి ఫలితంగా మన దేశపు చర్మ తయారీ వస్తువులు అనేక వాటికి విదేశాలలో విశేషమైన ఆదరణ, గిరాకీ ఏర్పడ్డాయి. అంతేకాదు విజ్ఞాన వినిమయ కృషిలో అలీన దేశాలకు, ఇతర దేశాలకూ మధ్య రమణీయ సేతువుగా రూపొందారు. ప్రారంభం నుంచి మద్రాసు సి.ఆర్ ఆర్.ఐ లో సన్నిహిత సంబంధాలు పెంచుకున్నారు. దాని అభివృద్ధికి అహరహం శ్రమించారు. సంస్థ లోని వివిధ ప్రయోగ శాలలకు నూతన రూపు రేఖలు దిద్దారు. నూతన లాబరేటరీలను ప్రణాళికలను వేసి, డిజైన్ రూపకల్పన చేసి, స్థాపించజేశారు. అత్యాధునిక శైలిలో తోళ్ళ పదునుకు, శుద్ధికి పైలట్ ప్లాంట్ లను దేశ స్థాయిలో తొలిసాగిగా నెలకొల్పడానికి దోహదపడ్డారు. లెదర్ సైన్స్ మాసపత్రిక కు చాలాకాలం సంపాదకులుగా ఉన్నారు.
 
==పదవులు, పురస్కారాలు==
"https://te.wikipedia.org/wiki/యలవర్తి_నాయుడమ్మ" నుండి వెలికితీశారు