'''ఎ.పి.ఆర్కాట్ పార్థసారధి కోమల''' ({{lang-ta| ஏ.பி.கோமளா}}) (జ. ఆగష్టు 28, 1934)<ref name=imdb>{{IMDb name|0007298|Komala A. P.}}</ref> దక్షిణభారత దేశపు నేపథ్యగాయని.<ref name=imdb/> ఈమె 1950, 60వ దశకాల్లో తమిళం, [[మళయాలం]] మరియు [[తెలుగు]] భాషల్లో అనేక పాటలు పాడింది. రేడియో కళాకారిణి. తమిళనాడు ప్రభుత్వం ఈమెను కళైమామణి బిరుదంతో సత్కరించింది.
కోమల [[మద్రాసు]]లో జన్మించింది. ఈమె తల్లితండ్రులు పార్థసారధి, లక్ష్మి. మూడేళ్ళ వయసులోనే పాటలు పాడటం ప్రారంభించిన కోమలకు ఒక తెలిసిన వ్యక్తి రేడియోలో పాడే అవకాశం ఇచ్చింది. అదే సమయంలో రేడియోలో ఒకనాదస్వరం పాట పాడటానికివాయించటానికి [[రాజమండ్రి]] నుండి మద్రాసు వచ్చిన గాడవల్లి పైడిస్వామి ఆమె పాటను విని, ఆనందపడి, కోమలిని తనతో పాటు రాజమండ్రి తీసుకువెళ్ళి అక్కడ శాస్త్రీయ సంగీతంలో శిక్షణ ఇచ్చాడు. జన్మతః తమిళురాలైనా కోమల సంగీతం నేర్చుకున్నది తెలుగుదేశంలోనే.<ref>[http://www.starscolor.com/images/komala-a.p.-01.jpg కమ్మని కోమల గాత్రధారిణి</ref> ఈమె సినిమాలలో పాటిన తొలిపాట, చివరి పాట తెలుగు పాటలే కావటం విశేషం.
ఆలిండియా రేడియోలో ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన కోమల 1995లో పదవీ విరమణ పొందింది.