కాకతీయుల కళాపోషణ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Center|
==కాకతీయుల కళా విన్యాసం==
}}
పంక్తి 12:
ఆ తరువాత దశలో 1262 నుండి 1323 వరకూ పరాయి రాజుల దండ యాత్రలనుండి కాకతీయ సాంరాజ్యాన్ని కాపాడిన వారు రుద్రమదేవి. ప్రతాపరుద్రుడు. రుద్రమదేవి అనేక మంది సామంత రాజుల తిరుగుబాట్ల నోడించి సమర్థవంతంగా రాజ్య పాలన చేసింది. రెండవ రాజైన ప్రతాపారుద్రుడు అల్లావుద్దీన్ దండ యాత్రల్ని అనేక సార్లు త్రిప్పి కొట్టి చివరకు ఓడి పోయి బందీగా చిక్కి భరింప లేని కారాగార జీవితంతో ఆత్మహత్య చేసుకున్నాడు.
 
కాకతీయ చక్రవర్తుల లలితకళల్నీ, సారస్వతాన్నీ పోషించి వాటికి నూతన వికాసాన్ని కలిగించారు. వీరి కాలంలో నాట్య కళ బహుముఖాల విజృంబించి;రామప్పగుడిలో రమణీయనట్లు నృత్యాలు:అనేక శాసాల వల్లనూ, ఆనాటి శిల్పకళ వల్లనూ, సాహిత్యం వల్లనూ విదితమౌతోంది.
 
;కళాకారులకు ఘన సత్కారాలు:
శిల్పకళా విశిష్టతతో నిర్మితమైన రామప్ప గుడి వరంగల్ జిల్లా ములుగు తాలూకాలో వుంది. ఇది వరంగల్లుకు నలబై మైళ్ళ దూరంలో వుంది. ఈ గుడిని 1162 లో రుద్రసేనాని అనే రెడ్డి సామంతు కట్టించాడు. రామప్పగుడి ఆలయ నిర్మాణంలోని చిత్ర కౌశలం, శిల్ప నైపుణ్యం వర్ణిచనలవికానివి. ఈ కాకతీయ శిల్పచాతుర్యమంతా, ఇన్నేళ్ళు గడిచినా, ఈ నాటికి చూఫరులకు అమితానందాన్ని కలిగిస్తూంది. భరత నాట్య శాస్త్రమంతా మూర్తీ భవించి, స్థంబాలమీదా, కప్పులమీదా, కనబడుతుంది
దేవాలయ కైకర్యం చేశే నర్తకీ మణులకు, మృదంగ విద్వాసులకు, గాయకులకూ, గృహదానాలు చేసినట్లు పిల్లమఱ్ఱి శాసనంలో ఉదహరించ బడింది.
 
[[పానుగల్లు శాసనంలో ]] మైలాంబ గాయకులకు, నర్తకీమణులకు పై విధమైన గృహదానాలు చేసినట్లుంది. ధర్మ సాగర శాసనంలో ''జలబకరండ '' మనే అపూర్వమైన వాద్య ప్రశంస వుంది. ఈ కరండ వాద్యకారులకూ పది మంది, నాట్య కత్తెలకూ కొన్ని వివర్తనాల బూమిని ఇచ్చినట్లు వ్రాయబడివుంది.
రామప్ప గుడిలోని విగ్రహాలు, స్థంబాలపై ఉన్న శిల్పాలు ముఖ్యంగా దేవాలయ మంటపంపై కోణాల్లో నాలుగు పక్కలా పెద్ద నల్లారాతి నాట్య కత్తెల విగ్రహాలు అతి సుందరమైనవి. ఆ విగ్రహాల సొమ్ముల అలంకరణాలు, వాటి త్రిభంగీ నాట్య భంగిమలూ శిల్పకారుల్నే సమ్మోహితుల్ని చేస్తున్నాయి. దేవాలయం లోని స్థంబాలపై నాట్య భంగిమలు మృదంగాది వాద్యముల వారి రేఖలు చిత్రించబడి వున్నాయి. జాయన సేనాని రచించిన నృత్తరత్నావళిలో ఉదాహరించిన నాట్యశిల్పమంతా రామప్ప గుడిలో తొణికిసలాడుతూ వుంది.
 
[[చేబ్రోలు శాసనం]]లో కాకతి గణపతి దేవుడు నృత్తరర్నావళి రచయిత [[జాయప సేనాని]] పదహారు మంది ఆటకాత్తెలకు గృహ దానాలు చేసినట్లుంది.
;ముద్దుగుమ్మల మద్దెల ధ్వనులు:
 
;మాన్యాలు, సమ్మానాలు:
పాలంపేటలోని రామప్ప చెరువు కట్ట తూర్పు చివరనున్న దేవాలయంలోపలి భాగంలో స్త్రీలు మద్దెల వాయిస్తూ వుండగా, వివిద భంగిమలలో నృత్యం చేస్తున్న అనేక మంది ఆటకత్తెల శిల్పాలున్నాయి. అదే దేవాలయం పడమటి వైపు ద్వార బంధాలమీద మార్థంగికురాండ్ర శిల్పాలున్నాయి.
 
గుంటూరుజి ల్లా, గుంటూరు తాలూకా, మంచారమనే (నేటి మందిడం) మల్కాపురం శాసనంలో 1183 లో కాకతీయ మహారాణీ [[రుద్రమదేవి]] విశ్వేశ్వర శివాచార్యుడు స్థాపించిన గోళకీమత విద్యాస్థానానికి దేవాలయంలో పదిమంది నర్తకులకూ, ఎనిమిది మంది మార్థంగికులలూ, కాశ్మీరు గాయకునికీ, పద్నాలుగురు గాయనీ మణులకూ, కరడా వాద్యంలో ఆరితేరిన కళాకారులు ఆరుగురికీ, వృత్తి మాన్యాలిచ్చి నాట్య సంగీతాలకు పోష కల్పించినట్లుంది.
వరంగల్లు రుద్రమదేవి కోట ద్వారబంధంపై రాతి పలక మీద మార్థంగికురాండ్ర శిల్పాలు చెక్కబడి వున్నాయి.
 
శాసనాలతో పాటు కాకతీయ చక్రవర్తులు కట్టించిన అనేక దేవాలయాలమీద నాట్య సాంప్రదాయలను ప్రతిబింబించే అనేక మైన నాట్య శిల్పాలున్నాయి. అనేక దేవాలయాలు, శిల్పాలు తురుష్కుల దండ యాత్రల్లో చిన్నాభిన్నమైనాయి.
ఆ కోటలోనే స్వంభూ దేవాలయలో ఒక చిన్న శివ తాండవ నృత్య శిల్పముంది.
 
హనుమ కొండ వెయ్యి స్థంభాల గర్బగుడి ద్వార బంధాలమీడ వివిధ నాట్యాల నృత్య భంగిమలలో స్త్రీల శిల్పాలున్నాయి.
రెండవ ఆద్యాయం అంగనిరూపణ.,. మూడవ ఆద్యాయం, మండల లక్షణం, నాలుగవ ఆద్యాయం, కరణాంగ హార వివేచానికి సంబందించినది. ఐదవ ఆద్యాయం దేశి, స్థానక, కరణ, భ్రమరీ లక్షణాలను తెలుపుతూ వుంది. ఆరవ ఆధ్యాయం దేశ పాట, చారీలాస్యాంగగతి లక్షణమనే పేరు గలది. 6--7--8 ఆద్యాయాలు ఆ నాటీ ఆంధ్రదేశంలో వాడుకలో వున్న దేసి, నృత్తపద్దతులన్ని వివరించేవిగా వుండి గ్రంథ ప్రాముఖ్యాన్ని ఎంతగానో చాటుతున్నాయి.
 
జాయన నృత్తరత్నావళిలో తన కాలంలో ప్రచారంలో వున్న దేశీ నృత్యాలన్నింటినీ అమూలంగా చిత్రింఛాడు. ఎనిమిది ఆధ్యాయాలు గల ఈ గ్రంథంలో కడపటి మూడు ఆద్యాలూ దేశి నృత్య సాంప్రదాయాలైన వేరణి, ప్రేంఖణం, రాసకం, చర్చరి, నాట్య రాచకం, దండ రాచకం, శివప్రియం, చిందు, కందుకం, ఖాడిక్కం, ఘంటనరి, చరణము, బహురూపం, కోలాటం, మొదలైన ప్రాంతీయము లైన అనేఅ ఆనపద నృత్యాలను వివరించాడ
 
జాయన నృత్తరాత్నావళిని పరికించి చూస్తే భరతముని ప్రసాదించిన భరత నాట్యశాస్త్ర గ్రంథంలోనూ, భరత నాట్యంపై ఆభినవ గుప్తాచార్యుల వ్యాఖ్యానం తోనూ జాయనకు పరిపూర్ణ పరిచయం వున్నట్లు తోస్తూవుందని క్రీ.శే. మల్లంపల్లి వారు అదే వ్వాసంలో వ్రాశారు.
 
జాయన నృత్యరత్నావళిలో నృత్యానికి అనుగుణమైన సంగీత రత్నావళిని గూడ అనుబంధంగా అరచించాడట. కాని దురదృష్ట వశాత్తూ అది లభ్యం కాకుండా పోయింది.
 
జాయన 1213 వ సంవత్సరం నాటికే సాల నాట్య వైదికమణి అనీ, కవి సభాశిఖామణి అనీ పేరొందాడు. జాయన నృత్తరత్నావళిని 1253 -- 54 నాటికి రచిందడం వలన దాదాపు 60 సంవత్సరాల వయసులో వ్రాసి వుండ వచ్చు. ఏమైనా ఈ నాడు ఆంథ్రుల గర్వించగగిన పురాతన నృత్యశాస్త్ర గ్రంథాలలో నృత్తరత్నావళి మణి భూషణం.
"https://te.wikipedia.org/wiki/కాకతీయుల_కళాపోషణ" నుండి వెలికితీశారు