కాకతీయుల కళాపోషణ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
క్రీ.శ.1000 --1158 వరకూ కొంతకాలం తూర్పు చాళుక్య రాజులకూ, మరి కొంతకాలం పశ్చిమ చాళుక్య రాజులకూ సామంతులుగా వుండి చిన్న చిన్న రాజ్యాలను ఓడించి చివరకు చాళుక్య రాజ్యాన్ని కూడ ఓడించి స్వతంత్ర ప్రభువులుగా రూపొంది, 150 సంవత్సరాల కాలంలో నలుగురు రాజులు పరిపాలించారు. వీరిలో చివరి వాడైన రెండవ ప్రోలరాజు అతి ప్రసిద్ధుడు.
 
==;మహోన్నత వీరులు:==
 
తరువాత దశలో క్రీ. శ. .1159- 1261. వరకు తెలంగాణాను పునాదిగా చేసుకుని ఆంధ్ర దేశాన్నంతా జయించారు. ఈ దశలో మొత్తం ముగ్గురు రాజులు పరిపాలించారు. వీరిలో ప్రసిద్ధులైన కాకతీయ గణపతి దేవుడు దీర్గ కాలం (1193 --- 1262) వరకు పరిపాలించి కాకతీయ రాజ్యాన్ని విస్తరింప జేశాడు.
పంక్తి 18:
నట్లు అనేక శాసాల వల్లనూ, ఆనాటి శిల్పకళ వల్లనూ, సాహిత్యం వల్లనూ విదితమౌతోంది.
 
==;కళాకారులకు ఘన సత్కారాలు:==
దేవాలయ కైకర్యం చేశే నర్తకీ మణులకు, మృదంగ విద్వాసులకు, గాయకులకూ, గృహదానాలు చేసినట్లు పిల్లమఱ్ఱి శాసనంలో ఉదహరించ బడింది.
 
పంక్తి 32:
 
##################
==;రామప్పగుడిలో రమణీయ నృత్యాలు:==
 
శిల్పకళా విశిష్టతతో నిర్మితమైన రామప్ప గుడి వరంగల్ జిల్లా ములుగు తాలూకాలో వుంది. ఇది వరంగల్లుకు నలబై మైళ్ళ దూరంలో వుంది. ఈ గుడిని 1162 లో రుద్రసేనాని అనే రెడ్డి సామంతు కట్టించాడు. రామప్పగుడి ఆలయ నిర్మాణంలోని చిత్ర కౌశలం, శిల్ప నైపుణ్యం వర్ణిచనలవికానివి. ఈ కాకతీయ శిల్పచాతుర్యమంతా, ఇన్నేళ్ళు గడిచినా, ఈ నాటికి చూఫరులకు అమితానందాన్ని కలిగిస్తూంది. భరత నాట్య శాస్త్రమంతా మూర్తీ భవించి, స్థంబాలమీదా, కప్పులమీదా, కనబడుతుంది
పంక్తి 38:
రామప్ప గుడిలోని విగ్రహాలు, స్థంబాలపై ఉన్న శిల్పాలు ముఖ్యంగా దేవాలయ మంటపంపై కోణాల్లో నాలుగు పక్కలా పెద్ద నల్లారాతి నాట్య కత్తెల విగ్రహాలు అతి సుందరమైనవి. ఆ విగ్రహాల సొమ్ముల అలంకరణాలు, వాటి త్రిభంగీ నాట్య భంగిమలూ శిల్పకారుల్నే సమ్మోహితుల్ని చేస్తున్నాయి. దేవాలయం లోని స్థంబాలపై నాట్య భంగిమలు మృదంగాది వాద్యముల వారి రేఖలు చిత్రించబడి వున్నాయి. జాయన సేనాని రచించిన నృత్తరత్నావళిలో ఉదాహరించిన నాట్యశిల్పమంతా రామప్ప గుడిలో తొణికిసలాడుతూ వుంది.
 
==;ముద్దుగుమ్మల మద్దెల ధ్వనులు:==
 
పాలంపేటలోని రామప్ప చెరువు కట్ట తూర్పు చివరనున్న దేవాలయంలోపలి భాగంలో స్త్రీలు మద్దెల వాయిస్తూ వుండగా, వివిద భంగిమలలో నృత్యం చేస్తున్న అనేక మంది ఆటకత్తెల శిల్పాలున్నాయి. అదే దేవాలయం పడమటి వైపు ద్వార బంధాలమీద మార్థంగికురాండ్ర శిల్పాలున్నాయి.
పంక్తి 51:
కాకతీయ యుగంలో నాట్య బహుళ ప్రచారంలో వున్నట్లు ఆ నాటి సంస్కృత గ్రంథాలలో ఉదహరింపబడి వుంది. జాయన రచించిన అపూర్వ నృత్యశాస్త్ర గ్రంథం (నృత్తరత్నావళి) సంస్కృత గ్రంథం) ఆనాటిదే.
 
==;జాయపసేనాని కత్తి వీరుడే కాక కళాప్రియుడైన సేనాని:==
 
కాకతి గణపతి దేవ చక్రవర్తి కటాక్షానికి పాత్రుడైన జాయప తన స్వయంశక్తి వల్ల సేనాని కాగలిగాడు. ఈ యన వీరుడే గాక, కళాకారుడు కూడాను.
పంక్తి 61:
జాయన ఆయచమూపతి, జాయనేనాధినాథుడు, గజసాహిణి జాయన, గజ సైన్యాధినాథుదు అనే పేర్లాతో పిలువ బడుతూ వుండేవాడు. గణపతి దేవ చక్రవర్తి జాయపయందు అత్యంత అభినామంతో అతనికి సకల విద్యలనూ, కళలను నేర్పించాడు. ఆ తరువాతనే జాయన అత్యుత్తమమైన నృత్తరత్నావళి రచనను పూనుకుని క్రీ.శ. 1253 -- 54 ప్రాంతంలో పూర్తి చేశాడు.
 
==;నృత్తరత్నావళి జానపదకళారూపాల వర్ణన:==
 
నృత్తరత్నావళిలో మార్గ, దేశి నృత్యాలు రెండూ కలిపి కట్టుగా నడిచాయి. ఇందులో ఎనిమిది ఆద్యాయాలున్నాయి. మొదటి ఆధ్యాయం నర్తన వివేకం,
పంక్తి 68:
రెండవ ఆద్యాయం అంగనిరూపణ.,. మూడవ ఆద్యాయం, మండల లక్షణం, నాలుగవ ఆద్యాయం, కరణాంగ హార వివేచానికి సంబందించినది. ఐదవ ఆద్యాయం దేశి, స్థానక, కరణ, భ్రమరీ లక్షణాలను తెలుపుతూ వుంది. ఆరవ ఆధ్యాయం దేశ పాట, చారీలాస్యాంగగతి లక్షణమనే పేరు గలది. 6--7--8 ఆద్యాయాలు ఆ నాటీ ఆంధ్రదేశంలో వాడుకలో వున్న దేసి, నృత్తపద్దతులన్ని వివరించేవిగా వుండి గ్రంథ ప్రాముఖ్యాన్ని ఎంతగానో చాటుతున్నాయి.
 
జాయన నృత్తరత్నావళిలో తన కాలంలో ప్రచారంలో వున్న దేశీ నృత్యాలన్నింటినీ అమూలంగా చిత్రింఛాడు. ఎనిమిది ఆధ్యాయాలు గల ఈ గ్రంథంలో కడపటి మూడు ఆద్యాలూ దేశి నృత్య సాంప్రదాయాలైన వేరణి, ప్రేంఖణం, రాసకం, చర్చరి, నాట్య రాచకం, దండ రాచకం, శివప్రియం, చిందు, కందుకం, ఖాడిక్కం, ఘంటనరి, చరణము, బహురూపం, కోలాటం, మొదలైన ప్రాంతీయము లైన అనేఅ ఆనపద నృత్యాలను వివరించాడవివరించాడు.
 
జాయన నృత్తరాత్నావళిని పరికించి చూస్తే భరతముని ప్రసాదించిన భరత నాట్యశాస్త్ర గ్రంథంలోనూ, భరత నాట్యంపై ఆభినవ గుప్తాచార్యుల వ్యాఖ్యానం తోనూ జాయనకు పరిపూర్ణ పరిచయం వున్నట్లు తోస్తూవుందని క్రీ.శే. మల్లంపల్లి వారు అదే వ్వాసంలో వ్రాశారు.
పంక్తి 75:
 
జాయన 1213 వ సంవత్సరం నాటికే సాల నాట్య వైదికమణి అనీ, కవి సభాశిఖామణి అనీ పేరొందాడు. జాయన నృత్తరత్నావళిని 1253 -- 54 నాటికి రచిందడం వలన దాదాపు 60 సంవత్సరాల వయసులో వ్రాసి వుండ వచ్చు. ఏమైనా ఈ నాడు ఆంథ్రుల గర్వించగగిన పురాతన నృత్యశాస్త్ర గ్రంథాలలో నృత్తరత్నావళి మణి భూషణం.
 
######################
"https://te.wikipedia.org/wiki/కాకతీయుల_కళాపోషణ" నుండి వెలికితీశారు