మూసీ నది: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
[[ఫైలు:Musi right2.jpg|left|thumb|చాదర్‌ఘాట్ వద్ద మూసీనది దృశ్యం. ఈ చిత్రం నిజాం కాలంనాటి ఛాదర్‌ఘాట్ పాతవంతెన నుండి తూర్పు వైపుకు తీయబడినది. నుండి తీయబడినది. చిత్రంలో దగ్గరగా కనిపిస్తున్నది చాదర్‌ఘాట్ ప్రాంతంలో 1990వ దశకంలో కట్టిన వంతెన. దూరంగా కనిపిస్తున్నది మలక్‌పేట నుండి కాచీగూడవైపు వెళ్ళే రైలుమార్గంలో మూసీపై ఉన్న రైలు వంతెన. పాత వంతెనను ఉత్తరంవైపు వెళ్ళే వాహానాలకు, కొత్తవంతెనను దక్షిణం వైపు వెళ్ళే వాహనాలకు ఉపయోగిస్తున్నారు]]
[[ఫైలు:Musi left3.jpg|right|thumb|ఈ దృశ్యంలో నందనవనం ప్రాజెక్టులో భాగంగా నది మధ్యలో నిర్మించిన కాంక్రీటు కాలువను చూడవచ్చు]]
తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్రాలో విలీనం చేసిన తరువాతే మూసీనదికి ముప్పు ఏర్పడింది. ఉమ్మడి రాష్ర్టానికి హైదరాబాద్‌ను రాజధానిగా చేయడంతో ఆంధ్ర ప్రాంతం నుండి వలసలు తీవ్రతరమయ్యాయి. ముఖ్యంగా కోస్తా తీరప్రాంతం నుండి వచ్చిన పెట్టుబడిదారులు మూసీ పరివాహక ప్రాంతాల్లో పెద్దెత్తున ఫ్యాక్టరీలు నెలకొల్పారు. లాభాపేక్షతో కనీస నిబంధనలు పాటించలేదు. ఫ్యాక్టరీల నుండి విడుదలయ్యే వ్యర్థ జలాలు నేరుగా మూసీలోకే వదిలేశారు. హైదరాబాద్‌లో కాలుష్యాన్ని నియంత్రించడానికి ఏర్పాటు చేసిన పొల్యుషన్‌ కంట్రోల్‌ బోర్డు కూడా చోద్యం చూస్తూ కూర్చుంది. దీంతో వాయిదాల పద్ధతిలో మూసీనది మురికి కాలువగా మారింది. ఒకప్పుడు దోసిళ్లతో స్వచ్ఛమైన మూసీనదిని నీటిని తాగిన హైదరాబాద్‌ ప్రజలకు ఇప్పటి మూసీని చూస్తే కన్నీళ్లొచ్చే పరిస్థితి దాపురించింది. ఇక మరోవైపు సీమాంధ్ర మీడియా ఛానళ్లు ఈ నదిని నామరూపాల్లేకుండ చేసిన ఆంధ్రా కంపెనీలను ఏమీ అనకుండా ముసలి కన్నీళ్లు కారుస్తున్నరు. సీమాంధ్ర పాలనలో ఇలా ఒక నది మాయమైంది. సీమాంధ్రుల ధనదాహం ఎంత దుర్మార్గమైందో అర్థం చేసుకోవచ్చు.
1980వ దశకము నుండి హైదరాబాదు నగర శివార్లలోని పారిశ్రామిక ప్రాంతాలలో వెలువడిన పారిశ్రామిక వ్యర్ధ పదార్ధాలను మూసీ నదికి నీరును జతచేసే చిన్న చిన్న నాలాల్లో వదలడం, గణనీయంగా పెరిగిపోయిన జనాభాతో నగరంలో మురికినీరును మూసీనదిలోకి వదలడంతో మూసీ ఒక మురికి కాలువ స్థాయికి చేరించి. ప్రతిరోజూ జంటనగరాల నుండి వెలువడుతున్న 350 మిలియన్ లీటర్ల మురికినీరు మరియు పారిశ్రామిక వ్యర్ధ పదార్ధాలు నదిలో కలుస్తున్నవని అంచనా. ఆ తరువాత 1990వ దశకంలో ఈ మురికినీటిని శుద్ధి పరచే ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ ప్రయత్నంలో భాగంగానే మూసీ నది వెంట అంబర్ పేట ప్రాంతంలో కలుషిత నీటి శుద్ధి ప్లాంటును ప్రారంభించారు. కానీ దీనికి కేవలం 20% నీటినే పరిశుద్ధ పరచగల సామర్ధ్యం ఉన్నది.<ref>http://www.rainwaterharvesting.org/hussain_sagar/hussainsagar%202.pdf</ref> 2000లలో నగరంలో నదిలోని నీటిని ఒక చిన్న కాంక్రీటు కాలువ ద్వారా ప్రవహింపజేసి ఆ విధంగా సమకూరిన నదీతలాన్ని ఉద్యానవనంగా అభివృద్ధి చేసేందుకై అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం నందనవనం అనే ప్రాజెక్టును ప్రారంభించింది. కానీ అది మధ్యలోనే ఆగిపోయింది. నందనవనం ప్రాజెక్టులో భాగంగా మూసీ నదీగర్భంలో మురికివాడలను నిర్మూలించాలని ప్రయత్నించారు. కానీ, మూసీ బచావ్ ఆందోళన్ వంటి సామాజిక సంస్థలు మరియు రాజకీయ ప్రతిపక్షాలు మరియు వామపక్షాల వ్యతిరేకతతో అది సాధ్యం కాలేదు.<ref>http://www.hindu.com/2000/12/23/stories/04234036.htm</ref> ఈ మురికివాడల్లో 20 వేల మంది పైగా ప్రజలు ముప్పై ఏళ్లుగా నివసిస్తున్నారని అంచనా.<ref>http://www.hinduonnet.com/thehindu/2000/06/15/stories/0415403i.htm</ref>
 
"https://te.wikipedia.org/wiki/మూసీ_నది" నుండి వెలికితీశారు