ముకెబర్ల జంగాల బిట్రో నిట్రో: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 70:
==;కథ:==
 
బిట్రేశ్వరుడు, నిట్రేశ్వరి దేవిని వెంట బెట్టుకుని శైవ మతంలోని శివ భక్తుల్ని పరీక్షించ డానికి భూలోకానికి వెళ్ళారట. అప్పుడు ఒక శైవుడు, తన భార్యను చీకటి తప్పు గావించిందన్న నెపంతో బాగా కొట్టి ఇంటి నుంచి వెల్లగొట్టాడట. ఆమె వెంటనే తను చేసిన తప్పేమిటో తగిన నిదర్శనాలతో భర్త ఎదుట నిరూపించాలని, తద్వారా భర్త యొక్క మొప్పు పొందాలని దీర్ఘమైన పట్టుదలతో తల గొరిగించుకుని విభూతి రేఖలు, రుద్రాక్ష మూలికలు మెడనిండా ధరించి తెల్లని చీర గట్టి రామేశ్వరమునకు పరుగెత్తి పోయిందట. అక్కడుండే ఆళ్వారులు, లింగాయతులు, ముప్పాళ్ళ గోగుళ్ళు ఆమెను చూచి అస్యహించుకుని ఎగతాళి చేశారట. వెంటనే ఆమె రామేశ్వర దేవాలయంలో వున్న నంది వాహనంకు ఎదుట నిలబడి తన రెండు పాదాల పైన ఒక మట్టి కుండలో బియ్యం పోసి ఈశ్వరునికి నైవేద్యం వండటం ఆరంభించిందట. వెను వెంటనే అక్కడ ఆమె భర్త యైన శ్రీ కంఠునికి తల తిరిగే రోగం ప్రారంభమవగాప్రారంభ మవగా తన భార్య యైన ముకాక్షిని వెదుక్కుంటూ రామేశ్వరానికి ప్రయాణం చేసాడట. ఈ లోగా ముక్తాక్షికి బిట్రేశ్వరుడు, నిట్రేశ్వరి కన్నులెదుట సాక్షాత్కరించి తిరిగి యధావిధిగా నీ భర్తను త్రోవలోకి తీసుకుని పసుపు కుంకుమలతో ముత్తైదువుగా వుండి చిర కాలం బ్రత్రకి పోదువు గాక అని వరమిచ్చి పంపించారట. అప్పు డామె నిజ గ్రామమైన చోళ పల్లికి వస్తుండగా మార్గ మధ్యలో భర్తను కలుసుకోగా, ఆయనకు తల తిప్పే రోగ మటు మాయ మైనదట. అంతట శ్రీకంఠుడు బుద్ది తెచ్చుకుని ఇంటికి వెళ్ళి సుఖంగా కాపురం సాగించారట. తెలుగు దేశంలో ఓరు గంటి కాకతీయుల కాలంలో వీర శైవమతం జోరుగా విజృభిస్తున్న రోజుల్లో ఇలాంటి కట్టు కథలు ఎన్నో ఉద్భవించాయి. అలాంతిఅలాంటి కోవకు చెందినదై యుండ వచ్చు ఈ కథ. ఎవరికైనా బిడ్డలు లేక పోతే ఈ దేవతలను కొలిచేటట్లైతే సంతానం కలిగేదట.