పరీక్షిత్తు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
'''పరీక్షిత్తు''' ([[సంస్కృతం]]: परिक्षित्, [[IAST]]: Parikṣit, with the alternative form: परीक्षित्, [[IAST]]: Parīkṣit) పాండవుల తరువాత [[భారతదేశము|భారతదేశాన్ని]] పరిపాలించిన మహారాజు. ఇతను [[అర్జునుడు|అర్జునుడి]] మనవడు, [[అభిమన్యుడు|అభిమన్యుని]] కుమారుడు. ఇతని తల్లి [[ఉత్తర]]. తల్లి గర్భంలో ఉన్నప్పుడే [[అశ్వత్థామ]] ఇతనిపై బ్రహ్మ శిరోనామకాస్త్రము ప్రయోగించెను. దాని మూలంగా కలిగిన బాధనోర్వలేక ఉత్తర శ్రీకృష్ణుని ప్రార్ధించెను. ఆతని కరుణ వలన బాధ నివారణమై శిశువుగా ఉన్న పరీక్షిత్తు బ్రతికెను. ఇతడు [[ఉత్తరుడు|ఉత్తరుని]] కూతురు ఇరావతి ని వివాహము చేసుకొనెను. ఇతని కుమారుడు [[జనమేజయుడు]].
 
==వృత్తాంతము===
అవి [[మహాభారతము]] యుద్దము చివరి రోజు, దుర్యోధనుడు కూడా నేలకొరిగినాడు. అశ్వద్దామ మరియు అర్జునుడు ఇద్దరూ పరస్పరము బ్రహ్మాస్త్రాలు ప్రయోగించుకున్నారు: కానీ పెద్దల జోక్యముతో చివరకు అర్జునుడు బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించుకొనగా అశ్వద్దామ మాత్రం ఉపసంహరణవిధ్య తెలియక "అపాండవగుగాక" అని మరలించినాడు, అనగా పాండవుల వారసులు అందరూ మరణించుగాక అని ప్రయోగించినాడు. అప్పుడు కృష్ణుడు ఒక్కరిని కాపాడతాను అని మాట ఇచ్చి తల్లి కడుపులో ఉన్న పరిక్షిత్తుని తన యోగ మాయా శక్తి తో, చిన్న రూపుడై చతుర్భుజములతో, శంఖచక్రగదాకౌముదీ మొదలగు అస్త్రాలు ధరించి పిండరూపుడై ఉన్న బాలుని చుట్టూ తిరిగి కాపాడతాడు! అలా తిరుగుతున్నప్పుడు ఆ బాలుడు అలా ఉన్న కృష్ణుడిని చూసి "ఎవరు ఇతను" "ఇలా శంఖచక్రగదాకౌముదీ మొదలగు అస్త్రాలు ధరించి పీతాంబరాలతో, కిరీటముతో, వెలిగిపోతూ నా చుట్టూ తిరుగుతున్నాడు" అని తల్లి గర్భములోనే పరమాత్ముని పరిక్షించినాదు అందువల్ల ఇతనిని పరిక్షిత్తు అని అంటారు.
 
"https://te.wikipedia.org/wiki/పరీక్షిత్తు" నుండి వెలికితీశారు