'''పరిక్షిత్తు''', పాండవుల తరువాత [[భారతదేశము|భారతదేశాన్ని]] పరిపాలించిన మహారాజు. ఇతను [[అర్జునుడు|అర్జునుడి]] మనవడు.
===వృత్తాంతము===
అవి [[మహాభారతము]] యుద్దము చివరి రోజు, దుర్యోధనుడు కూడా నేలకొరిగినాడు. అశ్వద్దామ మరియు అర్జునుడు ఇద్దరూ పరస్పరము బ్రహ్మాస్త్రాలు ప్రయోగించుకున్నారు: కానీ పెద్దల జోక్యముతో చివరకు అర్జునుడు బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించుకొనగా అశ్వద్దామ మాత్రం ఉపసంహరణవిధ్య తెలియక "అపాండవగుగాక" అని మరలించినాడు, అనగా పాండవుల వారసులు అందరూ మరణించుగాక అని ప్రయోగించినాడు. అప్పుడు కృష్ణుడు ఒక్కరిని కాపాడతాను అని మాట ఇచ్చి తల్లి కడుపులో ఉన్న పరిక్షిత్తుని తన యోగ మాయా శక్తి తో, చిన్న రూపుడై చతుర్భుజములతో, శంఖచక్రగదాకౌముదీ మొదలగు అస్త్రాలు ధరించి పిండరూపుడై ఉన్న బాలుని చుట్టూ తిరిగి కాపాడతాడు! అలా తిరుగుతున్నప్పుడు ఆ బాలుడు అలా ఉన్న కృష్ణుడిని చూసి "ఎవరు ఇతను" "ఇలా శంఖచక్రగదాకౌముదీ మొదలగు అస్త్రాలు ధరించి పీతాంబరాలతో, కిరీటముతో, వెలిగిపోతూ నా చుట్టూ తిరుగుతున్నాడు" అని తల్లి గర్భములోనే పరమాత్ముని పరిక్షించినాదు అందువల్ల ఇతనిని పరిక్షిత్తు అని అంటారు.
ఇతని కాలములోనే కలిపురుషుడు వస్తే అతనిని ఓడిస్తాడు.
తరువాత ఒక చనిపోయిన పాముని, అడిగితే త్రాగడానికి నీరు ఇవ్వలేదని, ముని మెడలో వేస్తే, ఆ ముని కుమారుడు వారం రోజులలో చనిపొతావు అని పరిక్షిత్తుని శపిస్తాడు. ఆ వారం రోజులలో విన్నదే [[మహాభాగవతము]].