పిచ్చుకుంటులవారు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Bhaskaranaidu (చర్చ | రచనలు) కొత్త పేజీ: ;ఇంటిటా గోత్రాలు చెప్పే పిచ్చుకుంటుల వారు: ఆంధ్ర ప్రదేశంలో చ... |
Bhaskaranaidu (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 20:
పద్యం:
<poem>గుడగుడ రోజు నడకుండకు బాపడు పిచ్చు గుంట్ల, యో
కడు సెప్పినన్ని గోతరలు, గట్టిన జెప్పినామే సమంగుగా
పడిగొని సంపసాచి దల పట్టుక సిందు పదాలు పాడు
గుడగుడ వట్టి లొట్ట యని కూయును ముర్ఖుడా.. ||చంద్ర శేఖరా||<poem>
అని వర్ణించాడు. పిచ్చుకుంటుల వారు ప్రధమంలో కాపుల గోత్రాలనూ, యాదవుల గోత్రాలనూ చెపుతూ వుండేవారు. కాల క్రమాన కమ్మవారి గోత్రాలతో పాటు ఇతర కులాల వారి గోత్రాలను కూడ చెపుతూ వుండేవారు. అలా వారి వారి గోత్రాలను కూడా చెపుతూ వారినే యాచించే వారు. వీరికి పౌరోహిలులు జంగాలు.
పిచ్చికుంటుల వారు తెలంగాణా జిల్లాలలో ఎక్కువగా వున్నారు. వీరిలో గంట - తురుక - మంద - తిత్తి - తొగరు మొదలైన ఉప జాతులు ఉన్నాయనీ, పన్నేండు తెగల వారు తెలంగాణాలో వున్నారనీ, ఒక తెగవారు సర్కాంధ్ర డేశంలో వున్నారనీ, ఈ నాడు తెలంగాణా రెడ్లుగా వున్న వారు ఒకప్పుడు కాపులకు సంబంధించిన కోటి గోత్రాలనూ, కోస్తా జిల్లాలలో వున్న కమ్మ వారికి కోటి గోత్రాలనూ చెప్పి యాచించే వారనీ డా: బి. రామ రాజుగారు వారి జానపద సాహిత్య గ్రంధలో ఉదహరించారు.
;వారు చెప్పే కథలు:
తెలంగ్బాణా లోని పిచ్చు కుంటుల వారు రాములమ్మ, బాలనాగమ్మ, కామమ్మ, సదాశివ రెడ్డి, పర్వతాల మల్లార్తెడ్డి, సూర్య చంద్ర ల్రాజులు, హరిశ్చండ్రుడు మొదలైన కథలను చెపుతున్నారు.
ఇల రాయల సీమలో నున్న పిచ్చుకుంటుల వారు కుంతి మల్లారెడ్డి కథను గానం చేస్తారు. నెల్లూరు, గుంటూరు ప్రాంతాల్లో పలనాటి వీర గాథల్నీ, కాటమ రాజు కథల్నీ గానం చేస్తూ వుంటారు.
|