పిచ్చుకుంటులవారు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 56:
 
పిచ్చుకుంటుల వారిని గురించి చంద్ర శేఖరుడు తన శతకంలో ఈ విధంగా వర్ణించాడు.
 
 
 
 
 
 
 
 
మన ఇరుగు పొరుగున వున్న కన్నడ రాష్ట్రంలో కూడ పిచ్చు కుంటుల వారున్నారు. వారంతా కూడా శ్రీ శైల మల్లిఖార్జున భక్తులే. వీరిలో దావన కుంట్లు, ఎద్దుకుండ్లు, గంట కుంట్లు మొదలైన తెగల వారున్నారు. పిచ్చు కుంటుల వారి వేష ధారణ కథకునికి హుందాయైన తలపాగా, ఒక చేతిలో కత్తి, మరొక చేతిలో డాలూ, కాళ్ళకు గజ్జెలూ వుంటాయి. ఈయన చరణాన్ని పాడుతూ వుంటే, మిగిలిన వారిద్దారూ దీర్తం తీస్తూ కథకుని గొంతుతో గొంతు కలుపుతారు. ఒక మూడ వ్వక్తి ఒక శ్రుతి చెవులకు తగిలించు కుని గుక్క విడువని శృతి పోస్తూ వుంటాడు. ఈ శృతి చెవులకు ఎంతో ఇంపుగా వుంటుంది. ఈ శృతిని ఆధారం చేసుకుని పిచ్చు కుంటుల కథా విధానాన్ని నడుపుతూ వుంటారు.
 
కథలో వచ్చే ఆయా పాత్రల మనస్తత్వాల ననుసరించి కథకుడూ, వంత దాదుడూ, ఆ పాత్రల్లోకి మారి పోతారు. పిచ్చు కుంటుల కథా విధానం ఎలా వుంటుందో పల్నాటి యుద్ధంలో బాల చండ్రుడు యుద్ధంలో దూకిన ఘట్టాన్ని వింటే బోధ పడుతుంది.
 
;రగడ:
 
<poem>కుప్పించి ఎగసిన - కుండలంబుల కాంతి
గగన భాగంబెల్ల - గప్పి కొనంగ
కంపించి జగమంత - కదలి వణకంగ
మొగమందు చిరునవ్వు - మోసులెత్తంగ
కొండలంతా రాళ్ళు - పిండి పిండిగను
పత్ర మంతా రాళ్ళు - పొడి పొడిగాను
శనగలంతారాళ్ళు - చిచ్చవ్వగాను.</poem>
 
ఒక్క దూకు దూకాడయ్యా - శీలం వారి బాలుడు, శ్రీ మలమల దేవ చెన్నుడో - ఓ.... ఓ..... ఓ..... అంటూ దీర్ఘం తీస్తూ పాడతారు.
 
ఈ విధంగా పిచ్చు కుంటుల వారు ఎంతో ఉత్తేజంగా ఖడ్గ తిక్కన, కాటమ రాజు,పలనాటివీర చరిత్ర మొదలైన కథలను చెప్పే వారు.
"https://te.wikipedia.org/wiki/పిచ్చుకుంటులవారు" నుండి వెలికితీశారు