పిచ్చుకుంటులవారు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 110:
తాటాకు గుడిసెల్లో = బొటబొట వాన\
కట్ట బట్టాలేక = గంజితో బ్రతికె</poem>
 
 
 
 
 
 
 
 
<poem>వాళ్ళ దేహాలలెల్ల - ఒట్టి బొమికల గూళ్ళు
పిల్లలూ కట్టుకొన - పీలికల గుడ్దలూ
ఆలసోమ పురు లోన - ఆ బీధ ప్రజలు
మల్లల్లో కూడ్లేక -మ్రగ్గుతుంటారో</poem>
 
ఇలా ఆనాటి పరిస్థితులనూ, సమస్యలనూ ప్రజలకు ఎరుక పర్చటానికి ప్రాచీన కళా రూపమైన పిచ్చి కుంటుల కళా రూపాన్ని ప్రజా నాట్య మండలి వుపయోగించిది. పిచ్చుకుంటుల వారు ఈ నాటికీ గుంటూరు జిల్లా రెంట చింతల గ్రామంలో 70 కుటుంబాలు, చెరకు పాలెంలో గ్రామంలో 70, మునిపల్లెలో 6, గామారి పాలెంలో 6 , ప్రకాశం జిల్లా టంగుటూరులో 70, వరంగల్ జిల్లా మొగిలి చర్లలో కొన్ని కుటుంబాల వారు నివశిస్తున్నారు. అయితే నానాటికీ వీరి కథలకు ఆదరణ తగ్గటం వల్ల వేరు వేరు వృత్తుల్ని చూసు కుంటున్నారని కె.వి .హనుమంతరావు గారు ఆంధ్ర ప్రభ దిన పత్రికలో వివరించారు.
 
;వారిలో వచ్చిన మార్పు:
 
ఆంధ్ర దేశంలో కోస్తా జిల్లాల్లో వున్న పిచ్చుకుంటుల వారు భామా కలాపం, గొల్ల పకాపం నేర్చు కున్నట్లు కూడా ఉదాహరణ లున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా కుమార దేవం గ్రామ వాస్తవ్యులు పల్లం పట్ల రామయ్య గారు, కోవూరు తాలూకా బందపురంలో నున్న పిచ్చు కుంట్లకు భామా గొల్ల కలాపాలను నేర్పారు.
 
బయ్యా పెద గంగాధరుడు, బండి చిట్టి లింగం, దేశీ లక్ష్మి నారాయణ మొదలైన వారు భామ వేష ధారణలో సిద్ద హస్తులు. 16 సంవత్సరాల వయస్సులో లక్ష్మీనారాయణ గారి భామ వేషం అద్భుతంగా వుండేదట.
 
పై ఉదాహరణలను బట్టి పిచ్చు కుంటలవారి చరిత్ర అనేక మార్పులు చెందినట్లు తెలుస్తూ వుంది.
"https://te.wikipedia.org/wiki/పిచ్చుకుంటులవారు" నుండి వెలికితీశారు