షర్మిలారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 18:
వైయస్సారు కాంగ్రెసు అధ్యక్షుడు అయిన జగన్‌మోహన్‌రెడ్డిని అక్రమఆస్తులను కలిగివున్నాడనే ఆరోపణమేరకు సి.బి.ఐ.వాళ్లు అయనను ఉపఎన్నికలముందే అరెస్టు చేసారు.ఈ నేపధ్యంలో పార్టిని మరింత ప్రజలకు చేరువగా తీసుకెళ్లి ప్రయత్నంగా,పార్టీ శ్రేణుల్లో ఉత్యాహం నింపి బలోపేతంచేయు దిశగా '''మరో ప్రజా ప్రస్థాపన ''' పేరు మీద పాదయాత్రను18 అక్టొబరు2012న ప్రారంభించారు.ఈపాదయాత్ర 16 జిల్లాలమీదుగా సాగుతుంది,యాత్ర దూరము 3000 కి.మీ. తనపాదయాత్రను,తనతండ్రి దివంగత రాజశేఖరురెడ్డి సమాధి (ఇడుపుల పాయ)నుండి ప్రారంభించినది.పాదయాత్రలో షర్మిలకు డిసెంబరు17 న గాయం అగుటవలన తాత్కాలికంగా పాదయాత్రను నిలిపివేసింది.అమె కాలికి [[అపోలో]] ఆపరెసను చేసి,ఆరువారాలపాటు విశ్రాంతి తీసుకొనవలసినదిగా సలహానిచ్చారు.ఆమె స్వస్తత పొందినతరువాత ఫిబ్రవరి 6,2013 నుండి మళ్ళి పాదయాత్ర ఆరంభించినది.ఈ పాదయాత్ర ఇచ్చాపురంవరకు కొనసాగి ఆగస్టు 5 న ముగిసినది.9 నెలలకు పైగా కొనసాగిన ఈ పాదయాత్ర 14 జిల్లాలగుండా జరిగినది.116 నియాజకవర్గాల మీదుగా జరిగినది.ఇందులో 9 కార్ఫోరేసన్లు,45 మున్సిపాలిటిలు,195 మండలాలు కలవు.ఈ యాత్ర 2250 గ్రామాలను తాకుతూ సాగింది.మొత్తం యాత్రలో 190 గ్రామ ప్రాంతాలలో రచ్చబండను నిర్వహించడం జరిగినది.152 ప్రదేశాలలల్ఫో బారీ స్థాయిగా జరిగిన జనసభలలో ప్రసంగించడం జరిగినది.ఈ పాదయాత్రలో దాదాపు కోటిమందికి పైగా జనాలను షర్మిలా ప్రత్యక్ష్యంగా కలిసినట్లు అంచనా వేసారు.
 
'''షర్మిలా పాదయాత్ర జరిపిన జిల్లాలు ''':1.వైస్సార్ ,2.అనంతపురం,3.కర్నూలు,4.మహబూబ్ నగర్,5.రంగారెడ్డి,6.నల్లగొండ,7.గుంటూరు,8.కేష్ణాకృష్ణా.9.ఖమ్మం,10.పశ్చిమ గోడావరి,11.తూర్పు గోదావరి,12.విశాఖపట్నం,13.విజయనగరం,14.శ్రీకాళం.
 
మొత్తం పాదయాత్ర జరిపిన దూరం 3,112 కి.మీ.ప్రపంచం లో ఇంత దూరం పాదయాత్ర జరిపిన మొట్టమొదటి మహిళ షర్మిలా.
"https://te.wikipedia.org/wiki/షర్మిలారెడ్డి" నుండి వెలికితీశారు