పతంజలి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
K.Venkataramana (చర్చ | రచనలు) |
K.Venkataramana (చర్చ | రచనలు) |
||
పంక్తి 14:
పతంజలి చెప్పిన మూడో స్థాయి ఐన "ఆసన" ను దానికి ముందు చెప్పబడిన యమ, నియమ సూత్రాలను క్రోడీకరించి ఆధునిక కాలంలో భారతీయ, పాశ్చాత్య పండితులు ఎందరో ఎన్నో రకాల యోగాభ్యాస ప్రక్రియలను యోగాసనాలను ఒక క్రమ పద్ధతిలో అమర్చి సామాన్య ప్రజలకు శిక్షణనిస్తున్నారు. దీనిద్వారా తీవ్ర ఒత్తిడితో జీవితాలు గడుపుతున్న ఆధినికులు ఎంతో ప్రశాంతతను పొందుతున్నట్లు పరిశోధనల్లోనూ, స్వానుభవాలతోనూ అంగీకరించటం విశేషం.
==పతంజలి యోగ సూత్రములు(అష్టాంగ యోగము)==
# '''యమము''' : అస్తవ్యస్తంగా, గజిబిజిగా ఉండే మనస్సును, శరీరాన్ని ఒక నిర్దిష్ట పద్దతిలో క్రమబద్దీకరించే ప్రక్రియనే "యమము" అందురు.
# '''నియమము''' : శరీరాన్ని మనస్సునూ, యోగాభ్యాసానికి సిద్ధం చేయటానికి ఆహారం, అలవాట్లు మొదలైన వాటిల్లో అనవసరమైన నియమాలు ఏర్పరిచే క్రమశిక్షణ తో ఉండటం.
# '''ఆసనం''': ఆసనం అంటె యిప్పుడు పాశ్చాత్యులలో ఉన్న భౌతిక అవసరాలైన హలాసనం, గరుడాసనం, శీర్షాసనం యిలా అనేక యోగాసనాలుగా పాశ్చాత్యులు పొరబడ్డారు. నిజానికి ఈ అవరసాలన్నీ యమ, నియమ, స్థాయిలోనే సాధకునిచే సాధన చేయిస్తారు. నిజానికి పతంజలి చెప్పిన "ఆసనం" అంటే మనస్సును ఆత్యతో సంధానం చేసి స్థిరంగా ఉండటం. దీనినే "స్థిర సుఖాసనం" అన్నారు.
# '''ప్రాణాయామం''': శరీర స్పందనలన్నింటినీ క్రమబద్దీకరించడమే ప్రాణాయామం. శ్వాసను గమనించడం, శ్వాసతో ధ్యానం చేయడం. వంటి శ్వాసక్రియా యోగ పద్ధతులన్నీ ఈ ప్రాణాయామం విభాగంలోకి వస్తాయి.
# '''ప్రత్యాహారం''' : శరీరం కన్నా మానవుడు వేరు అన్న సత్యాన్ని భారతీయులు ఏనాడో తెలుసుకున్నారు. పాశ్చాత్యులు కూడా ఈ సత్యాన్ని అంగీకరించగలిగితే పతంజలి చెప్పిన "అస్టాంగయోగ" విశేషాలు అర్థమవుతాయి. లేకపోతే యిదేదో కల్పిత రచనగానే పొరబడే అవకాశం ఉంది. ఇంతకూ ప్రత్యాహారమనగా వెనుకకు తిప్పడం అని అర్థం. అంటే పరిపరి విధాల పరుగులెత్తే మనస్సును మరల్చి హృదయంలో ఉండే ప్రజ్ఞతొ అనుసంధానం చెయ్యడం ప్రత్యాహారం.
# '''ధారణ''': సర్వాంతర్యామి అయిన భగవాంతునిలో మనసు నిలపడమే ధారణ . సాదారణంగా మనస్సు క్షణకాలం కూడా ఒక విషయం మీద స్థిరంగా ఉండదు. అలాటి చంచలమైన మనస్సుకు ఒక క్రమబద్దమైన యోగాభ్యాస ప్రక్రియ ద్వారా స్థిరత్వం కలిగించి స్ర్వాంతర్యామి యందు లగ్నం చెయడమే ధారణ.
# '''ధ్యానము''' : సర్వాంతర్యామి యందు లగ్నం చేయబడిన మనస్సు యితర పాపంచిక విషయాలు గుర్తు రానంతగా ఒకే విషయం నందు (భగవంతుని యందు) ప్రశాంతమైన స్థితిలో నిలిచి ఉండటాన్ని "ధ్యానస్థితి" అంటారు.
# '''సమాధి''' : సమాధి అంటే సిద్ధించడం, ఏ లక్ష్యం కోసం సాధకుడు అష్టాంగ యోగాన్ని అవలంబించి, అనుసరించి సాధన చేశాడో, ఆ లక్ష్యాన్ని చేరుకోవడం లేదా సాధిచ్మిన స్థితిలో ఉండటాన్నే సమాధి స్థితి అన్నడు పతంజలి.
పై సూత్రాలలో మొదటి నాలుగు విభాగాలు పాశ్చాతులకు యిప్పుడిప్పుడే కొంత అవగాహనకు వచ్చి దీనిపట్ల ఆకర్షితులవుతున్నారు. ఆ తరువాత చెప్పబడే నాలుగు అధ్యాయాలూ పాశ్చాత్యుల మేధస్సుకు అందనివి. ఆ మాటకొస్తే ఆధునిక భారతీయులలో కూడా చాలా మందికి తెలియనివి.
== గ్రంథకర్తృత్వం==
|