కన్యకా పరమేశ్వరి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 40:
ఆమె నోటి నుండి పవిత్ర వాక్కులు వెలువడగానే దేవి మానవ రూపంలో ప్రత్యక్షం అయింది.అప్పుడు వాళ్ళంతా తమ ఇష్ట దైవాలను తల్చుకుని అగ్ని గుండంలో దూకారు.విష్ణు వర్ధునుడికి దుశ్శకునాలు ఎదురైనప్పటికి తన సేనతో పెనుగొండ పొలిమేరాల్లో ప్రవేశించాడు.అప్పుడు చారులు అప్పటి వరకు జరిగిందంతా రాజుకి చెప్పారు.ఆ నిజాన్ని విని హృదయం ముక్కలైపోయింది.రక్తం కక్కుని అక్కడికక్కడే మరణించాడు.వాసవి చేసిన ఆత్మ త్యాగం,విష్ణువర్ధనుడి మరణం గురించి పట్టణం అంతా మార్మోగిపోయింది.విష్ణు వర్ధునుడి చర్యలను ఖండించి, ఒక నూతన శకానికి నాంది పలికిన వాసవి మరియు ఆమె అనుచరులను కొనియాడారు.
=== శ్రీ వాసవి దేవి వారసత్వం ===
ఈ సంఘటన తెలుసుకున్న విష్ణువర్ధుని కుమారుడు రాజ రాజ నరేంద్రుడు హుటా హుటిన పెనుగొండ పట్టణాన్ని చేరుకుని విలపించాడు. ఆ తర్వాత విరూపాక్షుడు అతన్ని ఈ విధంగా ఓదార్చాడు-"సోదరా, గతం నేర్పిన అనుభవాలు పాటంగా భవిష్యత్తును నిర్మించుకుందాం.మహా రక్తపాతం జరగకుండా వాసవి మన అందరిని రక్షించింది.ఆమె అహింసా సిద్ధాంతమ్ ఉత్తమ ఫలితాలని ఇచ్చింది."
ఆ తర్వాత విరూపాక్షుడు భాస్కరాచార్యులు చెప్పిన విధంగా కాశీ,గయ వంటి అనేక పుణ్య క్షేత్రాలను దర్శించాడు.పెనుగొండ పుణ్య క్షేత్రంగా చేయడానికి అక్కడ 101 గోత్రాలకి గుర్తుగా శివ లింగాలని ప్రతిస్టించాడు.నరేంద్రుడు వాసవి గౌరవార్ధం ఒక విగ్రహాన్ని ప్రతిష్టించాడు.అప్పటి నుండి వైశ్యులందరు వాసవి కన్యకా పరమేశ్వరి ని వైశ్య కుల దేవతగా తలచి పూజలు చేయడం మొదలెట్టారు.
వాసవి జీవిత చరిత్ర అహింస ను నమ్మినందుకు,మత విశ్వాసాన్ని నిలిపినందుకు,స్త్రీల ఆత్మ గౌరవాన్ని నిలిపినందుకు శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోయింది.
వైశ్యుల కీర్తిని విశ్వవ్యాప్తంగా వ్యాపించినందుకు గాను ఆమె ఎప్పటికి అజరామరం అయింది.ప్రాపంచిక సుఖాలను విస్మరించిన ఆమె వైశ్యుల మనసులలో ఒక విజేతగా,శాంతికి చిహ్నంగా ఎప్పటికి నిలిచిపోతుంది.
=== Temples of Vasavi Kanyaka Parameswari ===
|