స్వాతంత్రోద్యమంలో ఆంధ్రప్రదేశ్ ముస్లిములు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 36:
== ఖద్దరు ఉద్యమం ==
 
మాతృభూమి విూద నుండి పరాయి పాలకులను పాలద్రోలాలంటే విదేశీ వస్తువుల వ్యామోహం వదలాలని, స్వదేశీ కుటీర పరిశ్రమలను అభివృద్ధిపర్చుకోవాలని మహాత్ముడు ఇచ్చిన ఆదేశాల మేరకు ఖద్దరు ఉద్యమం రూపుదిద్దుకుంది. ఈ ఉద్యంలో భాగంగా గుంటూరు జిల్లా తొలిసారిగా మహమ్మద్‌ ఇస్మాయిల్‌ తెనాలిలో 1926లో ఖద్దరుషాపు ప్రారంభించి చివరకు 'ఖద్దరు ఇస్మాయిల్‌' గా శ్యాశ్విత నామధేయులయ్యారు. ఈ తరహాలోనే నిరంతరం ఖద్దరు ధరించడమే కాకుండా ఖద్దరు విక్రయశాల ఉద్యోగిగా ఖద్దరు ప్రచారాన్ని నిర్వహించిన షేక్‌ ఖాశిం బేగ్‌ ఖద్దరు జుబ్బా ఖాశిం బేగ్‌గాబేగ్‌ గా గుర్తింపు పొందారు. అటు నైజాంలోని హైదరాబాద్‌ నగరంలో ప్రముఖ జాతీయోద్యమకారిణి బేగం ఫక్రుల్‌ హాజియా స్వయంగా ఖద్దరు వస్త్రాలను ధరించడమే కాకుండా విదేశీ వస్తువుల బహిష్కరణలో పాల్గొని ట్రూప్‌ బజారులోని స్వగృహం అబిద్‌ మంజిల్‌లో విదేశీ వస్త్రాలను అగ్నికి ఆహుతి ఇచ్చారు. ఆమె తనయుడు బద్రుల్‌ హసన్‌ బొంబాయి నుండి రాట్నాలు తెప్పించి, హైదరాబాద్‌లో తొలిసారిగా ప్రవేశపెట్టారు. తిలక్‌ స్వరాజ్య నిధికి ఆయన 23 వేల రూపాయలు సేకరించి పంపారు. ప్రిన్స్‌ ఆఫ్‌ వేల్స్‌ రాక సందర్భంగా నిరసన తెలియజేస్తూ విదేశీ వస్తువులను తగులబెట్టిన తొలి వ్యక్తిగా బద్రుల్‌ హసన్‌ ఖ్యాతిగాంచారు. నగరానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త ముహమ్మద్‌ ఉస్మాన్‌ తన కర్మాగారంలోని విదేశీ బట్టలను పోగేసి తగులబెట్టారు. బహుముఖంగా విస్తరిస్తున్న ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసేందుకు అక్షరయోధులు అధికంగా శ్రమించారు. నగరంలోని నిజాం కళాశాలకు చెందిన గౌసుద్దీన్‌ అను విద్యార్థి హిందూ-ముస్లింల ఐక్యతకు సంబంధించి గ్రంథం ప్రచురించారు. గోషా మహల్‌ నివాసి ముహమ్మద్‌ జహుర్‌ అహమ్మద్‌ ఖాదీ ఉద్యమాన్ని బలపర్చుతూ రాసిన ఉత్తేజకరమైన వ్యాసాలు హైదరాబాదులోని ముషీర్‌-యే-దక్కన్‌, మదీనా ఉర్దూ పత్రికలో ప్రచురితమయ్యాయి. ఈ క్రమంలో ఉద్యమం సాగుతుండగా ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని చౌరీచౌరా పోలీస్‌ స్టేషన్‌ విధ్యంసం, పోలీసు ఆధికారుల విూద దాడి సంఘటనతో గాంధీజీ ఉద్యమాన్ని ఉపసంహరించుకున్నారు. ఆ తరువాతి క్రమంలో జాతీయోద్యమ వేదిక మీదకు వచ్చిన సైమన్‌ కమీషన్‌ను బహిష్కరణ కార్యక్రమంలో భాగంగా మద్రాసులో షఫీ మహమ్మద్‌ ప్రముఖ పాత్ర నిర్వహించారు. జాతీయోద్యమాన్ని మరింత ఉదృతం చేయడానికి యువజన-విధ్యార్థులను రంగం మీదకు తెచ్చేందుకు గుంటూరుకు చెందిన గాలిబ్‌ సాహెబ్‌, రహిమాన్‌లు అవిరళ కృషి సల్పారు. షేక్‌ గాలిబ్‌ సాహెబ్‌ బ్రాడిపేటలో ఆయన తన సోదరుని పేరిట నిర్వహించిన లాండ్రి షాపు ఆనాడు జాతీయ ఉద్యమకారులకు రహస్య కూడలి అయ్యింది. ఆ కారణంగా ఆ లాండ్రి విూద పలుమార్లు పోలీసుల దాడి చేశారు. ఈ మేరకు సంపూర్ణ స్వరాజ్యం సాధనకు అనుసరించాల్సిన ఉద్యమ వ్యూహాన్ని నిర్ణయించమని కాంగ్రెస్‌ గాంధీజీని కోరింది. సంపూర్ణ స్వరాజ్యం తమ లక్ష్యంగా ప్రకటించి ముందుకు సాగుతున్న ఉద్యమాన్ని అడ్డుకోవడానికి బ్రిటీష్‌ వైశ్రాయి ఇర్విన్‌ నిరంకుశంగా వ్యవహరించ సాగాడు. బ్రిటీష్‌ వైశ్రాయి అప్రజాస్వామిక వ్యవహార సరళికి వ్యతిరేకంగా గాంధీజీ శాసనోల్లంఘన ఉద్యమాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రముఖ రచయిత, జాతీయోద్యమంలో చిచ్చరపిడుగుగా ఖ్యాతి గడించిన హస్రత్‌ మెహాని చే ప్రశావితులైన నగరానికి చెందిన రజియా బేగం, జమాలున్నీసా బాజి, వారి అన్నదమ్ములు అన్వర్‌, జాఫర్‌లు ఉద్యమ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొన్నారు. ఈ కుటుంబీకులందరూ స్వేచ్ఛా-స్వాతంత్య్రాలు, అన్నిరకాల అసమానతల నుండి ప్రజల విముక్తి కోరుతూ జాతీయోద్యమంలో పాల్గొనడమే కాకుండా, అటు సామ్రాజ్య విస్తరణకాంక్ష గల బ్రిటీష్‌ ప్రభుత్వాన్ని ఎదిరించడంతోపాటు, నిజాం వ్యతిరేక పోరాటాలలో పాల్గ్గొన్నారు. బ్రిటీషు ప్రభుత్వ చట్టాల ఉల్లంఘన ద్వారా శాసనోల్లంఘన ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని నిర్ణయించుకున్న మహాత్మా గాంధీ 1930 మార్చి 20న గుజరాత్‌లోని దండి యాత్ర ఆరంభించగానే మద్రాసులో జరిగిన శాసనోల్లంఘనలో ఒబైదుల్లా సాహెబ్‌ అరెస్టు అయ్యారు. చిత్తూరుజిల్లా [[మదనపల్లె]] తాలూకా [[పెదపాలెం]] నివాసి షేక్‌ ఇమాం, ప్రకాశం జిల్లా, అమ్మనబ్రోలుకు చెందిన షేక్‌ చెంగీ షా కనపర్తిలోని ఉప్పు కొటారాల విూద జరిగిన దాడిలో పాల్గొన్నారు. బెహాంపూర్‌కు చెందిన రషీద్‌ ఖాన్‌, పశ్చిమ గోదావరికి చెందిన డాక్టర్‌ నశీర్‌ అహమ్మద్‌ విదేశీ వస్తువుల బహిష్కరణ, మధ్యనిషేధం ఉద్యమంలో పాల్గొన్నారు. డాక్టర్‌ నశీర్‌ స్వగృహం వద్దే శాసనోల్లంఘన ఉద్యమ శిబిరం ఏర్పాటు చేశారు. జాతీయ కాంగ్రెస్‌ సభ్యులైన ఆయన ఆరు నెలల జైలు జీవితం గడిపారు. గుంటూరుకు చెందిన షేక్‌ గాలిబ్‌ సాహెబ్‌, నెల్లూరు జిల్లాలో యల్‌.ఫకీర్‌, యం.షంషీర్‌ బేగ్‌ పలుమార్లు జైలుశిక్షలకు గురయ్యారు. ఈ సందర్భంగా భారత జాతీయ కాంగ్రెస్‌ ప్రచురించిన కరపత్రాలను పంచుతున్న నేరానికి అబ్దుల్‌ రజాక్‌, షేక్‌ మూసా సాహెబ్‌, షేక్‌ నబీసాహెబ్‌లు పోలీసులు దాడికి గురయ్యారు. చీరాల యువకుల ఆహ్వానం మేరకు వెళ్ళి ఉప్పుగుడారాలలోకి దూకిన ముహమ్మద్‌ గౌస్‌ దేవరంపాడు శిబిరానికి నాయకత్వం వహించారు. 1931లో గాంధీజీ-ఇర్విన్‌ల మధ్యన కుదిరిన ఒప్పందం తెచ్చిన ఉపశమనం అతి త్వరలో ముగిసింది. బ్రిటీషు ప్రభుత్వం జాతీయోద్యమాన్ని తీవ్రంగా అణిచివేయాలని నిర్ణయించుకుని కిరాతక చట్టాలు రూపొందించగా మహాత్ముడు వ్యక్తి సత్యాగ్రహ ఉద్యమాన్ని రూపొందించారు. ఈ పరిణామంతో రెచ్చిపోయిన అధికారగణం విజయవాడలోని ప్రతిష్టాకరమైన భారత జాతీయ కాంగ్రెస్‌ కార్యాలయం విూద కూడా పోలీసులు దాడులు నిర్వహించి కార్యాలయానికి తాళాలు వేశారు. ఈ చర్యను అవమానకరంగా భావించిన యువనాయకుడు సయ్యద్‌ హబీబుల్లా ముందుకు వచ్చి తన సహచరులతో కలసి 1932 జులై 31న కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయ భవనాన్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు విఫల ప్రయత్నం చేశారు. ఈ సంఘటన పురస్కరించుకుని యువ నాయకుడు సయ్యద్‌ హబీబుల్లాతోపాటుగా 70మంది యువకులు అరెస్టయ్యారు. (భారత దేశ స్వాతంత్య్ర సంగ్రామ చరిత్ర, కృష్ణాజిల్లా స్వాతంత్య్ర సమరయోధుల సంఘం, విజయవాడ, 1984, పేజి.92) ఈ సందర్భంగా ఉద్యమాన్ని ఉదృతం చేసేందుకు తెనాలి ఉన్నత పాఠశాల విద్యార్థి షేక్‌ మహబూబ్‌ ఆదం, ఆయన గురువు మంత్రవాది వెంకటరత్నంలు పోలీసుల కన్నుగప్పి ప్రచార కార్యక్రమాన్ని విజయవంతం చేయగలిగారు. 1932 ఆగస్టు 17న ప్రభుత్వం కమ్యూనల్‌ అవార్డును ప్రకటించింది. హరిజనులకు ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ సందర్భంగా గాంధీజీ జరిపిన హరిజన యాత్రలో భాగంగా 1933 డిసెంబరు 31న తిరుపతికి రాగా అక్కడ సి.ఎ.రహీం అను ఉత్సాహవంతుడైన యువకుడు అక్కడికక్కడ కాగితం విూద చేతి గోటితో మహాత్ముని చిత్రాన్ని చిత్రించిన ఆయనకు బహుకరించారు. ఆ తరువాత సంభవించిన వివిధ పరిణామాల వలన, సంపూర్ణ స్వరాజ్య సాధనా లక్ష్యంగా ప్రారంభమైన శాసనోల్లంఘన ఉద్యమం బలహీనపడి 1934లో పూర్తిగా ముగిసింది. గాంధీజీ శాసనోల్లంఘన ఉద్యమాన్ని విరమించుకోవడం పట్ల యువకులు కినుక వహించిన మున్షీ మహమ్మద్‌ మస్తాన్‌ (తెనాలి) రహమతుల్లా (ఒంగోలు) విప్లవకర చర్యలకు పాల్పడ్డారు. విప్లవ కరపత్రాలను పంచడమే కాక, మంతెనవారి పాలెంలో రహస్యంగా నిర్వహించిన రాజకీయ తరగతులకు హాజరౖెెనహాజరైన మున్షీ మస్తాన్‌ పోలీసుల చేత చావుదెబ్బలు తిన్నారు. 1939లో ఏర్పడిన హైదరాబాదు రాష్ట్ర కాంగ్రెస్‌ స్థాపనకు తోడ్పడిన పలు సంస్థలలో నిజాం సబ్జెక్ట్సు లీగ్‌ కార్యకలాపాల్లో అబుల్‌ హసన్‌ సయ్యద్‌ అలీ, బద్రుల్‌ హసన్‌, ఫజులుర్రెహమాన్‌, సిరాజుల్‌ హసన్‌ తిర్మిజ్‌ ప్రధాన పాత్ర నిర్వహించగా, ప్రముఖ జాతీయవాది బద్రుల్‌ హసన్‌ విదర్‌ హైదరాబాద్‌ (ఇనీరిశినీలిజీ కగిఖిలిజీబిలీబిఖి) అను గ్రంథాన్ని రాసి నిజాం సబ్జెక్ట్సు లీగ్‌ భావాలను ప్రచారం చేయగా, నిజాం ప్రభుత్వం ఆ గ్రంథాన్ని నిషేధించింది. ఆ తరువాత ఏర్పడిన 'స్వదేశీ లీగ్‌'కు నిజాం ప్రభుత్వ కళాశాల అధ్యాపకులు ఫజులుల్‌ ర్రెహమాన్‌ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. (హైదరాబాదు స్వాతంత్య్రోద్యమ చరిత్ర ః వెల్దుర్తి మాణిక్యరావు). ఆ తరువాత ఏర్పడిన హైదరాబాదు రాష్ట్ర కాంగ్రెస్‌కు వ్యవస్థాపకులలో మౌల్వి సిరాజుల్‌ హసన్‌ తిర్మిజ్‌ ఒకరుగా ఖ్యాతిగాంచారు. ఆయనతోపాటుగా షేక్‌ నబీ సాహెబ్‌, షేక్‌ మొయినుద్దీన్‌ తదితరులను ప్రచార కార్యక్రమాలలో పాల్గొని చాలా కాలం నిజాం ప్రభుత్వం నిర్బంధంలో గడిపారు. 1939లో ద్వితీయ ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. సంపూర్ణ స్వరాజ్యం కోరుతుండగా బ్రిటీష్‌ పాలకులు ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా, నాయకులతో ఏమాత్రం సంప్రదించకుండా ఎకపక్షంగా నిర్ణయాలు తీసుకుని ద్వితీయ ప్రపంచ యుద్ధంలో తమల్ని భాగస్వాములను చేయడాన్ని సహించలేకపోయారు. ఆ నేపధ్యంలో 1940 అక్టోబరు 17న ఆచార్య వినోబా భావేను తొలి సత్యాగ్రహిగా అనుమతిస్తూ మహాత్ముడు చారిత్రక వ్యక్తి సత్యాగ్రహ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు.
 
===అనంతపురం ముస్లింల పాత్ర ===