ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
→విధ్యాసాగర్ మరియు వితంతు వివాహాలు: అనువాదం |
|||
పంక్తి 11:
==విధ్యాసాగర్ మరియు వితంతు వివాహాలు==
మహిళల జీవనగతిని మెరుగు పరచడానికి విద్యాసాగర్ అలుపెరగని ఉద్యమము యొక్క ఫలితాలు, చరిత్ర లో చిరస్థాయి గా నిలిచి పోతాయి. విద్యా సాగర్ కాలము లో బ్రహ్మ సమాజం నాయకులైన రాజా [[రామ్మోహన్ రాయ్]], [[కేశవ చంద్ర సేన్]], [[దేవేంద్రనాథ్ ఠాగూర్]], క్రైస్తవ మతముకు చెందిన [[అలెక్సాండర్ డఫ్]],[[కృష్ణ మోహన్ బెనర్జీ]], [[లాల్ బెహారీ దేయ్]] లు కుడా సమాజ సంస్కరణలకు ప్రయత్నిస్తూ ఉండేవారు. వారిలా ఇతర సమాజములు సంస్కరణ పద్దతులు ప్రవేశపెట్టకుండా, విద్యాసాగర్ హిందూసామాజము లో లోపల నుండి మార్పు తెచ్చుటకు ప్రయత్నించెను. ప్రఖ్యాత [[సంస్కృత కాలేజీ]] ప్రిన్సిపాల్ గా పండితులను శాస్త్రములు చదివి వాటి అర్థములను సామాన్య మానవులకు అర్థమయ్యేలా చెప్పుటకు ఉత్సాహపరిచెను. శాస్త్రములు చదువుట వలన, పందిమ్మిదవ శాతాబ్దము లో అణగదొక్కబడిన మహిళల స్తితిని గిందూ ధర్మ శాస్త్రములు ఒప్పుకోవని, అదికారము లో ఉన్నవారి మూర్ఖాత్వమే దీనికి కారణమని తెలుసుకొనెను. న్యాయశాస్త్రము లో మహిళలకు ధనము సంపాదన లో వారసత్వము, మహిళల స్వతంత్రత విద్యలలో సమాజమునకు ఉన్న
పంక్తి 17:
ఇక ఆ పిల్లలు కొద్దికాలానికే భర్తను కోల్పోయి జీవితాంతం దుర్భరమైన వైధవ్యాన్ని అనుభవించవలసి వచ్చేది. వేదన, కట్టుబాట్లు, పేదరికము, వివక్షత వారి నిత్యజీవితంలో భాగంగా ఉండేవి. వారు మాంసం, చేపలు, ఉల్లి, వెల్లుల్లి (ఇంకా పెక్కు కుటుంబాలలో చక్కెర కూడా) తినడం నిషిద్ధం. ఉదయానే అందరికంటే ముందు లేచి చన్నీటి స్నానం చేసి, తడి చీర కట్టుకొని మంచు ఆరని పూలను కోయాలి. ఇంట్లో అందరికంటే వారిది ఆఖరి భోజనం, లేదా పస్తు. మగవారిని ఆకర్షించకుండా ఉండడానికి జీవితాంతం బోడితల, తెల్లచీర, ఇంకెవరికీలేనన్ని ఆంక్షలు, పూజానియమాలు వారికి అంటగట్టబడేవి. ఎందరో వితంతువులు ఇంటినుండి తరిమివేయబడి వారాణసి లేదా బృందావనం చేరి, ప్రార్ధనతో పరిశుద్ధులవ్వాలనే తలపుతో తలదాచుకొనేవారు. కాని వారిలో చాలామంది పడుపువృత్తికి, లేదా మగవారి అత్యాచారాలకు బలయ్యేవారు. ఆధారంలేని తల్లులుగా దుర్భరమైన జీవితాన్ని వెళ్ళబుచ్చేవారు.
విద్యాసాగర్ 1856లో వితంతుపునర్వివాహ చట్టం (15వ నెంబరు చట్టం) ప్రతిపాదించి దాని అమలుకుి అన్నివిధాలుగా కృషిచేశాడు. అదే సంవత్సరం డిసెంబరులో సంస్కృత కళాశాలలో విద్యాసాగర్ సహోద్యోగి అయిన శ్రీష్చంద్ర విద్యారత్న ఈ చట్టం క్రింద మొదటిసారి ఒక వితంతువును పరిణయమాడాడు. ఈ పెళ్ళిని కుదిర్చిన విద్యాసాగర్ ఈ చట్టం అమలుకు నిర్విరామంగా శ్రమించాడు. సంప్రదాయ పురోహితులు వెలివేసిన అలాంటి పెళ్ళిళ్ళకు స్వయంగా ఆయనే పురోహితునిగా వ్యవహరించేవాడు. తన కొడుకు ఒక వితంతువును పెళ్ళాడడానికి ప్రోత్సహించాడు. పెళ్ళి చేసుకొనలేని వితంతువుల సహాయార్ధం ఒక నిధిని ఏర్పాటు చేశాడు. చాలా వితంతు వివాహాలకు ఆయన స్వయంగా ధనసహాయం చేసి ఆర్ధికమైన ఇబ్బందులలో పడ్డాడు.
[[గౌతంఘోష్]] సినిమా "[[అంతర్జలి యాత్ర]]" 19వ శతాబ్దంలో [[బెంగాలీ]] కులీనబ్రాహ్మణ కుటుంబంలో బహుభార్యాత్వం ఇతివృత్తంగా నిర్మింపబడింది. అ సినిమాలో ఒక పడుచు తన ముసలిభర్త మరణంకోసం [[గంగానది]] తీరాన వేచి ఉంటుంది (అప్పుడు రోగగ్రస్తులను తరచు అలా వదిలివేసే వారు).
==సంస్కృత ముద్రణాలయం==
|