లాల్‌జాన్ బాషా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
లాల్ జాన్ భాషా ఒక రాజకీయవేత్త మరియు తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు. 1984లో గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరుపున పోటీ చేసి లోక్‌సభలో అడుగుపెట్టారు. 1991లో లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో ప్రముఖ రాజకీయవేత్త ఎన్.జి.రంగాను ఓడించారు. తరువాత ఆయన భారత పార్లమెంట్ ఎగువసభ అయిన రాజ్యసభ సభ్యునిగా కూడా ఓసారి పనిచేశారు. లాల్ జాన్ భాషా గుంటూరులో కీలకమైన నాయకుడుగా గుర్తింపుపొందారు.
==మరణం==
 
ఆగస్టు 15, 2013 , గురువారం నాడు [[హైదరాబాద్]] నుండి [[విజయవాడ]] వెళుతుండగా, [[నల్గొండ జిల్లా]], [[నార్కెట్‌పల్లి]] సమీపంలో కామినేని ఆసుపత్రి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో లాల్ జాన్ బాషా మృతి చెందారు. నల్గొండ నుంచి గుంటూరు వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తున్న కారు కామినేని ఆసుపత్రి వద్ద డివైడర్ ను ఢీ కొట్టడంతో ఆ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే మృతిచెందగా, కారు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. స్తానికుల సమాచారం మేరకు పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని బాషా మృతదేహాన్ని నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఆగస్టు 15, 2013 న కారు ప్రమాదంలో మరణించారు.
==సంతాపం==
 
బాషా మృతి చెందిన వార్త తెలియగానే [[నకిరేకల్]] ఎమ్మెల్యే తిరుమర్తి లింగయ్య, టీడీపీ నేతలు ఘటనాస్థలికి చేరుకున్నారు.అయితే లాల్ జాన్ బాషా మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. ఆ పార్టీ నేతలు బాషా మృతికి పట్ల సంతాపాన్ని ప్రకటించారు. బాషా మృతితో గుంటూరు జిల్లాలో విషాదఛాయలు అలుముకున్నాయి. పార్టీ ఓ మంచి నేతను కొల్పోయిందని [[నరసరావుపేట]] ఎంపీ మోదుగుల వేణుగోపాల రెడ్డి తన సంతపం ప్రకటనలో తెలిపారు.
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/లాల్‌జాన్_బాషా" నుండి వెలికితీశారు