పెద్ద బాలశిక్ష: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
వర్తకానికి వచ్చి రాజ్యాధిపతులైన ఆంగ్లేయులు వారి కొలువులో రెవెన్యూ డిపార్టుమెంటులో చాలీ చాలని జీతాలతో పనిచేస్తూవున్న స్థానికులు అడ్డదారులు తొక్కి ధనార్జన కోసం అక్రమాలు అన్యాయాలు మోసాలు దగాలు తప్పుడు రికార్డులు సృష్టించడం మొదలైనివి చేస్తున్నారని గుర్తించారు. స్థానికులు విశ్వసనీయంగా ప్రవర్తించాలంటే ఏమి చర్యలు తీసుకోవాలి అని ఆలోచించారు. స్థానికుల విద్యావిధానంలో లోపం ఉందని తెలుసుకున్నారు. ఆనాటి మద్రాసు గవర్నరు సర్ '''[[థామస్ మన్రో]] 1822 జూలై 2వ''' తేదీన ఒక యీ దస్తు కోరారు.అందులో ఇలా వుంది :
 
{{వ్యాఖ్య|<big>రాజ్యాలను సంపాదించాక మనం భౌగోళికంగా సర్వేలు చేయించాము. దేశంలో పండే పంటల ఆరాలు తీశాము. వనరుల గురించి భోగట్టాలు రాబట్టాము. జనాభా లెక్కలు గుణించాము. అంతేగాని స్థానికుల విద్యావిధానం గురించి తెలుసుకోడానికి ఏమాత్రం ప్రయత్నించలేదు.</big>|}}
 
స్థానికులలో మన విశ్వాసాలకు భంగం కలగకుండా వారి విద్యావిధానంలో ఏ మార్పులను తీసుకు రావాలో తెలుసుకున్నారు. అప్పటి దాకా తమ సివిల్ సర్వెంట్ల చదువు కోసమే పుస్తకాలను రాయించిన ప్రభువులు స్థానికుల కోసం ప్రాథమిక గ్రంథాలను రాయించాలని అనుకొన్నారు. '''1832 లో మేస్తర్ క్లూ లో (Clu Low) అనే తెల్లదొర, తన ఆశ్రితుడైన '''పుదూరు చదలవాడ సీతారామశాస్త్రి''' చేత ''బాలశిక్ష'' అనే గ్రంథాన్ని రచింపచేశాడు.''' ఈయన రచనా ప్రణాళికను చాలా జాగ్రత్తగా కుర్రవాళ్ళ గ్రహణశక్తిని దృష్టిలో వుంచుకొని రూపొందించాడు. ఇటువంటి పుస్తకం కోసమే ఆవురావురమంటూ ఎదురు చూస్తున్న మన దేశం దీనిని రెండు చేతులా ఆహ్వానించింది.
[[దస్త్రం:PeddaBalaSikshaPage11.jpg|250px|right|thumb|పెద్దబాలశిక్ష 11 వ పేజి]]
 
1856లో అంటే మొదటి ముద్రణకు రెండు పుష్కరాల తర్వాత వెలువడిన బాలశిక్షలోని పుటల సంఖ్య 78. డెమ్మీ ఆక్టావో సైజు. 1865లో అంటే రమారమి పదేళ్ళ తర్వాత ముద్రణలో పుటల సంఖ్య 90. అంటే పన్నెండు పేజీలు పెరిగాయన్నమాట. పాత ముద్రణలో లేని సాహిత్య విషయాలను, చందస్సు సంస్కృత శ్లోకాలు , భౌగోళిక విషయాలను యిందులో చేర్చారు.దానిని '''''బాలవివేకకల్ప తరువు'''''గా రూపొందించారు. అందుకనే అప్పటిదాకా బాలశిక్షగా ప్రచారంలోవున్న పుస్తకం '''''పెద్ద బాలశిక్ష'''''గా కొత్త పేరును దాల్చింది. ఈ పెద్ద బాలశిక్ష ఇందులో విషయపరిజ్ఞానికి-అంటే భాషాసంస్కృతులకు కావాల్సిన పునాదిరాళ్ళనదగిన భాషా విషయాలు- అక్షరాలు, గుణింతాలు వత్తులు, సరళమైన పదాలు- రెండు మూడు నాలుగు అక్షరాలతో కూడిన మాటలు, తేలిక వాక్యాలు- నీతి వాక్యాలు, ప్రాస వాక్యాలు, సంప్రదాయ సంస్కృతికి సంబంధించినవీ, అందరూ తెలుసుకోదగ్గవీ నాటికి తెలిసిన చారత్రిక, భౌగోళిక, విజ్ఞాన సంబంధ విషయాలను రూఢి వాచకాలను ఈ పుస్తకం ఆది స్వరూపంలోనే ఆనాడు పూదూరువారు పొందుపరచారు.
 
ఆ తరువాత, 1832 నుండి ఇప్పటివరకు పెద్ద బాలశిక్షను తెలుగు సమాజం ఆదరించగా కొన్ని మార్పుల చేర్పులతో ఎంతోమంది ప్రచురణకర్తలు ఎన్నో పండిత పరిష్కరణలతో అందిస్తూవచ్చారు. ఆ మధ్య ఎన్నో గుజిలీ ఎడిషన్లు కూడా లభిస్తూ వచ్చాయి. పుదూరివారి తర్వాత పేర్కొనదగిన పరిష్కరణ 1916లో వావిళ్ళ వారిది. దీని విపుల పరిష్కరణను 1949లో అందించారు. '''భాషోద్దారకులు [[వావిళ్ళ వేంకటేశ్వరశాస్త్రి]] 1949 పరిష్కరణలో''' ఇలా చెప్పారు:
{{వ్యాఖ్య|<big>భారత దేశమునకు స్వరాజ్యము లభించినందుకు ఇక ముందు దేశభాషలకు విశేషవ్యాప్తి ఏర్పడి ఇట్టి (పెద్దబాలశిక్ష) గ్రంథములకు వేలకువేలు ప్రచారమగునని తలంచుచున్నాను.ఇప్పుడు భారత దేశానికి స్వరాజ్యం వచ్చిన ఏభైతొమ్మిది సంవత్సరాలకు కూడా వయోజనులకే కాక, తెలుగు పిల్లలకు తెలుగుదనాన్ని నేర్పి చక్కని పండితపౌరులుగా తీర్చిదిద్దే సామర్ధ్యం ఈ పెద్ద బాలశిక్షకు ఉంది.</big>|}}

'''1983'''లో రాష్ట్ర ప్రభుత్వం దీని ప్రాశస్త్యాన్ని గ్రహించి కొన్ని భాగాల్ని పాఠ్యాంశాలుగా కూడ చేర్చింది.పత్రికాధిపతులు, విజ్ఞులు పెద్ద బాలశిక్ష ను గుణశీల పేటికగా అభివర్ణించారు.
[[దస్త్రం:PeddaBalaSikshaSamplePagesMonoSmall.jpg|250px|right|thumb| పెద్దబాలశిక్ష పేజీ 32, నీతివాక్యములు]]
 
ఆరుద్రగారు[[ఆరుద్ర]] గారు '''పుదూరు చదలవాడ సీతారామశాస్త్రి''' చేత ''బాలశిక్ష'' అని వ్రాశారు గానీ, పుదూరు '''పుదూరు సీతారామశాస్త్రి''' వేరు. ''' చదలవాడ సీతారామశాస్త్రి''' వేరు. '''పుదూరు సీతారామశాస్త్రి''' అనే వారు '' వజ్ఝల సీతారామశాస్త్రి''' . వీరి తమ్ములు వజ్ఝల నారాయణశాస్త్రి. వారు అన్నగారైన '''పుదూరు సీతారామశాస్త్రి''' గారికి ''బాలశిక్ష'' మలి ముద్రణలో తోడ్పడ్డారు. వీరు ఏనుగుల వీరాస్వామయ్యతో బాటు కాశీ యాత్రలో పాల్గొని పుదూరుకు వారిని తీసికెళ్లారు.
==ప్రజాదరణ పొందిన కొన్ని బాలశిక్ష ప్రచురణలు==
* గొల్లపూడి ప్రెస్ [[రాజమండ్రి]]
"https://te.wikipedia.org/wiki/పెద్ద_బాలశిక్ష" నుండి వెలికితీశారు