పిచ్చుకుంటులవారు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
దాన మొసగరే ధర్మాత్ములార.
</poem>
అని వర్ణించాడు. పై వివరణను బట్టి వారు [[అంగవైకల్యం]] కల కుంటి వారనీ, అంధులనీ తెలియటమే కాక, ''దాన మొసగరే ధర్మాత్ములార '' ఆనడాన్ని బట్టి వారు [[యాచకులు|యాచకులని]] అర్థమౌతూ వుంది. ఆ నాడు [[శ్రీశైలం|శ్రీ శైల క్షేత్రానికి]] వెళ్ళే యాత్రికుల్ని యాచిస్తూ వుండే వారని తెలుస్తూ వుంది. వీరిని సర్కారాంధ్ర దేశంలో పిచ్చి గుంటలాళ్ళని పిలుస్తూ వుంటారు. మరి కొన్ని చోట్ల పిచ్చుక కుంటల వాళ్ళనీ, - పిచ్చుకుంటలాళ్ళనీ, రక రకాలుగా పిలుస్తూ వుంటారు. వీరు భిక్షమెత్తే వారు కనుక భిక్షక శబ్దం పిచ్చకుంటులుగా మారిపోయి వుండవచ్చు.
 
;పద్యం:
పంక్తి 18:
 
అని వర్ణించాడు. పిచ్చుకుంటుల వారు ప్రధమంలో కాపుల గోత్రాలనూ, యాదవుల గోత్రాలనూ చెపుతూ వుండేవారు. కాల క్రమాన [[కమ్మ]] వారి గోత్రాలతో పాటు ఇతర కులాల వారి గోత్రాలను కూడ చెపుతూ వుండేవారు. అలా వారి వారి గోత్రాలను కూడా చెపుతూ వారినే యాచించే వారు. వీరికి పౌరోహిలులు జంగాలు. పిచ్చికుంటుల వారు తెలంగాణా జిల్లాలలో ఎక్కువగా వున్నారు. వీరిలో గంట - తురుక - మంద - తిత్తి - తొగరు మొదలైన ఉప జాతులు ఉన్నాయనీ, పన్నేండు తెగల వారు తెలంగాణాలో వున్నారనీ, ఒక తెగవారు సర్కాంధ్ర డేశంలో వున్నారనీ, ఈ నాడు తెలంగాణా రెడ్లుగా వున్న వారు ఒకప్పుడు కాపులకు సంబంధించిన కోటి గోత్రాలనూ, [[కోస్తా]] జిల్లాలలో వున్న కమ్మ వారికి కోటి గోత్రాలనూ చెప్పి యాచించే వారు<ref> డా: బి. రామ రాజుగారు వారి జానపద సాహిత్య గ్రంధం</ref>
 
==వారు చెప్పే కథలు==
[[తెలంగాణా]] లోని పిచ్చు కుంటుల వారు రాములమ్మ, బాలనాగమ్మ, కామమ్మ, సదాశివ రెడ్డి,[[ పర్వతాల మల్లార్తెడ్డ]], సూర్య చంద్ర ల్రాజులు, హరిశ్చండ్రుడు మొదలైన కథలను చెపుతున్నారు. ఇలా [[రాయలసీమ]] లో నున్న పిచ్చుకుంటుల వారు కుంతి మల్లారెడ్డి కథను గానం చేస్తారు. [[నెల్లూరు]], [[గుంటూరు]] ప్రాంతాల్లో పలనాటి వీర గాథల్నీ, కాటమ రాజు కథల్నీ గానం చేస్తూ వుంటారు.పిచ్చుకుంటుల వారందరూ భిక్షమెత్తే వారుగా గానీ, అంగ వైకల్యం కలవారుగా గానీ ఉండి వుండక పోవచ్చు. ఆ నాడు సోమనాథుని శ్రీ శైల యాత్రలో ఆపై నుదహరించిన అంగ వైకల్యం కలవారు కనిపించి వుండవచ్చును.
"https://te.wikipedia.org/wiki/పిచ్చుకుంటులవారు" నుండి వెలికితీశారు