ఇందిరా నాథ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 10:
[[కుష్టు వ్యాధి]] మీద ఈమె చేసిన పరిశోధనలు ప్రపంచ ప్రసిద్ధమైనవి. ఈమె ప్రస్తుతం [[అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ]]లోని బయోటెక్నాలజీ విభాగానికి అధిపతిగా ఎస్.ఎన్.బోస్ కేంద్రంలో పరిశోధకులుగా చిరకాలంగా పనిచేస్తున్నారు. ప్రొఫెసర్ నాథ్ కుష్టు వ్యాధి మీదనే కాకుండా మానవులలో వ్యాధి నిరోధక ప్రక్రియ (ఇమ్యునాలజీ) మీద జరిపిన పరిశోధనలు వైద్యంలోను, కొత్తగా వ్యాధులగురించి చేసే పరీక్షలు అభివృద్ధి చేయడానికి ఉపకరిస్తాయి.
==సంపాదకులుగా==
ఈమె "ఇండియన్ జర్నల్ ఆఫ్ లెప్రసీ" , "ఆసియన్ ఫసిఫిక్ జర్నల్ ఆఫ్ ఎలర్జీ అండ్ ఇమ్యూనిటీ" పత్రికలకు సహాయ సంపాదకులుగా పనిచేశరు. ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ వారి ప్రచురనల సంపాదక మండలికి ఛైర్ పర్సంగా కూడా వ్యవహరించారు.
==వివిధ పదవులు==
పరిశోధనా రంగంలో ఎంతో కృషి చేసిన డాక్టర్ ఇందిర ఇండియన్ అకాడామీ ఆఫ్ సైన్సెస్, కాలేజీ ఆఫ్ అలర్జీ అండ్ అప్లైయడ్ ఇమ్యూనాలజీ సంస్థలలో ఫెలోషిప్ అందుకుని పరిశోధనలు సల్పారు. పలు ప్రతిష్టాత్మక వైద్య సంస్థలలో వివిధ పదవులను అందుకుని, ఆయా సంస్థల అభివృద్ధికి కృషిచేసరు. నేషనల్ అకాడామీ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఇండియన్ ఇమ్యూనాలజీ సొసైటీ, ఇండియన్ అసోషియేషన్ ఆఫ్ పాథాలజిస్ట్స్ అండ్ మైక్రో బయోజజిస్ట్స్ మొదలగు సంస్థలలో బాధ్యతాయుత పదవులను నిర్వహించారు. ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లెప్రొలాజిస్ట్స్ జీవిత సభ్యులుగా ఉన్నారు.
 
==వ్యక్తిగత జీవితం==
"https://te.wikipedia.org/wiki/ఇందిరా_నాథ్" నుండి వెలికితీశారు