మహిళల జీవనగతిని మెరుగు పరచడానికి విద్యాసాగర్ అలుపెరగని ఉద్యమము యొక్క ఫలితాలు, చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోతాయి. విద్యా సాగర్ కాలములో బ్రహ్మ సమాజం నాయకులైన రాజా [[రామ్మోహన్ రాయ్]], [[కేశవ చంద్ర సేన్]], [[దేవేంద్రనాధ్ టాగూర్]], క్రైస్తవ మతముకు చెందిన [[అలెక్సాండర్ డఫ్]],[[కృష్ణ మోహన్ బెనర్జీ]], [[లాల్ బెహారీ దేయ్డే]]లు కుడా సమాజ సంస్కరణలకు ప్రయత్నిస్తూ ఉండేవారు. వారిలా క్రొత్త, ఇతర సమాజములు సంస్కరణ పద్దతులు ప్రవేశపెట్టకుండా, విద్యాసాగర్ హిందూసామాజము లోలోపల నుండి మార్పు తెచ్చుటకు ప్రయత్నించెను. ప్రఖ్యాత సంస్కృత కాలేజీ ప్రిన్సిపాల్గా పండితులను శాస్త్రములు చదివి వాటి అర్థములను సామాన్య మానవులకు అర్థమయ్యేలా చెప్పుటకు ఉత్సాహపరిచెను. శాస్త్రములు చదువుట వలన, పందిమ్మిదవ శాతాబ్దము లో అణగదొక్కబడిన మహిళల స్థితిని హిందూ ధర్మ శాస్త్రములు ఒప్పుకోవని, అదికారము లో ఉన్నవారి మూర్ఖత్వమే దీనికి కారణమని తెలుసుకొనెను. న్యాయశాస్త్రము లో మహిళలకు ధనము సంపాదనలో వారసత్వము, మహిళల స్వతంత్రత విద్యలలో సమాజమునకు ఉన్న అయిష్టతను కనిపెట్టెను.