డా వి.శాంతారామ్ జయంతి: మహారాష్టల్రోని కొల్హాపూర్కు[[కొల్హాపూర్]]కు సమీప గ్రామంలో తేదీ-18-11-1901వ సంవత్సరంలో జన్మించారు శాంతారామ్. 1921లో నటుడిగా చిత్రరంగప్రవేశం చేసిన ఆయన మూకీ, టాకీలు అన్నీ కలిపి 25 చిత్రాల్లో నటించారు. సుమారు 90 సినిమాలు నిర్మించారు. వీటిలో 55 సినిమాలకు స్వయంగా ఆయనే దర్శకత్వం కూడా వహించారు. కళాత్మక, వ్యాపార దృక్పథాలను మేళవించిన విలక్షణ దర్శకునిగా పేరుగాంచారు. అమరజ్యోతి, ఆద్మీ, దునియా న మానే, పడోసీ, స్ర్తీ, అమర్ భూపాలీ, డా కోట్నిస్ కీ అమర్ కహానీ మొ సినిమాలు శాంతారామ్ దర్శకత్వంలో వచ్చిన కొన్ని ఆణిముత్యాలు. నవరంగ్, గీత్ గాయా పత్థరోంనే, ఝనక్ ఝనక్ పాయల్ బాజే మొ చిత్రాల్లో కళాకారుడి అంతరంగాన్ని, ఆవేదనను ఆవిష్కరించారు. ‘శాంతారామ’ అనే పేరుతో తన ఆత్మకథను రాసుకున్నారు. చిత్రపరిశ్రమకు ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ... 1985లో కేంద్ర ప్రభుత్వం ‘దాదాసాహెబ్‘[[దాదా ఫాల్కే’సాహెబ్ అవార్డునుఫాల్కే పురస్కారం]] ను బహూకరించింది. అంతేకాక నాగపూర్ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ పొందిన ఆయన అక్టోబర్ 18, 1990వ సంవత్సరంలో మరణించారు.