కాళీపట్నం రామారావు: కూర్పుల మధ్య తేడాలు

చి corrected the typos and restructured ambiguous sentences. Did not add any new content.
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{వికీకరణ }}
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = '''కాళీపట్నం రామారావు'''
Line 42 ⟶ 43:
వీరు తెలుగు [[కథ]]కు శాశ్వతత్వాన్ని చేకూర్చే దిశగా విశేషకృషి చేశారు. [[ఆంధ్రభూమి]] దినపత్రికలో 'నేటి కథ' శీర్షికను నిర్వహించి క్రొత్త రచయితలకు అవకాశమిచ్చారు. 2008 జనవరి 18న లోకనాయక్ ఫౌండేషన్ వారు డా.వై.లక్ష్మీప్రసాద్ అధ్వర్యంలో [[విశాఖపట్నం]]లో కారా మాష్టారిని సన్మానించారు. ఆ సందర్భంగా లోక్ సభ స్పీకర్ తన సందేశంలో ఇలా చెప్పాడు - ఆరు దశాబ్దాలుగా కారా మాష్టారి కథలు తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశాయి. తన నిజజీవితంలో అనుభవించిన, పరిశీలించిన కష్టాలను, సంఘర్షణను ఆయన తన కథలలో ఇమిడ్చాడు. సమాజంలో అట్టడుగు వర్గాల జీవన సమరాన్ని సునిశితంగా పరిశీలించి తన పాత్రలలో చూపాడు. 1964లో వెలువడిన 'యజ్ఞం' కథ ఫ్యూడల్ విధానంలోని దోపిడీని కళ్ళకు కట్టినట్లు చూపుతుంది. అందుకే ఆయన కథలు ఇతర భారతీయ భాషలలోకి, [[రష్యన్]], ఇంగ్లీషు భాషలలోకి అనువదింపబడి పాఠకుల ఆదరణను చూరగొన్నాయి. రామారావు గారి కథా సాహిత్య దీక్షకు ప్రతిబింబమైన [[కథానిలయం]] విశిష్టమైన యత్నం.<ref>[http://speakerloksabha.nic.in/speech/SpeechDetails.asp?SpeechId=256 కారా సన్మానం సందర్భంగా లోక్ సభ్ స్పీకర్ సందేశం] ''Shri Kalipatnam Rama Rao, affectionately called ‘Ka Ra Mastaru’ in the Telugu literary world, is one such luminary who has had an ennobling literary career spanning nearly six decades. .. Shri Rama Rao’s writings reflect the social milieu of his own moorings, of the real life, experiences and difficulties he encountered in his younger days. It is these real-life experiences that equipped him to view the society around him with a critical eye, distancing himself from the class and caste system prevalent then and with immense love and affection for the poor and the downtrodden. His great story ‘Yagnam’ which he wrote way back in 1964, for which he was honoured with the prestigious the Central Sahitya Academy Award, poignantly depicted the feudal set up in a village. Shri Rama Rao’s stories are indeed incisive reflections on the social structure, conditions and class system of the times which unfortunately conditioned social behaviour and preferences than other higher values. In fact, Shri Rama Rao’s stories have left a deep impact on the readers and his felicitous writings have won him a very large number of admirers. Thanks to the translation of his works into Russian, English and many Indian languages, his stories have touched a deep chord among people far and wide.''
</ref>
 
కాళీపట్నం రామారావుగారు - ఎలిమెంటరీ స్కూలు హెడ్మాస్టరుగా రిటైరయ్యారు. కారా మాస్టారు గా పసిద్ది పొందిన కాళీపట్నం రామారావు సరళ భాషా రచయిత, కథకుడు, విమర్శకుడు. వృత్తిరీత్యా ఉపాధ్యాయులైన ఈయన రచనా శైలి సరళంగా ఉండి సామాన్యజ్ఞానం కల పాఠకులు సైతం రచనలో లీనమయ్యేలా, భావప్రాధాన్య రచనలు చేసారు . ప్రసిద్ధ నవలా రచయిత అయిన యండమూరి వీరేంధ్రనాధ్ రామారావు రచనల నుండి ప్రేరణ పొంది ఆయనను గురువుగా భావించేవాడు. ఈయన చేసిన రచనలు తక్కువైనా అత్యంత సుప్రసిద్ధమైన రచనలు చేసారు.
 
"యజ్ఞం" కథారచయితగా సుప్రసిద్ధులు. ఈ ఒక్క కథ రేపిన సంచలనం, ఈ కథ గురించి జరిగిన చర్చ తెలుగులో ఏ ఒక్క కథకీ జరగలేదంటే అతిశయోక్తి కాదేమో.
ఎప్పుడో ఆంప్ర సాహిత్య ఎకాడెమీ ఈయనకి అవార్డు ఇస్తే ప్రభుత్వవిధానాల పట్ల నిరసనతో ఆ అవార్డుని తిరస్కరించారు - బ్రహ్మానందరెడ్డి హయాంలో కావచ్చు. ఆ తరవాత 1995 ప్రాంతంలో కేంద్ర సాహిత్య ఎకాడెమీ ఎవార్డు ప్రకటించినప్పుడు మేస్టారు సందిగ్ధంలో పడ్డారు. ఆ ఎవార్డుని తెలుగు కథకి ఉపయోగకరంగా వాడవచ్చు అని చాలామంది ఆత్మీయులిచ్చిన ప్రోత్సాహంతో ఎవార్డుని స్వీకరించారు. ఎవార్డుగా
వచ్చిన సొమ్ముని మూలధనంగా పెట్టి కథానిలయానికి పునాది వేశారు.
కారామేస్టారి భావనలో కథానిలయం నిజంగా తెలుగు కథకి నిలయం. అక్కడ దొరకని తెలుగు కథ అంటూ ఉండకూడదని ఆయన ఆశయం. ప్రచురితమైన ప్రతి తెలుగు కథా అక్కడ ఉండాలి. కథలతో పాటు కథా రచయితల జీవిత విశేషాలు, ఛాయాచిత్రాల సేకరణ కూడా చేపట్టారు. ఎక్కడెక్కడి పాత పత్రికల కాపీలు సంపాదించడంలో విపరీతంగా శ్రమించారు.
కథానిలయం రెండంతస్తుల భవనం. శ్రీకాకుళం పట్టణంలో ఉంది. విశాఖ నించి నాన్-స్టాపు బస్సులో రెండు గంటల్లో వెళ్ళొచ్చు. కలకత్తా రైలు మార్గం మీద ఆమదాలవలసలో శ్రీకాకుళం రోడ్ అనే స్టేషను కూడా ఉంది. భవనంలో కింది అంతస్తు ప్రధాన పుస్తక భండాగారం. వెనక వేపు అరుదైన పుస్తకాల బీరువాలు. ఇక్కడే తెలుగు కథా త్రిమూర్తులు - గురజాడ, కొకు, రావిశాస్త్రులవి పెద్ద తైలవర్ణ చిత్రాలున్నాయి. పై అంతస్తులో ముందు
ఒక వందమంది దాకా కూర్చోవటానికి వీలైన పెద్ద హాలు. ఈ హాలు గోడల నిండా అంగుళం ఖాళీ లేకుండా తెలుగు కథా రచయితల ఫొటోలు. వెనక వైపున ఒక అతిధి గది బాత్రూము సౌకర్యంతో సహా - ఎవరైనా లైబ్రరీని ఉపయోగించుకోవటానికి వస్తే రెండు మూడు రోజులు సౌకర్యంగా ఉండొచ్చు.
ప్రతి ఏడూ మార్చి ప్రాంతంలో కథానిలయం వార్షికోత్సవం తన ఇంట్లో శుభకార్యంలాగా నిర్వహిస్తారు. బయటి ఊళ్ళ నించి చాలామంది కథకులూ, కథాభిమానులూ వస్తారు.
పనికట్టుకునైనా ఒక సారి వెళ్ళి చూడండి. కారామేస్టార్ని కలవండి.
 
==కథానిలయం==
 
కధా నిలయం, తెలుగు కధల సేకరణకు అంకితమైన ఒక గ్రంధాలయం. ప్రఖ్యాత కథకుడు కాళీపట్నం రామారావు తనకి వచ్చిన పురస్కారం అంతటినీ వెచ్చించి శ్రీకాకుళంలో ఫిబ్రవరి 22, 1997 సంవత్సరంలో ఈ గ్రంధాలయాన్ని స్థాపించేరు. తరువాత స్నేహితులు, దాతలు విరాళాలు ఇచ్చేరు. తెలుగులో రాయబడ్డ ప్రతి కథనీ ఈ గ్రంధాలయంలో భద్రపరచాలని స్థాపకుల ఆకాంక్ష.
 
తెలుగు సాహిత్యంలో ప్రచురించబడిన కధలను భావి తరాలవారికి పొందుపరచాలన్న బృహత్తర ఆశయంతో కాళీపట్నం రామారావు కధానిలయాన్ని స్థాపించాడు. తెలుగు కధకు అత్యుత్తమమైన ఇటువంటి రిఫరెన్సు గ్రంధాలయం ఏర్పరచే కృషి ఇంతకుముందు జరుగలేదని ప్రొఫెసర్ గూటాల కృష్ణమూర్తి అన్నాడు.
 
1997లో ఆరంభమైన ఈ "కథా నిలయం"లో (2000నాటికి) 4,000పైగా వారపత్రికలు, మాస పత్రికలు, విశేష పత్రికలు ఉన్నాయి. యువ, జ్యోతి, జాగృతి, ఆంధ్రజ్యోతి, ఆంధ్ర పత్రిక, భారతి, జయంతి, సంవేదన, అభ్యుదయ వంటి అనేక పత్రికల అమూల్యమైన సేకరణ ఇది. 1944 నుండి భారతి పత్రిక ప్రతులు ఇక్కడ సేకరించారు. అంతకు పూర్వపు ప్రతులను కూడా సేకరించే ప్రయత్నం జరుగుతున్నది.
 
ఇంకా కధానిలయంలో 2,000 పైగా కధల సంపుటాలు, కధా రచనల గురించిన మరో రెండు వేల పుస్తకాలు ఉన్నాయి. 1910లో ప్రచురించిన అక్కిరాజు ఉమాకాంతం రచన త్రిలింగ కధలు ఇక్కడి సేకరణలలో అన్నింటికంటే పాతది. తెలుగు రచనలలో క్రొత్త పుంతలకు దారి తీసినవని భావించే యద్దనపూడి సులోచనారాణి, యండమూరి వీరేంద్రనాధ్ వంటి రచయితల నవలలు కూడా కొన్ని ఈ సేకరణలో ఉన్నాయి. తెలుగులో షుమారు 3,000 మంది కధా రచయితలు ఉండవచ్చునని, కాని వారిలో 600 మంది రచనలే తమ సేకరణలోకి తేగలిగామని కా.రా. అన్నాడు. కొద్దిపాటి కధలు వ్రాసిన రచయితలు తమ రచనలు అంత ప్రముఖమైనవి కాకపోవచ్చునని భావించి, తమ రచనలు పంపరు. అయితే ప్రతి కధా ఏదో ఒక దృక్పధాన్ని లేదా సమాజ స్థితిని లేదా ఘటనలను వెలికి తీస్తుందని "కారా" భావన.
ఈయన [[శ్రీకాకుళం]]లో [[ఫిబ్రవరి 22]], [[1997]] సంవత్సరంలో [[కథానిలయం]] ఆవిష్కరించారు. ప్రస్తుతం కథా రచనకు దూరంగా ఉంటూ కథానిలయం కోసం ఎక్కువగా శ్రమిస్తున్నారు.
 
==కారా జీవిత విశేషాలు :==
పుట్టుక : 1924 లో ,
బాల్యము : శ్రీకాకుళం జిల్లాలో పల్లెపట్టు న ,
చదవు : శ్రీకాకులములో S.S.L.C వరకు , భీమిలిలో సెకెండరి గ్రేడ్ ట్రయినింగ్ ,
ఉద్యోగాలు : 1943 నుంది 1046 వరకూ నలుగైదు చోట్ల , స్థిరముగా ఇమడగలిగింది ఉపాద్యాయవృత్తిలో 1948 నుండి 31 ఏళ్ళు ఒకే ఎయిడెడ్ హైస్కుల్ లో ఒకేస్థాయి ఉద్యోగము . 1972 నుండి నేటివరకు పెన్సనర్ గానే జీవితము .
 
తనమాటల్లో "ఈ లోకములో నా శైశవం 1935 నుండి పాఠకుడుగా బాల్యము , 1940 - 1942 వరకు రాసేందుకు ఆశక్తి ప్రయత్నము .1943 నుండి ఐదేళ్ళు చిన్నచితగా పత్రికల్లో ఏవోవో కొన్ని రచనలు . 1948 నుండి ఆంధ్రపత్రిక ఉగాది సంచికలూ , భారతి వంటి పత్రిలలో పన్నెండు వరకు ఒక స్థాయి కధలు రాయగలిగాను . 1957 నుండి ఉన్నతస్థాయి కధలు రాయగలిగేందుకు అధ్యయనము . అది ఫలించి 1963 నుండి పదేళ్ళు పాటు మరో పన్నెందు కధానికలు రాయగలిగేను . ఆ తర్వాత కధలైతే రాయలేకపోయాను కాని కధను గురించిన అధ్యనము , అందుకవసరమైన ఇతర ప్రక్రియలలో సహా చదువూ నేటికీ కొనసాగుతూనే వున్నాయి. అభిప్రాయాలు పదిమంది తో పందుకోచడమూ ఆగలేదు ".
ఈయన [[శ్రీకాకుళం]]లో [[ఫిబ్రవరి 22]], [[1997]] సంవత్సరంలో [[కథానిలయం]] ఆవిష్కరించారు. ప్రస్తుతం కథా రచనకు దూరంగా ఉంటూ కథానిలయం కోసం ఎక్కువగా శ్రమిస్తున్నారు.
 
Line 63 ⟶ 92:
 
ఇంకా కథానిలయంలో 2,000 పైగా కథల సంపుటాలు, కథా రచన గురించిన మరో రెండు వేల పుస్తకాలు ఉన్నాయి. 1910లో ప్రచురించిన [[అక్కిరాజు ఉమాకాంతం]] రచన [[త్రిలింగ కథలు]] ఇక్కడి సేకరణలలో అన్నింటికంటే పాతది. తెలుగు రచనలలో క్రొత్త పుంతలకు దారి తీసినవని భావించే [[యద్దనపూడి సులోచనారాణి]], [[యండమూరి వీరేంద్రనాధ్]] వంటి రచయితల నవలలు కూడా కొన్ని ఈ సేకరణలో ఉన్నాయి. తెలుగులో షుమారు 3,000 మంది కథా రచయితలు ఉండవచ్చునని, కాని వారిలో 600 మంది రచనలే తమ సేకరణలోకి తేగలిగామని కా.రా. అన్నాడు. కొద్దిపాటి కథలు వ్రాసిన రచయితలు తమ రచనలు అంత ప్రముఖమైనవి కాకపోవచ్చునని భావించి, తమ రచనలు పంపరు. అయితే ప్రతి కథా ఏదో ఒక దృక్పథాన్ని లేదా సమాజ స్థితిని లేదా ఘటనలను వెలికి తీస్తుందని కారా భావన.
 
 
కథా నిలయం క్రింది అంతస్తులో పుస్తకాలు చక్కగా అద్దాల బీరువాలో అమర్చబడ్డాయి. ఎందరో శ్రేయోభిలాషులు, సాహితీ ప్రియులు, ప్రభుత్వం కూడా ఈ భవన నిర్మాణానికి సహాయం అందజేశారు. క్రింది భాగం హాలు పఠనాలయంగానూ, సమావేశ స్థలంగానూ ఉపయోగపడుతుంది. 1998నుండి కథా నిలయ పర్యవేక్షణ ఒక ట్రస్ట్‌బోర్డ్ అధీనంలో ఉంది. నిత్యం ఈ కథానిలయం నిర్వహణలోనూ, రచయితను తమ రచనలు పంపమని కోరడంలోనూ కారా నిమగ్నుడై ఉంటాడు. కారా స్వీయ రచనలు వివిధ పుస్తకాలుగా 971 పేజీలలో ప్రచురింపబడ్డాయి. వాటి అమ్మకం ద్వారా వచ్చిన సొమ్ము కూడా ఈ కథానిలయానికే చెందుతుంది.<ref>[http://www.hinduonnet.com/2000/12/01/stories/0401201w.htm హిందూ దినపత్రిక 2000 డిసెంబరు 1 న జి.వి.ప్రసాద శర్మ వ్యాసం]</ref>
Line 73 ⟶ 101:
*[http://www.prajakala.org/PDF/kara_interview.pdf ప్రజాకళలో ఇంటర్వ్యూ]
*[http://thatstelugu.oneindia.in/sahiti/mukhamukham/newindex.html దట్స్ తెలుగులో వ్యాసం]
* <ref>[http://www.hinduonnet.com/2000/12/01/stories/0401201w.htm హిందూ దినపత్రిక 2000 డిసెంబరు 1 న జి.వి.ప్రసాద శర్మ వ్యాసం]</ref>
 
*Dr.seshagirirao MBBS
*http://srikakulameminentpersons.blogspot.in/search/label/%E0%B0%95%E0%B0%BE%E0%B0%B3%E0%B1%80%E0%B0%AA%E0%B0%9F%E0%B1%8D%E0%B0%A8%E0%B0%82%20%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B5%E0%B1%81
[[వర్గం:తెలుగు రచయితలు]]
[[వర్గం:తెలుగు సాహితీకారులు]]
"https://te.wikipedia.org/wiki/కాళీపట్నం_రామారావు" నుండి వెలికితీశారు