నోబెల్ బహుమతి: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q7191 (translate me)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 13:
* [[ఆర్థిక శాస్త్రం]]
* [[శాంతి రంగం]]
NobelPrize,నోబెల్‌ బహుమతి
 
మేధావుల మహాస్వప్నం... నోబెల్ ‌-- నోబెల్‌ బహుమతి ఒక అత్యున్నత పురస్కారం... ఒక మహా స్వప్నం... మనదేశంలో పుట్టినవారు గానీ, ఈ దేశ పౌరసత్వం స్వీకరించిన వారు గానీ, ఈ దేశ వారసత్వం ఉన్నవారు గానీ నోబెల్‌ బహుమతి ప్రవేశపెట్టిన... నూట పది సంవత్సరాలలో ఇప్పటి వరకూ కేవలం ఎనిమిది మందిని మాత్రమే నోబెల్‌ బహుమతి వరించింది. ప్రపంచ వ్యాప్తంగా ఎందరో శాస్తవ్రేత్తలు నోబెల్‌ బహుమతి కోసం యాభై సంవత్సరాల పాటు ఎదురుచూచిన వారు ఉన్నారంటే దాని గౌరవం ఏ పాటిదో తెలుసుకొనవచ్చు. ఏవిధంగా చూచినా నోబెల్‌ బహుమతి వంటి విశిష్ట సత్కారం ఈ ప్రపంచంలో ఇంకొకటి లేదనటం అతిశయోక్తి కాదు.
 
==నోబెల్‌ పుట్టుక...==
విజ్ఞానం అనంతం. కాలము, దేశము, జాతి వంటి అవధులు దానికి వుండవు. అందుకే విజ్ఞాన ఖనులైన మహనీయులను మనం అన్ని విధాలుగా సత్కరించడం అవసరం. ఈ సత్కార్యాచరణ జరిపించాలనే సదుద్దేశంతో ఆల్ఫ్రెడ్‌ నోబెల్‌ తాను సంపాదించిన యావదాస్తితో 1900 సంలో నోబెల్‌ సంస్థలను స్థాపించి 1901 సం నుండి నోబెల్‌ బహుమతి ప్రకటించి సత్కరించడం విశేషము .
 
 
==నోబెల్‌ ఉద్దేశ్యం...==
ప్రతి సంవత్సరం జాతి మత ప్రాంత వివక్ష లేకుండా ‘మానవజాతి మేలుకోసం’ మహత్తరమైన కృషి చేసిన వారికి ఇవ్వబడతాయి. ఆల్ఫ్రెడ్‌ నోబెల్‌ అనే స్వీడిష్‌ శాస్తవ్రేత్త తన వీలునామాలో తనకు గల యావదాస్తి 90 లక్షల డాలర్ల విలువైన ఆస్తుల నుంచి వచ్చే ఆదాయం నుంచి ప్రతి సంవత్సరం అయిదు రంగాలలో బహుమతులను ఏర్పాటు చేయాలని నిర్దేశించాడు. భౌతిక, రసాయానిక, శరీర నిర్మాణ లేక వైద్య శాస్త్రాలలోను ఆదర్శవంతమైన, అత్యున్నత ప్రమాణాలు కలిగిన గ్రంధానికిగాను సాహిత్యంలోనూ, అంతర్జాతీయ రంగంలో శాంతికిగాను విశిష్ట సేవ చేసినందుకు ఈ బహుమతులు ఇవ్వాలని ఆల్ఫ్రెడ్‌ నోబెల్‌ తన విల్లులో ప్రతిపాదన చేసాడు.
 
==నోబెల్‌ ఎంపిక - అర్హత...==
బహుమతికి అర్హులైన వారిని ఎంపిక చేసుకోవడానికి విస్తృతమైన పరిశోధన అనుసరిస్తారు. తద్వారా జరిపే మూల్యాంకన విధానమే ఇప్పటికీ ‘నోబెల్‌ బహుమతి’ యొక్క ఘనతకు, గౌరవానికి కారణం. నోబెల్‌ బహుమతికి అర్హులను ఎన్నిక చేయటానికి కొందరు వ్యక్తులను ఎన్నుకొనబడతారు. అందుకుగాను ఎన్నిక చేయబడిన వ్యక్తులలో ఒకరు సిఫారసు చేస్తూ నోబెల్‌ బహుమతి పొందటానికి అర్హులని వ్రాత మూలకంగా తెలియపరిస్తే అర్హత పొందగల్గుతారు. నోబెల్‌ బహుమతి ప్రకటించే సంస్థలు దాదాపు ఆరువేల మంది వ్యక్తులను ప్రతిపాదించటానికి లేక నామ్నీకరణం చేయటానికి ఆహ్వానిస్తారు. నోబెల్‌ శాంతి బహుమతి మాత్రం కేవలం సంస్థలకే ఇవ్వడం జరుగుతుంది. నోబెల్‌ కమిటీ తన సన్నాహక కార్యక్రమాన్ని ప్రతీ సంవత్సరం ఫిబ్రవరి ఒకటవ తేదీన ప్రారంభిస్తుంది. బహుమతి ప్రధాన కమిటీలు పూర్తి నిర్ణయాలు అధికారాలు ఉన్న సంఘాలు, ఏకగ్రీవంగా కమిటీ చేసిన ఏ ప్రతిపాదననైనా కూడా బహుమతి నిర్ధాయక సంఘం తోసిపుచ్చవచ్చు. బహుమతి నిర్ధాయక సంఘంవారి అంతిమ నిర్ణయం తిరుగులేనిది. ఆ నిర్ణయాలకు ఇక పునర్విచారణ ఉండదు.
 
==నోబెల్‌ బహుమతి విలువ..==.
నోబెల్‌ బహుమతి ప్రధానోత్సవము ప్రతి సంవత్సరము ఆల్ఫ్రెడ్‌ నోబెల్‌ వర్థంతి అనగా డిసెంబరు 10వ తేదీ నాడు జరుపబడుతుంది. ఈ బహుమతి ప్రధానోత్సవం స్టాక్‌హోమ్‌ సమావేశ మందిరంలో జరుగుతుంది. స్వీడన్‌ రాజు చేత ప్రతీ బహుమతి గ్రహీతకు ఒక యోగ్యతాపత్రము, బంగారు పతకము, బహుమతి ధన మొత్తాన్ని నిర్థారించుతున్న పత్రములు బహుకరించబడతాయి. నోబెల్‌ బహుమతికై ఇచ్చే ధనం కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. నోబెల్‌ తాను స్థాపించిన పరిశ్రమలపై వచ్చే ధనాన్ని కూడా కొంత భాగం దీనికి మళ్ళించినందువల్ల ఈ మొత్తం సంవత్సరం, సంవత్సరం మారుతూ వుంటుంది. దీని విలువ స్విస్‌ కోనార్టు నుండి భారతీయ... విలువ ప్రకారము 5 కోట్ల రూపాయలు ఉండవచ్చని అంచన.
 
==నోబెల్‌ బహుమతి పొందిన భారతీయులు...==
నోబెల్‌ బహుమతి విజేతలైన భారతీయులు, భారత సంతతికి చెందిన వారు, భారత పౌరసత్వం స్వీకరించిన ఎనిమిది మంది జీవిత చరిత్రలు
- పరిచయం...
==1. రవీంద్రనాథ్‌ టాగూర్‌,Rabindranath (1913).==
 
 
ఆధునిక కాలంలో భారతీయ కవిత్వానికి ఒక మైలురాయిగా నిలిచి దేశ విదేశాలలో భారతీయ కీర్తి పతాకను ఎగురవేసిన మహా కవులలో ఆధునికుడు రవీంద్రనాథ్‌ టాగూర్‌. ప్రపంచంలో ఒకే కవి వ్రాసిన రెండు గీతాలను రెండు దేశాలు తమ జాతీయ గీతాలుగా చేసుకున్న ఘనత గల ఒక మహాకవి రవీంద్రనాధ్‌ టాగూర్‌. భారత, బంగ్లాదేశ్‌ రెండింటికి ఆయన వ్రాసిన గీతాలే జాతీయ గీతాలు ఇంతేగాకుండా తన కవితా సంపుటం ‘గీతాంజలి’కి 1913వ సంవత్సరపు సాహిత్యంలో నోబెల్‌ బహుమతి పొంది భారత కీర్తి బావుటాను ఎగురవేసిన భారత ముద్దుబిడ్డ నోబెల్‌ బహుమతి పొందిన మొదట ఆసియావాసి. సంపూర్తిగా సలలితమైన కొత్తవైన, సొగసైన పద్యాలతో ఆయనలో నిబిడీకృతమై ఉన్న నైపుణ్యంతో, కవితా చాతుర్యాన్ని పాశ్చాత్య సాహిత్యంలో కొంత భాగమైన ఇంగ్లీషు భాషలో తన స్వంత పదాలతో వ్యక్తపరచినందులకు నోబెల్‌ బహుమతి ఆయనకు ఇవ్వబడింది. గాంధీ, నెహ్రుల తరువాత భారతదేశంలో ప్రసిద్ధులైన వ్యక్తులలో రవీంద్రనాధ్‌ టాగూర్‌ ఒకరు.
 
==2. సర్‌ సి.వి.రామన్‌ -C.V-Raman (1930).==
 
 
భారతదేశానికి ప్రాచీనకాలం మంచి విజ్ఞాన శాస్త్రంలో కొంత కృషి చేసిన కీర్తి ఉన్నది. కానీ తురుష్కుల పరిపాలనలో దేశం వెయ్యి సంవత్సరాలకు పైగా అణగి మణగి ఉండటంతో మన విజ్ఞాన శాస్త్ర జ్ఞాన సంపద లుప్తం అయింది. ఆసక్తి అడుగంటి పోయింది. అలాంటి సమయంలో, దేశాన్ని ప్రపంచ విజ్ఞాన శాస్త్ర పటం మీదకు చేర్చ గలిగినవాడు, నేటికి నాటికి కూడా పూర్తి భారతీయుడై ఉండి తన విజ్ఞాన శాస్త్ర్త పరిశోధనలకు నోబెల్‌ బహుమతిని పొందిన మహామహుడు ఒక్కడు ఉన్నాడు. ఆయనే సర్‌ చంద్రశేఖర్‌ వెంకటరామన్‌. వాల్తేరులో ఉన్న ఆంధ్ర విశ్వవిద్యాలయ కళాశాల శాస్త్ర సాంకేతిక శాఖ యొక్క సంపూర్ణ అభివృద్ధికి ఆయన చాలా గొప్ప నిర్మాణాత్మక పాత్రవహించాడు. 1954 లో భారత ప్రభుత్వం మొట్టమొదటిసారిగా దేశంలో అత్యుత్తమ బిరుదు ‘భారతరత్న’ను ప్రవేశపెట్టి సర్వేపల్లి రాధాకృష్ణన్‌, చక్రవర్తుల రాజగోపాలాచారి, సి.వి.రామన్‌కు ప్రధానం చేసింది.
 
==3. హర్‌గోవింద్‌ ఖొరానా-HGKhorana (1968).==
 
 
1968వ సంవత్సరపు శరీరధర్మ శాస్త్రం లేక వైద్య శాస్త్రానికి నోబెల్‌ బహుమతి గెలుచుకున్న ముగ్గురిలో హర్‌గోవింద్‌ ఖొరానా ఒకరు. మిగిలిన ఇద్దరు అమెరికాకు చెందిన కార్నెల్‌ విశ్వవిద్యాలయ ఆచార్యులు రాబర్ల్‌ డబ్ల్యు. హాలీ, రెండవ వాడు హర్‌గోవింద్‌ ఖురానా, మూడవ వ్యక్తి బెథెస్టాలోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌లో పనిచేస్తున్న పరిశోధకులు మార్షల్‌ డబ్ల్యు. నిరెన్‌బెర్గ్‌. అవిభక్త భారతదేశాన్ని బ్రిటిష్‌ ప్రభుత్వం వారు పరిపాలిస్తున్న కాలంలో పశ్చిమ పంజాబ్‌ రాష్ట్రంలోని రాయ్‌పూర్‌ గ్రామంలో హిందూ దంపతులకు జన్మించాడు. రాయ్‌పూర్‌ గ్రామం కేవలం వంద మంది జనాభా గల చిన్న గ్రామం. బాగా పేద కుటుంబం అయినా ఖురానా తండ్రి కొడుకును బాగా చదివించాడు. 1945లో అప్పటి ప్రభుత్వ సహకారంతో ఇంగ్లాండుకు వెళ్ళి లివర్‌పూల్‌ విశ్వవిద్యాలయంలో పిహెచ్‌.డి చేసే అవకాశం లభించింది. విజ్ఞాన శాస్త్రంలో ‘మాలిక్యులర్‌ బయాలజీ’ అనే కొత్త శాఖకు పునాది వేసి ఇందులో విశేషమైన కృషి చేసారు. 1958 నుండి 1968 వరకు కేవలం 5 సార్లు మాత్రమే వైద్యశాస్త్రంలో అత్యుత్తమ కృషికి ఇవ్వబడిన నోబెల్‌ బహుమతి జన్యుశాస్త్రంలో జరిగిన పరిశోధనకు ఇవ్వటం మాలిక్యులర్‌ బయాలజీ యొక్క ప్రాముఖ్యాన్ని తెలుపుతుంది.
 
==4. మదర్‌ థెరిస్సా ,mother therisa(1979).==
 
మానవ సేవ కన్నా మిన్న లేదని చాటిన మహిళామణి మదర్‌ థెరిస్సా. ఈ దేశంలో పుట్టకపోయినా, ఈ దేశంలోని ఆపన్నులు, ఆర్తులు, ఆపదలో ఉన్నవారిని ఆదుకొనుట లో ఆమెను మించిన వారు లేరు. ప్రపంచంలోని గొప్ప మహిళామణులలో ఎవరు అంటే ఆమె పేరు పేర్కొనకుండా వేరొకరి పేరు చెప్పటానికి కుదరదు. అందుకే ఆమె ప్రపంచంలోనే అత్యంత గౌరవనీయమైన వనిత అనటంలో ఏమాత్రం అతిశయోక్తి ఉండదు. 1929 జనవరి 6వ తేదిన భారతదేశంలోని కలకత్తా నగరం చేరుకున్నది. అప్పటినుండి విద్యాబోధన చేస్తూ... 1947లో పేదరికాన్ని స్వీకరిస్తున్నట్లు ప్రమాణం చేసింది. ‘శాంతినగర్‌’ అనే పేరుతో అసన్‌సోల్‌ నగరం ఒక కాలనీ కట్టుకునేటట్లు కుష్టు రోగం గలవారిని ప్రోత్సహించింది. స్ర్తీ ధార్మిక సమాఖ్య, మిషనరీస్‌ ఆఫ్‌ చారిటీ అనే ధార్మిక సంస్థను నెలకొల్పింది. పద్మశ్రీ, భారతరత్న లాంటి అత్యున్నత పురస్కారాలు మదర్‌ థెరిస్సాకు అందించారు. ఆమె చేసిన సేవలు శాంతి బోధనకు ప్రపంచ అత్యున్నత పురస్కారం నోబెల్‌ శాంతి బహుమతి ఆమెను వరించింది.
 
==5. సుబ్రహ్మణ్యన్‌ చంద్రశేఖర్‌,subrahmanyan Chandrasekhar (1983)==
 
భౌతిక శాస్త్రంలో నోబెల్‌ బహుమతిని పొందిన భారత సంతతికి చెందిన రెండవ వ్యక్తి సుబ్రహ్మణ్యన్‌ చంద్రశేఖర్‌. సర్‌ సి.వి.రామన్‌ లాగానే ఈయన కూడా దక్షిణ భారత దేశానికి చెందినవాడే. ఆయన చికాగో విశ్వవిద్యాలయ పరిశోధన సభ్యులలో ఒకరిగా 1937వ సంవత్సరం జనవరి నెలలో చేరాడు. అప్పటినుంచి చివరివరకూ ఆయన సుదీర్ఘకాలం పాటు అంటే 60 సంవత్సరాలకు పై ఆ విశ్వవిద్యాలయంలోనే పనిచేసారు. చంద్రశేఖర్‌ ఇరవై వరకు గౌరవ పట్టాలు పొందారు. ఇరవై ఒక్క ప్రముఖ సంస్థలలో సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1983లో నోబెల్‌ బహుమతితో సహా ఎన్నో అంతర్జాతీయ పురస్కారాలు పొందారు. ఆయన గౌరవ స్మృతి చిహ్నంగా 1999లో అమెరికా ప్రయోగించిన ‘ఎక్స్‌రే అంతరిక్ష ఖగోళ దర్శిని’కి ‘చంద్రా’ అని పేరుపెట్టడం ఆయనకు దక్కిన అరుదైన గౌరవం.
 
==6. అమర్త్యసేన్‌,Amartya-Sen (1998):==
 
 
అర్థశాస్త్రంలో నోబెల్‌ బహుమతిని అందుకున్న వారిలో భారతదేశంలోనే కాదు, ఆసియా ఖండంలోనే ఏకైక వ్యక్తి ప్రొఫెసర్‌ అమర్త్యసేన్‌. మొత్తం ప్రపంచ దేశాలు, అర్థశాస్త్రం మీద నూతన దృష్టిసారించడానికి కారణం అయిన వ్యక్తి అమర్త్యసేన్‌. పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలోని శాంతినికేతన్‌ లో పుట్టిన అమర్త్యసేన్‌కు పేరు పెట్టింది రవీంద్రనాథ్‌ టాగూర్‌. అమర్త్యసేన్‌ ప్రపంచ ఆర్థికశాస్త్రంలో దారిద్య్రం, కరువులకు అన్వ యించేటట్లుగా నైతిక, తాత్త్విక అసమానత లు వివరించాడు. ఆయన బహుముఖ ప్రజ్ఞ కు 1998లో ఆయనను ఆర్థిక శాస్త్రంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన నోబెల్‌ బహుమతి వరించింది. అదే సంవత్సరం భారతదేశపు అత్యంత ప్రతిష్టాత్మక ‘భారతరత్న’ బిరుదు ఇవ్వబడింది. ఇప్పటివరకు అర్థశాస్త్రంలో నోబెల్‌ బహుమతి పొందిన ఏకైక మేధావి.
 
7. విద్యాధర్‌ సూరజ్‌ నయిపాల్‌,Vidyadhar Suraj Naipaul (2001).
 
 
విద్యాధర్‌ సూరజ్‌ నయిపాల్‌ పూర్వీకుల రీత్యా భారత సంతతికి చెందినవాడు. ఆయన తాతలనాడే వెస్టిండీస్‌లోని ట్రినిడాడ్‌ దీవికి వ్యవసాయక్షేత్రాలలో కూలీలుగా పనిచేయటానికి వెళ్ళారు. ఆయనకు గ్రేట్‌ బ్రిటన్‌ పౌరునిగా పరిగణనతో నోబెల్‌ బహు మతి ఇవ్వబడింది. కానీ, ఆయన పూర్వీకులు భారతీయ సంతతికి చెందిన వారు కావడం వలన మనం ప్రస్తావించడం జరుగుతుంది. మనోగోచారమైన, అర్థవంతమైన నిశితమైన పరిశీలనను తన రచనలలో ఏకం చేయ గలిగిన ప్రజ్ఞ, అణచివేయబడిన చరిత్రల ఉనికిని వాటితో ప్రతిఫలింపచేసినందుకు గాను సాహిత్యంలో వి.ఎస్‌.నయిపాల్‌కు నోబెల్‌ పురస్కారం లభ్యమైంది.
 
==8. వెంకట్రామన్‌ రామకృష్ణన్‌,Venkatraman Ramkrishanan (2009)==
 
 
సుబ్రహ్మణ్యన్‌ చంద్రశేఖర్‌, విద్యాధర్‌ సూరజ్‌ నయిపాల్‌ల తరువాత నోబెల్‌ పురస్కారం అందుకున్న, విదేశాల్లో స్థిరపడిన మరో భారత సంతతి శాస్తవ్రేత్త వెంకట్రామన్‌ రామృష్ణన్‌. ఈయన జీవరసాయన శాస్తజ్ఞ్రుడు. తమిళనాడులోని చిదంబరంలో 1952 సంవత్సరములో జన్మించాడు. తండ్రి ఉద్యో గరీత్యా గుజరాత్‌కు వెళ్ళడంతో బాల్యం, విద్యాభ్యాసమంతా బరోడాలో గడిచింది. మహారాజా శాయాజీరావు విశ్వవిద్యాలయం లో బీయస్సీ ఫిజిక్స్‌ చదివాడు. తర్వాత అమెరికా వెళ్ళి భౌతికశాస్త్రంలో పీహెచ్‌.డీ చేసి అక్కడే స్థిరపడ్డాడు. రైబోసోముల రూపము, ధర్మములపై చేసిన పరిశోధనలకు గాను రసాయన శాస్త్రంలో 2009 నోబెల్‌ పురస్కారం లభించింది.
 
==మహాత్మా గాంధీ(Gandhi)కి నోబెల్‌ బహుమతి ఎందుకు రాలేదు?.==
 
ఇది ప్రపంచంలోని అనేకులకు వచ్చే ఇంకొక సందేహం. 1937, 1938, 1939, 1947 సంవత్సరాలలో మహాత్మా గాంధీ పేరు నోబెల్‌ శాంతి బహుమతి కోసం ప్రతిపాదించడం జరిగింది. 1937లోను, అటు తరువాత కొంతకాలం పాటు ఆయన అను చరులకే అర్థం కాని ఆయన సిద్ధాంతాలున్నా యని నోబెల్‌ కమిటీవారు ఆయన పేరును తుది జాబితాలో చేర్చలేదు. 1947లో పాకిస్తాన్‌ ఏర్పాటు విషయంలో వివాదాలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఆయనకు అవార్డు ఇవ్వకూడదని కమిటీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. 1948లో నోబెల్‌ శాంతి బహుమతి కోసం మహాత్మా గాంధీని ఎంపిక చేశారు. అయితే ఆయన ఆ సంవత్సరం జనవరి 30వ తేదీన తుపాకీ గుండ్లకు బలి అయినారు. అప్పట్లో ఉన్న నియమం ప్రకారం కొన్ని ప్రత్యేక పరిస్థితులలోనే మరణించిన వ్యక్తుల కు నోబెల్‌ బహుమతులు ప్రకటించాలనేది నిబంధన. గాంధీ ఒక సంస్థకు ప్రతినిధి కాదు. మరణ విల్లును ఆయన వ్రాయలేదు. బహుమతి ఎవరికి అందజేయాలో నోబెల్‌ సంస్థకు తెలియకపోవడంతో ప్రతిపాదన విరమించుకోబడింది. ఒక అర్హులు ఎవ్వరూ లేకపోవడంతో ఆ సంవత్సరం నోబెల్‌ శాంతి బహుమతి ఎవ్వరికీ ఇవ్వలేదు. అంతేగాని కొందరు ఊహించినట్లుగా ఆయన బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా ఉద్యమం నడపటం వలన, తెల్లవారికి వ్యతిరేకంగా నల్ల వారి తర పున ఉద్యమాలకు నాయకత్వం వహించటం వలనే మహాత్మా గాంధీకి నోబెల్‌ బహుమతి ఇవ్వలేదనే వాదం సరియైనది కాదు. ఇలా ఈ బహుమతుల మీద ఎన్నో ప్రశంస లు, ఎన్నో విమర్శలు.
 
==చివరి కోరిక :==
ఆధునిక భారతదేశంలో వైద్యం, ఇంజనీరింగ్‌, సాఫ్ట్‌వేర్‌ రంగాలు విజృంభించి యువకులకు ఉపాధి అవకాశా లకు ఆకర్షితులై మౌ లికమైన శాస్త్ర పరిశోధన, శాస్ర్తీయ విజ్ఞాన అధ్యయనాలను అంతగా పట్టించుకోవడం లేదు. సి.వి.రామన్‌ వంటి మహా శాస్తజ్ఞ్రుడు ఏ విదేశీ విద్య, శిక్షణ లేకుండా స్వతహాగా కళాశాల స్థాయినుంచే శాస్ర్తీయ విషయ పరిశోధనా రంగంలో విశేష పరిశ్రమ చేసి, నోబెల్‌ బహుమతిని పొంది భారతదేశానికి ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చాడు. నేటి విద్యార్థులు కూడా అలాంటి మార్గదర్శకత్వం, శిక్షణ కోసం ఉవ్విళ్లూరుతున్నారు. మన శాస్తవ్రేత్తల స్ఫూర్తితో ప్రభావితులై, భవిష్య భారతం ఎందరో బహుమతి విజేతలు కావాలి అని నా కోరిక .
 
 
 
--మూలము : సూర్య ఆదివారము అనుబంధము / కూనిరెడ్డి శ్రీనివాస్
*Courtesy with : Surya Telugu daily news paper Sunday Edition:
*https://sites.google.com/site/scientistsintelugu/home/nicolas-copernicus/nobel-prize-origin
== ఇవీ చూడండి ==
* ప్రపంచవ్యాప్తంగా అందరు [[నోబెల్ బహుమతి గ్రహీతలు]]
"https://te.wikipedia.org/wiki/నోబెల్_బహుమతి" నుండి వెలికితీశారు