కళ్ళం అంజిరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 39:
మనదేశం నుంచి ప్రపంచానికి ఏదైనా కొత్త ఔషధాన్ని అందించాలనేది అంజిరెడ్డి కల. ఒక అణువు (మాలిక్యూల్‌)ను కనుగొనటం నుంచి దాన్ని అభివృద్ధి పరచి, తయారు చేసి, ఔషధ పరీక్షలు నిర్వహించి ప్రపంచ మార్కెట్లో విడుదల చేసేంత శక్తి ప్రస్తుతం బహుళ జాతి కంపెనీలకు మాత్రమే ఉంది. మొదటి అడుగు నుంచి చివరి దాకా ఒక ఔషధాన్ని రూపొందించి మార్కెట్‌ అందించే శక్తి ఇప్పటిదాకా మనదేశంలోని కంపెనీలకు లేదు. అందుకు ఎన్నో ఏళ్ల శ్రమ, వేల కోట్ల రూపాయిల ఖర్చు ఇమిడి ఉంటుంది. సగం దూరం వెళ్లాక అపజయాలు సైతం తప్పవు. దాన్ని తట్టుకునే శక్తి మన కంపెనీలకు లేదు. అందువల్ల ఇటువంటి పూర్తిస్థాయి పరిశోధనలు ఇప్పటికే మనదేశంలోని ఔషధ కంపెనీలకు అందని ద్రాక్షగానే ఉంది. ఆమాట కొస్తే ఇలాంటి శక్తి ప్రపంచంలోనే ఐదు పది కంపెనీలకు మించి లేదు. డాక్టర్‌ అంజిరెడ్డి దీన్ని సాధించాలని అనుకున్నారు. ఈ దిశగా ఎంతో ముందుకు సాగారు. కానీ అర్ధాంతరంగానే ఈ లోకాన్నే విడిచిపెట్టారు. కానీ ఔషధ రంగంపై ఆయన వేసిన ముద్ర చెరిగిపోనిది. ఆయన సాధించిన విజయాలు, అనుసరించిన మార్గం ఇతర ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు నిరంతరం స్ఫూర్తిదాయకంగా ఉంటాయి.
 
 
===పరిశోధనలు-పేటెంట్లు===
ఔషధ మార్కెట్‌లో రక్షణాత్మక ధోరణులు పెరగటాన్ని, పేటెంట్ల పేరుతో అభివృద్ధి చెందిన అమెరికా, ఐరోపా మార్కెట్లలో కొత్తవారికి ప్రవేశం కష్టం కావటాన్ని గుర్తించి ముందుగా మేల్కొన్న పారిశ్రామికవేత్త డాక్టర్‌ అంజిరెడ్డి అంటే అతిశయోక్తి కాదు. అమెరికా అతిపెద్ద ఔషధ మార్కెట్‌. స్వదేశంలో ప్రజలకు చౌకగా మందులు అందించిన ఆయన, సంస్థ కోసం.... భవిష్యత్తు పరిశోధనల కోసం డబ్బు సంపాదించాలంటే అమెరికా మార్కెట్లో అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నారు. కానీ అక్కడ అంతా పేటెంట్ల రాజ్యం. బహుళ జాతి సంస్థలు ఒక పట్టాన ఇతర కంపెనీలను అక్కడికి రానివ్వవు. అయినా తన పరిశోధన నైపుణ్యంతో అమెరికా మార్కెట్‌ను సవాలు చేయాలని నిర్ణయించుకున్నారు. దీనికి అనువుగా ఎంతో కీలకమైన గుండె, డయాబెటిస్‌, క్యాన్సర్‌ తదితర విభాగాలను ఎంచుకున్నారు. డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబరేటరీస్‌కు పరిశోధన విభాగంలో వెన్నుదన్నుగా నిలిచేందుకు డాక్టర్‌ రెడ్డీస్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ను నెలకొల్పారు. వందల మంది యువ శాస్త్రవేత్తలను నియమించి వారిలో ఒకడిగా కలిసిపోయి రాత్రింబవళ్లూ పరిశోధన కార్యకలాపాల్లో మునిగితేలారు. అమెరికా ఔషధ సంస్థ వద్ద పెద్దఎత్తున పేటెంట్‌ దరఖాస్తులు దాఖలు చేశారు. అక్కడ ఎన్నో న్యాయవివాదాలను ఎదురీదారు. దాని ఫలితాలు త్వరలోనే కనిపించాయి. పేటెంట్‌ గడువు తీరిన ఎన్నో ఔషధాలను అమెరికా మార్కెట్‌కు అందించటం ఒక ఎత్తయితే, ఆరు నెలల పాటు ప్రత్యేక మార్కెటింగ్‌ హక్కులతో అమెరికాలో తన ఔషధాలను విక్రయించే అనుమతి పొందిన అతికొద్ది భారతీయ కంపెనీల్లో ఒకటిగా నిలిచారు. ఆ తర్వాత ఐరోపా, రష్యా, మధ్యప్రాచ్యం... ఇలా డాక్టర్‌ రెడ్డీస్‌ విస్తరించని దేశం అంటూ లేదు. పరిశోధన లేనిదే ప్రగతి లేదని గట్టిగా విశ్వసించటంతో పాటు, దాని తూచ తప్పకుండా ఆచరణలో పెట్టిన అరుదైన వ్యక్తిత్వం ఆయనది. పరిశోధన కోసం వందల కోట్ల రూపాయిలు వెచ్చించాల్సి ఉంటుంది. ఒక్కోసారి ఎదురుదెబ్బలు కూడా తప్పవు. ఇటువంటి అనుభవాలు ఆయనకూ ఎదురయ్యాయి. కానీ వాటికి ఎదురునిలిచారు. సమయానుకూలంగా వ్యాపార వ్యూహాలను మార్చుకున్నారు కానీ, పరిశోధన పథం నుంచి మాత్రం వైదొలగలేదు.
 
==అరుదైన వ్యక్తిత్వం==
అంజిరెడ్డికి ఆలకించే గుణం ఎక్కువ. ఎక్కువగా మాట్లాడడమన్నా, ఎక్కువగా మాట్లాడే వారన్నా ఆయనకు ఇష్టం ఉండదు. చెప్పదలచిన మాటలు సూటిగా, స్పష్టంగా, పదునుగా చెప్పటం ఆయనకు అలవాటు. ఉదయం వేళ నడకలో తనతో కలిసి వచ్చే వ్యక్తి తనను అవీఇవీ అడుగుతున్నారని ఇష్టపడక ఆయనను మార్చేసి అసలు ప్రశ్నలే అడగని వ్యక్తిని నడకలో సహచరుడిగా ఎంచుకున్న తత్వం ఆయనది. ఔషధ మార్కెట్లో ఏదైనా అరుదైన ఘనత సాధించినప్పుడు విజయ గర్వం ఆయన మొహంలో దరహాసమాడుతుంది కానీ బయటకు అంతగా కనిపించినివ్వరు. అదేవిధంగా ఏదైనా అపజయం ఎదురుపడినప్పుడు కుంగిపోవడం అనేదే ఉండదు. కొన్ని ఔషధాల విషయంలో వైఫల్యం ఎదురైనా, కొత్త ఔషధాలను ఆవిష్కరించి ప్రపంచానికి అందించాలనే ప్రయత్నంలో గట్టి ఎదురుదెబ్బలు తగిలినా, తన వ్యాపార వ్యూహాన్ని మార్చుకోవలసి వచ్చినా కంగారుపడలేదు. మొండిగా ముందుకు వెళ్లటమే ఆయన నైజం. ఏదైనా విషయాన్ని వెంటనే గ్రహిస్తారు. ఎన్నో ఏళ్లుగా మీ కంపెనీలో వాటాదారుడిగా ఉన్నాం, కానీ ఈ కంపెనీ ఏయే మందులు తయారు చేస్తుందనేది మాకు తెలియటం లేదు, వార్షిక నివేదికలో ఆ విషయం లేదు అని ఒకసారి కంపెనీ వార్షిక సమావేశంలో ఒక వాటాదారుడు ప్రశ్నించారు. దాన్ని సరిదిద్దుతామని డాక్టర్‌ రెడ్డి బదులివ్వడమే కాక ఆ మరుసటి ఏడాది వార్షిక నివేదికలో డాక్టర్‌ రెడ్డీస్‌ తయారు చేసే ఔషధాల జాబితా కనిపించింది. ఇలాగే మరొక వార్షిక సమావేశంలో.. ప్రజలకు ఔషధాలు విక్రయించి బాగా లాభాలు ఆర్జిస్తున్నారు, బదులుగా వారికేమైనా చేయాలనుకోరా? అని ప్రశ్న ఎదురయింది. దానికి ఆయన ఆలోచనలో పడిపోయారు. ఆ తర్వాత స్వల్పకాలంలో పలు సామాజిక కార్యకలాపాలు రూపుదిద్దుకున్నాయి. ప్రజలకు ఉచితంగా ఏదైనా ఇవ్వడం కంటే వారిలో నైపుణ్యాన్ని పెంచితే సొంతంగా పైకి వస్తారని విశ్వసించి, దానికి అనుగుణంగా గ్రామీణ నిరుపేద యువకుల ఉపాధి శిక్షణ కోసం 'ల్యాబ్స్‌' కార్యక్రమాన్ని చేపట్టారు. డాక్టర్‌ రెడ్డీస్‌ ఫౌండేషన్‌ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. అదేవిధంగా నాంది ఫౌండేషన్‌కు ఆయన క్రియాశీలకమైన మద్దతు నిచ్చారు.
 
==పరిశోధనలు-పేటెంట్లు==
ఔషధ మార్కెట్‌లో రక్షణాత్మక ధోరణులు పెరగటాన్ని, పేటెంట్ల పేరుతో అభివృద్ధి చెందిన అమెరికా, ఐరోపా మార్కెట్లలో కొత్తవారికి ప్రవేశం కష్టం కావటాన్ని గుర్తించి ముందుగా మేల్కొన్న పారిశ్రామికవేత్త డాక్టర్‌ అంజిరెడ్డి అంటే అతిశయోక్తి కాదు. అమెరికా అతిపెద్ద ఔషధ మార్కెట్‌. స్వదేశంలో ప్రజలకు చౌకగా మందులు అందించిన ఆయన, సంస్థ కోసం.... భవిష్యత్తు పరిశోధనల కోసం డబ్బు సంపాదించాలంటే అమెరికా మార్కెట్లో అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నారు. కానీ అక్కడ అంతా పేటెంట్ల రాజ్యం. బహుళ జాతి సంస్థలు ఒక పట్టాన ఇతర కంపెనీలను అక్కడికి రానివ్వవు. అయినా తన పరిశోధన నైపుణ్యంతో అమెరికా మార్కెట్‌ను సవాలు చేయాలని నిర్ణయించుకున్నారు. దీనికి అనువుగా ఎంతో కీలకమైన గుండె, డయాబెటిస్‌, క్యాన్సర్‌ తదితర విభాగాలను ఎంచుకున్నారు. డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబరేటరీస్‌కు పరిశోధన విభాగంలో వెన్నుదన్నుగా నిలిచేందుకు డాక్టర్‌ రెడ్డీస్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ను నెలకొల్పారు. వందల మంది యువ శాస్త్రవేత్తలను నియమించి వారిలో ఒకడిగా కలిసిపోయి రాత్రింబవళ్లూ పరిశోధన కార్యకలాపాల్లో మునిగితేలారు. అమెరికా ఔషధ సంస్థ వద్ద పెద్దఎత్తున పేటెంట్‌ దరఖాస్తులు దాఖలు చేశారు. అక్కడ ఎన్నో న్యాయవివాదాలను ఎదురీదారు. దాని ఫలితాలు త్వరలోనే కనిపించాయి. పేటెంట్‌ గడువు తీరిన ఎన్నో ఔషధాలను అమెరికా మార్కెట్‌కు అందించటం ఒక ఎత్తయితే, ఆరు నెలల పాటు ప్రత్యేక మార్కెటింగ్‌ హక్కులతో అమెరికాలో తన ఔషధాలను విక్రయించే అనుమతి పొందిన అతికొద్ది భారతీయ కంపెనీల్లో ఒకటిగా నిలిచారు. ఆ తర్వాత ఐరోపా, రష్యా, మధ్యప్రాచ్యం... ఇలా డాక్టర్‌ రెడ్డీస్‌ విస్తరించని దేశం అంటూ లేదు. పరిశోధన లేనిదే ప్రగతి లేదని గట్టిగా విశ్వసించటంతో పాటు, దాని తూచ తప్పకుండా ఆచరణలో పెట్టిన అరుదైన వ్యక్తిత్వం ఆయనది. పరిశోధన కోసం వందల కోట్ల రూపాయిలు వెచ్చించాల్సి ఉంటుంది. ఒక్కోసారి ఎదురుదెబ్బలు కూడా తప్పవు. ఇటువంటి అనుభవాలు ఆయనకూ ఎదురయ్యాయి. కానీ వాటికి ఎదురునిలిచారు. సమయానుకూలంగా వ్యాపార వ్యూహాలను మార్చుకున్నారు కానీ, పరిశోధన పథం నుంచి మాత్రం వైదొలగలేదు.
 
 
==కుటుంబం==
కుమారుడు సతీష్‌రెడ్డి కంపెనీ ఎండీ, సీఈవోగా బాధ్యతలు నిర్వహిస్తుండగా, అల్లుడు జి.వి.ప్రసాద్‌ కంపెనీ వైస్‌ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.
"https://te.wikipedia.org/wiki/కళ్ళం_అంజిరెడ్డి" నుండి వెలికితీశారు