మల్లాది వెంకట కృష్ణమూర్తి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) |
K.Venkataramana (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 40:
'''మల్లాది వెంకట కృష్ణమూర్తి''' సమకాలీన తెలుగు రచయితలలో పేరున్న వాడు. ఈయన రచనలు సహజత్వానికి దగ్గరగా ఉండి మలుపులతో ఉత్కంఠగా సాగుతాయి. ఆయన 1949, నవంబర్ 13న విజయవాడలో జన్మించాడు. <ref>http://www.telugucinema.com/c/publish/starsprofile/malladivkm.php</ref>. మల్లాది శారదాంబ, మల్లాది దక్షిణామూర్తి ఆయన తల్లిదండ్రులు. వారి కుటుంబంలో ఆయన ఏడో సంతానం. 1969 లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రుడైన ఆయన 1972 వరకు వివిధ ప్రైవేటు సంస్థల్లో పనిచేసి, హైదరాబాదు లోని ప్రభుత్వ అడిట్ కార్యాలయంలో ఆడిటరు గా చేరాడు. 1986 లో ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తిస్థాయి రచయితగా మారాడు. ఎందరో సంపాదకులు, మల్లాది చిత్రాన్ని, తమ పత్రికలలో ప్రచురిస్తామన్న అభ్యర్దనకు, రచయిత తన అంగీకారమివ్వనందువలన, మల్లాది ఛాయాచిత్రం ఇంతవరకూ ఎక్కడా ప్రచురితం కాలేదు.
మల్లాగి రచయిత అవడానికి ప్రధాన ప్రేరణ ఆయన బాల్యంలో చదివిన అనేకానేక పత్రికలూ, నవలలు. ఆయనకు ఏడుగురు అక్కలు. వాళ్ళందరికీ పత్రికా పఠనం అంటే ఎంతో ఆసక్తి. వారి అమ్మ [[మల్లాది శారదాంబ]] ఆంధ్ర ప్రభ వీక్లీ కొనేది. వారి పక్కింటివాళ్ళు [[ఆంధ్ర పత్రిక]] ని కొనేవారు. వాటిని వారు ఎక్సేంజ్ చేసుకుని చదువుకునేవాళ్ళు.ఆ రోజుల్లో మధ్య తరగతి వాళ్ళు ఈపద్ధతిని అనుసరించేవారు. ఇలా నా ఏడో ఏటనించే ఆయన తెలుగు పుస్తకాలు చదవడం ఆరంభించారు. సాయంత్రాలు ఆయన వారి ఇంటికి ఐదు నిముషాల నడక దూరంలో వున్న గాంధీనగర్లోని ఓ లైబ్రరీకి వెళ్ళి అనేక పుస్తకాలని చదివేవారు. అది నాగేశ్వరరావు పంతులు రోడ్లో ఎస్ కే పీ వీ వీ స్కూల్ సమీపంలో వుండేది. ప్రస్తుతం అది లేదు.
==నవలలు==▼
ఆయనకు గల సాహిత్య జ్ఞాపకాలలో ఒకటి దీపావళికి ఆంధ్ర ప్రభ, ఆంద్ర పత్రికల ప్రత్యెక సంచికలు. ఎక్కువ పేజీలతో, కునేగా మరికొలందు సెంటుతో ఘుమ ఘుమలాడుతూ వచ్చేవి అవి. వాటిని చదవడానికి వారి కుటుంబ సభ్యులంతా పోటీ పదే వారు. ఆనాటి చాలామంది పాఠకులకి కూడా ఈ అనుభవం వుండి వుంటుంది. బహుమతి పొందిన కథలని చదివేసాక ఇక వాటి మీద ఆసక్తి తగ్గేది. అలాగే యువ, జ్యోతి మాస పత్రికలూ దీపావళి, సంక్రాంతి పండగలకి ఎక్కువ పేజీలతో వచ్చేవి. వాటిలో ప్రముఖ రచయితల కథలు వుండేవి. [[అవసరాల రామకృష్ణారావు]], [[ఇచ్చాపురపు జగన్నాథరావు]], భరాగో, పెద్దిభొట్ల సుబ్బరామయ్య,ఆదివిష్ణు తదితరుల కథలు వాటిలో వచ్చేవి.
సంభాషణతో మొదలయ్యే కథ అరుదుగా దొరికేవి. వాటిని ఆసక్తిగా చదివేవారాయన.పన్నెండు ఏళ్ళు వచ్చాక హనుమాన్ పేటలోని జిల్లా గ్రంధాలయానికి వెళ్ళి పుస్తకాలు చదివేవారు.
ఇవి కాక టెంపోరావు, గుత్తా బాపినీడు, డాక్టర్, భయంకర్, విశ్వప్రసాద్, ప్రసాద్, కనకమేడల,కొమ్మూరి సాంబశివరావు మొదలైన వారి డిటెక్టివ్ నవలలని వారింట్లో అద్దెకి వున్న మద్డాలి సీతమ్మ గారు తమ బంధువుల నుంచి తెచ్చి ఇచ్చేవారు. డిటెక్టివ్ నవలల్లో ఇలా విసుగు కలిగించేవి కనిపించేవి కావు. ఎందుకంటే వారు కథని సంభాషణల ద్వారా నడిపించేవారు. పత్రికల్లోని రచనలకి, డిటెక్టివ్ నవలలకి తేడాని స్పష్టంగా గమనించ గలిగారాయన. డిటెక్టివ్ నవలల్లో ఫిలాసఫీని చెప్పేవారు కారు. సాధారణంగా నవల సంభాషణలతోనే మొదలయ్యేది. గాంధీనగర్లోని న్యూ ఇండియా సెంటర్లో బళ్ళ మీద అద్దెకి ఇచ్చే కొమ్మూరి నవలలని తెచ్చుకుని చదివే వారాయన. వాటి వెల అర్థరూపాయి. రోజుకి అణా అద్దె. వాటిని అణా లైబ్రరీలు అనేవారు.
ఆరోజుల్లో ఆయన పత్రికల్లో చదివిన అనేక వేల మంది రచనా విధానాలే ఆయనకు మార్గదర్శకత్వం అయ్యాయి. ఎలా రాయలో కంటే ఎలా రాయకూడదో ఆయనకు చిన్న వయసులోనే తెలిసింది. ఏ సమాచారం పాఠకుడిగా నాకు విసుగ్గా వుండేదో దాన్ని ఆయన రచనలనల్లో దొర్లకుండా వారు రచయితగా మొదటినించి జాగ్రత్తని తీసుకోసాగారు. పైగా మెత్తటి వాక్య నిర్మాణంలో దిట్ట అయిన కొమ్మూరి సాంబశివరావు నవలలు అన్ని అనేకమార్లు చదవడం వల్ల ఆయనకు అలాంటి వాక్యాలు రాయడం బాగా పట్టుపడింది. ఏది పాఠకుడిని కన్ఫుస్ చేయకుండా, వారి మెదడుని స్ట్రైన్ చేయకుండా చెప్పాలి అని ఆయన బాగా గ్రహించారు. ఆ సూత్ర్రాన్ని ఆనాటి డిటెక్టివ్ రచయితలు గ్రహించి పాటించారు. పత్రికల్లోని కథల పోకడకి, డిటెక్టివ్ నవలల్లోని పోకడకి గల తేడాని పట్టుకోగలిగారు. ఈ కారణంగా నా శైలి సులభంగా వుంటోంది.
ఆయన కాలేజిలో చదివేప్పుడు ఓ సారి ఓ కథని రాసారు. అది తెలిసి వారి నాన్న [[మల్లాది దక్షిణామూర్తి]] గారు చదువు చెడుతుందని కథలని రాయద్దని చెప్పారు. దాంతో మళ్లీ రాయలేదు. అప్పుడప్పుడు వారి నాన్నగారు, `కథలు రాస్తున్నావా? మానేశావా? అని అడిగేవారు కూడా. బి కాంలో ఆయన క్లాసుమేటు మురళి అని ఒకడు వుండేవాడు. అతనికి కూడా సిస్టర్స్ మల్లాది లాగానే. దాంతో నాలానే చిన్నప్పటినుంచి చదివేవాడు. ఓ రోజు ఆయనకు వారు రాసిన కథని చదవమని ఇచ్చాడు. ఘనమైన అయ్యా ` అన్న పదాలతో అది మొదలైంది. మర్నాడు వారిద్దరూ అలంకార్ సినిమా హాల్ని దాటి ఎదురుగా వున్నా వంతెన మీదకి రాగానే కథ ఎలా వుందని అడిగాడు. కథా రచనలో మల్లాది ఏర్పరచుకున్న అభిప్రాయాలని అన్నిటి ప్రకారం ఆ కథ బాగా లేదని విస్లేశానాత్మకంగా చెప్పారాయన. ఆయన పరిజ్ఞానికి స్నేహితునికి ఆశ్చర్యం వేసింది. వారు మంచి మిత్రులే అయినా ఎన్నడు కథల గురించి అంతదాకా మాట్లాడుకోలేదు. ఆతను తర్వాత దేవరకొండ మురళి అనే తన పేరుతో 10 దాక కథలు రాసాడు.
1970 లొ ఆయన చదువు బికాం అయిపోయింది. వుద్యోగ రీత్యా సికింద్రాబాద్ వచ్చి, 1970 ఫిబ్రవరిలో వారి నాన్న గారు మల్లాది దక్షిణామూర్తి మిత్రులు శ్రీ ముస్త్యాల వెంకయ్య గారి ఇంట్లో, రాష్ట్రపతి రోడ్లోని పోస్ట్ ఆఫీసు ఎదురుగా వున్న ఇంట్లో బస చేసారు. వారికి చిన్నప్పటి నుంచి కథలకి ఐదియాస్ తట్టేవి. వాటిని ఓ చిన్న పుస్తకంలో రాసుకునేవారాయన. అక్కడ వుద్యోగంలో చేరిన మొదటి ఆదివారం ఓ కథని రాసారు. తర్వాత ఫెయిర్ చేసి దాన్ని చందమామకి పోస్ట్ చేసారు. పత్రికకి, ప్రభాకి, అపరాధ పరిశోధనకి వరసగా ఒకో కథని ఒకో ఆదివారం రాసి పోస్ట్ చేసారు. వారు అప్పుడు ఓ సంగతి గమనించారు. ఫెయిర్ చెయ్యడానికి చిత్తు ప్రతి చూడకుండానే తర్వాతి పదం, వాక్యం అలానే రాసేవారాయన. తర్వాత చూస్తే చిత్తు ప్రతిలో అలాగే వుండేది. ఇలా చాలాసార్లు అనుభవం అయ్యాక ఆయన వాక్యాలని, పదాలని ఒకేలా రాస్తారని అర్థమయ్యిందాయంకు. దాంతో తిరగరాసే ప్రయత్నం మానుకున్నారు.
<!--
వెంకయ్య గారి పుత్రులు ముస్త్యాల భూమయ్య, లక్ష్మణ్ రావులు. లక్ష్మణరావు గారికి, ఆయన శ్రీమతి ప్రభావతికి పత్రికా పఠనమ్ అలవాటు. నేను సికందరాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర సిటి బస్సు ఎక్కేవాడిని. అక్కడ మేగ్సిన్స్ అమ్మే షాపులు చాలా వుంటాయి కాబట్టి నన్నువారం, వారం ప్రభ, పత్రికలని, నెల నెలా చందమామని కొనుక్కు రమ్మని, నెలాఖరుకి లెక్క చూసి డబ్బు ఇచ్చేవారు. వారు కారు ఆపుకుని కొనాల్సి వచ్చేది కాబట్టి ఆ పనిని నాకు పురమాయించారు.
ఆగస్టు రెండు ౧౯౭౦. ఆరోజు నేను చందమామని సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర ఓ పుస్తకాల షాపులో కొన్నాను. బస్సులో కూర్చోడానికి చోటు లేక నించుని రావడంతో దాన్ని తిరగేయలేదు. ఇంటికి నడిచి వస్తు చూసాను కాని నాకు నా కథ కనపడలేదు. రాగానే లక్ష్మణరావు గారు నా చేతిలోంచి దాన్ని తీసుకుని తెరవకుండానే చెప్పారు.
“దీంట్లో నీ కథ ఒకటి పడిందని పందెం.“
నేను ఆ పత్రికకి కథని పంపానన్న సంగతి గుర్తున్న్నా వేసుకుంటామనే కార్డు రాలేదు కాబట్టి ధైర్యంగా జవాబు చెప్పాను.
“రాలేదని పందెం.“
“కథ వస్తే దీనికి పంపే డబ్బు నాకు ఇవ్వాలి.“ చెప్పారు.
“అలాగే.“ధైర్యంగా వొప్పుకున్నాను.
ఆయన ఓ పేజి తెరచి అందులో వచ్చిన సింగిల్ పేజి కథని నాకు చూపించారు. `వుపాయసాలి` అన్న పేరు గల ఆ కథ, కింద మల్లాది వెంకట కృష్ణ మూర్తి అనే పేరు కనపడింది. అది నేను రాసిన కథే!.అప్పుడు నాకు అర్థం కాలేదు ఆ సంగతి ఆయనకీ ఎలా తెలిసిందో. బహుసా చందమానించి కథని ప్రచురణకి తీసుకున్నమన్న కార్డ్ వచ్చి వుంటుంది. అది ఆయన దాచి వుండచ్చు. నాకు ఎన్నడు ఆ కార్డు ఆయన ఇవ్వలేదు. ఆ కథ చదవాలనుకునేవారు ఈ లింకుని క్లిక్ చేయండి. వుపాయసాలి. ఆ విధంగా తొలిసారి ౧౯౭౦ ఆగష్టు రెండో తారీకు సాయంత్రం అయిదున్నర-ఆరు మధ్య నా పేరుని ౬౮ రాష్ట్రపతి రోడ్లోని ఆ ఇంట్లో అచ్చులో చూసుకున్నాను. ఆ ఇంట్లో చాల కథలు రాసాను
ప్రఖ్యాత అమెరికన్ కవి రాబర్ట్ ఫ్రాస్ట్ ఇరవై ఏళ్ళపాటు అనేక పోయంస్ రాసాడు. కాని అతని ముప్ఫై తొమ్మిదో ఏట కాని అతని పొయిట్రీ బుక్ ని పబ్లిషర్లు ప్రచురించలేదు. ఈ రోజు అతని పద్యాలు ఇరవై రెండుభాషల్లోకి అనువదించబడ్డాయి. నాలుగు సార్లు పొయిట్రీలో రాబర్ట్ ఫ్రాస్ట్ కి పుల్లిడ్ జర్ ప్రైజులు వచ్చాయి. ఆయన్ని సాహితీ లోకం ఆలస్యం గా గుర్తించింది. ఈ విషయంలో నేను అద్రుష్ఠవంతుడిని అనే చెప్పాలి. నేను రాసిన మొదటి కథే వెనక్కి రాకుండా ప్రచురించబడింది. అంతే కాకుండా వరసగా పత్రిక, ప్రభ, అపరాధ పరిశోధనల్లో కూడా నాకథలు వెంట వెంటనే వరసగా వచ్చాయి.
జూన్ 4, 2009
జరిగిన కథ
Posted by Malladi Venkata Krishna Murthy under ప్ర-వచనం
Leave a Comment
5555
1970 నించి నా సాహిత్య మార్గంలో జరిగిన అనేక సంఘటనలని, అనుభవాలని పాఠకులతో పంచుకోవడానికి ఈ బ్లాగుని ఆరంభిస్తున్నాను. తరచూ నన్ను పాఠకులు అడిగే అనేక ప్రశ్నలకి జవాబులు ఇందులో దొరుకుతాయి. నాకు ఈ మార్గంలో పరిచయం వున్న అనేకమంది ప్రముఖుల గురించి రాసే వివిధ విషయాలు, వారితో నా అనుభవాలు చదవడానికి పాఠకులకి ఆసక్తిగా వుంటాయని విశ్వసిస్తున్నాను. నాకు డయిరి రాసే అలవాటు లేదు కాబట్టి తారీఖులు, నెలలు, సంవత్సరాలు, కొందరి పేర్లు అన్ని సందర్భాల్లోనూ ఇవ్వలేను. అందుకని కేవలం జరిగిన వాటి సారాంసాలని మాత్రమే ఇవ్వగలను. ఎలాంటి దాపరికాలు లేకుండా రాయదలచుకున్నాను కాబట్టి పాఠకులు దీన్ని కల్పితంగా భావించనవసరం లేదు. ఏ విషయం మీదైనా వారు ఇంకాస్త వివరాలు తెలుసుకోడానికి ప్రశ్నలు వేయచ్చు. అలాగే ఏ విషయం మీద తెలుసుకోవాలని వుందో దాన్ని అడిగితే ఆ వివరాలు రాస్తాను. అయితే వో టాపిక్కు ముగిసేదాకా ఆగి దాని మీద నేను చెప్పని వాటి గురించి అడిగితే ఎవరికీ సమయం వృధా కాదు. మీరు టాపిక్కులని సూచించవచ్చు. నేను రాయదలచుకున్న జాబితాలో అది వుంటే ఆ సంగతి తెలియచేస్తాను. లేకపోతే మిగతా పాఠకులకి, నాకు ఈ విషయంలో సహాయం చేసినవారు అవుతారు. అనుమానం వున్న సంగతులని వదిలేయదలిచాను కాని అసత్యాలని మాత్రం రాయదలచుకోలేదు.
ఈ బ్లాగుని రోజు రాయగలనా అని అనుమానం. కాబట్టి ఖచ్చితంగా బుధ, ఆదివారాలు పోస్టు చేసే ప్రయత్నం చేస్తాను. మిగిలిన రోజుల్లో కూడా పోస్టు చేయగలిగితే సంతోషం. దీన్ని మీరంతా ఎంజాయి చేస్తారని ఆశిస్తాను.
-మల్లాది వెంకట కృష్ణ మూర్తి
నేను
నా గురించి నాలుగు ముక్కలు
పేరు మల్లాది వెంకట కృష్ణ మూర్తి. వృత్తి రీత్యా రచయితని. నివాసం హైదరాబాద్. పుట్టింది 13, నవంబర్ 1949. విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్లో. చదువు బికాం. 125 దాకా నవలలు, 3000 పైచిలుకు కధలు, కొన్ని వ్యాసాలూ,ఆధ్యాత్మిక విషయాల మీద డజనుకి పైగా పుస్తకాలు రాసాను. హిందీలో ఒకటి, కన్నడంలో మూడు, తుళు భాషలో ఒకటి, తెలుగులో దజనుకి పైగా నా నవలల ఆధారంగా సినిమాలు వచ్చాయి. పోలీసు రిపోర్ట్, తేనెటీగ అనే చిత్రాలకి మాటలు రాసాను. యాత్రా సాహిత్యం ట్రావలాగు యూరప్, ట్రావలాగు సింగపూర్, ట్రావలాగు అమెరికా, అమరికాలో మరోసారి. కర్మ-జన్మ తాజా పుస్తకం. పిల్లల పేర్ల పుస్తకం, వంటల పుస్తకం, టిఫిన్ వరైటీలు, కథలు ఎలా రాస్తారు లాంటి నాన్-ఫిక్షన్ పుస్తకాలు, కొన్ని జోక్స్ కలక్షన్స్లని కూడా వేలువరించాను. .నా పుస్తకాల జాబితా కోసం కింద చూడండి. ౧౯౯౪ నించి లిపి పబ్లికేషన్స్ ద్వారా నా పుస్తకాలని వెలువరిస్తున్నాను. తెలుగుబుక్స్ @ యాహూ. కాం ద్వారా వాటిని ఆర్డర్ చెయ్యచ్చు. పుస్తకం ధర + ఎర్మైల్ పోస్టు ఖర్చుతో బుక్స్ మీకు చేరుతాయి.
త్వరలో విడుదలయ్యే కొత్త పుస్తకాలు
2009-10లో వచ్చే కొత్త నవలలు. 1. ది ఎండ్ (నది మంత్లిలో సీరియల్) 2. పరంజ్యోతి (ఆరాధన మంత్లిలో సీరియల్) 3. మిస్టర్ మిరియం (విపుల మంత్లిలో సీరియల్) చిత్ర అనే కొత్త మాస పత్రికలో జులైలో మొదలయ్యే సీరియల్ 2011లో పుస్తకంగా వస్తుంది. వాడుక భాషలో రాసిన మళ్లి చెప్పిన రామాయణం (దైవం మంత్లీ లో సీరియల్) ౨౦౧౦ జనవరికి పుస్తక రూపంలో వస్తుంది. వివేక ధార, ప్ర-వచనం, పరమార్థ కథలు, భజగోవిందం కూడా త్వరలో వచ్చే ఆధ్యాత్మిక పుస్తకాలు.
-->
▲==నవలలు==
# [[ది గెస్ట్(నవల)|ది గెస్ట్]]
# యమాయనమహ
|