నాగలాపురం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 15:
ఈ దేవాలయ ప్రాకారాలను [[శ్రీ కృష్ణదేవ రాయలు|శ్రీకృష్ణదేవరాయలు]] నిర్మింపజేశాడని చరిత్రకారులు చెబుతారు. ఈ ప్రాకారాలు విజయనగర కాలపు శిల్పకళా నైపుణ్యానికి ఒక మచ్చు తునక. జీర్ణావస్థలో ఉన్న ఈ దేవాలయ ప్రాకారాలను ఇప్పుడు [[తిరుమల తిరుపతి దేవస్థానములు]] జీర్ణోద్దరణ చేస్తోంది.
[[ దస్త్రం:Main gopuram at nagalapuram7.JPG|thumb|right|నాగలాపురం ఆలయ ప్రధాన గోపురము]]
 
 
==ఆలయ విశిష్టత==
 
ఈ ఆలయ విశిష్టత ఏమంటే........ ప్రతియేడు మార్చి నెల 25, 26, 27/26,27,28 వ తేదీలలో సాయంకాలం మూల విరాట్టుకు 630 అడుగుల దూరంలో ఉన్న రాజగోపురం నుండి సూర్య కిరణాలు నేరుగా వచ్చి, మొదటి రోజున స్వామి వారి పాదభాగాన, రెండో రోజున స్వామివారి నాభి భాగాన, మూడో రోజున స్వామివారి ముఖ భాగాన ప్రసరిస్తాయి. ఈ కారణంగానే ఆ మూడు రోజులు స్వామివారికి సూర్య పూజోత్సవాలు జరుపుకుంటారు. ఈ ఉత్సవాలకు ఇతర రాష్ట్రాలనుండి కూడ భక్తులు తండోప తండాలుగా వచ్చి దర్శనం చేసుకుంటారు.
 
==పండుగలు==
*ఇక్కడ [[ఫాల్గుణ]] మాసం శుద్ద [[ద్వాదశి]], [[త్రయోదశి]], [[చతుర్దశి]], విశేషం. ఈ మూడు రోజుల్లో సూర్య కిరణాలు వరుసగా స్వామివారి పాదాలపై, నాభిపై, నుదుటిపై పడతాయి. ఈ మూడు రోజులు ఇక్కడ తెప్పోత్సవం జరుగుతుంది.
"https://te.wikipedia.org/wiki/నాగలాపురం" నుండి వెలికితీశారు