గుణసుందరి కథ: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q5618519 (translate me)
చి Wikipedia python library
పంక్తి 29:
==చిత్ర కథ==
 
కధకథ [[పార్వతీ|పార్వతి]] [[పరమేశ్వరులు|శివుడు]] విహారం చేస్తూ వెళుతుండగా మొదలౌతుంది. ఒక యువతి ఏడుస్తూ దేవిని ప్రార్ధిస్తూ ఉండటం ఆమె ప్రక్కన ఒక [[ఎలుగుబంటి|ఎలుగు]] కూర్చొని ఉండటం చూసి పార్వతి ఆమె కధకథ వివరించమని పరమేశ్వరుని వేడుకొంటుంది. ఆయన ఆ కథను వివరిస్తూ ఉంటాడు.
 
ధారానగరాన్ని పరిపాలించే [[రాజు]] ఉగ్రసేనునికి హేమసుందరి, రూపసుందరి మరియు గుణసుందరి అనే ముగ్గురు కుమార్తెలు కలరు. గుణసుందరి([[శ్రీరంజని]])కి జన్మనిస్తూ ఆమె తల్లి చనిపోవడంతో రాజు మళ్ళీ వివాహం తలపెట్టక ముగ్గురు కుమార్తెలనూ అల్లారు ముద్దుగా పెంచుతుంటాడు. ముగ్గురు కుమార్తెలూ యవ్వనవతులైనాక ప్రజలకు పరిచయం చేసేందుకు [[సభ]]కు తీసుకొస్తాడు. అక్కడ వారిని తనగురించి చెప్పమన్నపుడు పెద్దకుమార్తెలు [[తండ్రి]]ని తాము అందరికంటె ఎక్కువగా ప్రేమిస్తామని, గౌరవిస్తామని చెపుతారు. గుణసుందరి తాను తండ్రిపై గౌరవం అభిమానం ఉన్నాయని కాని తను తన భర్తనే అందరి కంటే అధికంగా ప్రేమించాలని చెపుతుంది. దానితో కోపం వచ్చిన రాజు నీ [[భర్త]] ఎవరైనా ప్రేమిస్తావా అని అడుగుతాడు. ప్రేమిస్తానని చెప్పటంతో రాజ్యంలోని కుంటీ, గుడ్డీ, మూగ, చెవిటి వాళ్ళనందరినీ తెప్పించి వారిలో అన్ని అవలక్షణాలు కల ఒక ముసలి([[కస్తూరి శివరావు]])ని ఇచ్చి ఆమెకు వివాహం జరుపుతాడు. అదే మూహూర్తంలో ఆమె అక్కలకు తన మేనళ్ళుళ్ళతో వివాహం జరుపుతాడు.
[[బొమ్మ:Gunasundari-katha-1.jpg | 250px | thumb | left | గుణ సుందరి కధకథ సినిమా నుండి ఒక సన్నివేశము]]
[[బొమ్మ:Gunasundari-katha-2.jpg | 250px | thumb | right|గుణ సుందరి కధకథ సినిమా నుండి ఒక సన్నివేశము]]
 
తదనంతరం ఒకానొక సంధర్భంలో ఆ ముదుసలి వినికిడి వాక్కు బాగా ఉన్నవాడని తెలియడం, అతడు తన మేనళ్ళుళ్ళతో వాదనలకు దిగటం చూసిన రాజు వాళ్ళ ఉనికి సహించలేనివాడై ఇంటినుండి పొమ్మంటాడు. అ సందర్భంలో ముసలివానిని కొట్టబోయి పట్టు తప్పి మెట్ల పైనుండి పడి కాలుకు బలమైన గాయాలు తగులుతాయి. గుణసుందరి భర్తకు జరిగిన అవమానంతో అతడితో కలసి అతడి పల్లెకు వచ్చేస్తుంది. భర్తతో కలసి సామాన్యజీవితం గడుపుతూ ఉంటుంది. ఒకరోజు నీటికై చెరువుకు వెళ్ళిన ఆమెను ఒక యువకుడు వెంబడించి ఆమెను వివాహం చేసుకొంటానని చెపుతూ చేయి పట్టుకొంటాడు. ఆమె అతడిని చెంబుతో నుదుటిపై కొడుతుంది. ఇంటికి వచ్చి భర్తతో జరిగింది చెపుతుంది. తరువాత భర్త నుదుటన కూడా గాయం ఉండటం చూస్తుంది. ఒకనాడు భర్త ఆమె ఎప్పుడూ చదువుతుండే పతివ్రతల పుస్తకంలో ఆమె కథను రాసి ఆమెను వెంటాడిన యువకుని బొమ్మ వేస్తాడు. అది చూసి ఆమె ఆశ్చర్యపోయి మీరు సామాన్యులు కాదు, మారురూపాన ఉన్న ఎవరో గొప్పవారు, నన్ను పరిక్షీంచక నిజం చెప్పమని కోరుతుంది. అతడు చెరువు దగ్గర వెంటాడిన తన నిజరూపంలో ఆమెకు కనిపిస్తాడు. తన పేరు వీరశేనుడని తను ఒక రాకుమారుడనని చెప్పి తను తన గురువు కారణంగా శాపానైకి గురియైన వైనమ్ చెప్పి, దానిని భార్యకు తప్ప పరులు ఎవరికీ తెలియనివ్వరాదని తెలిసిన క్షణం తాను ఎలుగుబంటిగా మారిపోతానని ఎవరికీ తెలియనివ్వనని మాట తీసుకొంటాడు. గుణ సుందరి ఇంటినుండి వెళ్ళిన కొద్ది కాలానికి ఆమె తండ్రి కాలు గాయాలు పెద్దవై అధిక బాధ పడుతుంటాడు. కూతుళ్ళు అతడికి సేవచేయక సూటి పోటి మాటలని తమ భర్తల సహాయంతో తండ్రి కాలు తీసేయించే ప్రయత్నం చేస్తారు. కూతుళ్ళ గురించి నిజం తెలిసి భయపడిన రాజు మంత్రికి చెప్పి తన కాలు బాగుచేయించే మార్గం చూడమంటాడు. అంజనం ద్వారా మహేంద్రమణి తెచ్చి తాకిస్తే తగ్గుతుందని చెపుతారు పండితులు. అది తెచ్చిన వారికి తనరాజ్యాన్ని ఇస్తానని ప్రకటించమంటాడు రాజు.
"https://te.wikipedia.org/wiki/గుణసుందరి_కథ" నుండి వెలికితీశారు