కురుక్షేత్రం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 45:
ఈ వివిధ కాలాలలో ప్రాంతాన్ని బ్రహ్మవేది, ఉత్తరవేది, ధర్మక్షేత్ర మరియు కురుక్షేత్ర అని పిలువబడుతుంది. కురుమహారాజు ఇక్కడకు వచ్చే సమయంలో ఇది ఉత్తరవేది అని పిలువబడింది.
ఈ భూమిని పలురాజులు పరిపాలించారు. తరువాత భరతచక్రవర్తి ఇక్కడకు వచ్చి స్థిరపడ్డాడు. తరువాత మహాభారత యుద్ధం జరిగింది. యుద్ధం ఆరంభించే ముందు శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేసాడు. చరవర్తి హర్షవర్ధనుడి కాలంలో ఈ ప్రాంతం ఉన్నత స్థితికి చేరుకున్నది. చైనా యాత్రీకుడు హ్యూయన్ త్సాంగ్ ఇక్కడ ఉన్న స్థానేశ్వరుని సందర్శినచాడని చారిత్రక ఆధారాలద్వారా తెలియవస్తుంది. అశోకచక్రవర్తి కాలంలో కురుక్షేత్రం ప్రఖ్యాత విద్యాకేంద్రంగా రూపుదిద్దుకున్నది.
== విష్ణుసహస్రనామ మందిరం ==
ప్రధాన మందిరంలో భీష్ముడు అంపశయ్య మీద వాలిన దృశ్యం ఆలయంలో పాలరాతి శిల్పంగా మలచబడి ఉన్నది. అంపశయ్య మీద ఉన్న భీష్ముడు, పక్కన శ్రీక్రిష్ణుడు, పంచపాండవులు, మునులు మొదలైన వారి పాలరాతి విగ్రహాలు మలచబడి ఉన్నాయి. ఈ ఆలయానికి ఒకవైపు పంచముఖాంజనేయుడు మరొకవైపు సరస్వతి ఉపాలయాలు ఉన్నాయి. మరొక ఉపాలయంలో గంగాదేవి, శ్రీరమచంద్రుని ఉపాలయాలు ఉన్నాయి. ఇక్కడకు వచ్చే భక్తులు కొందరు ఇక్కడ విష్ణుసహస్రనామం పఠిస్తారని చెప్తారు.
|