భారతదేశంలోని నాలుగు సుప్రసిద్ద హిందూ పుణ్యక్షేత్రాలైన [[బద్రీనాథ్]], [[ద్వారక]],[[పూరీ]] మరియు [[రామేశ్వరం]] లను కలిపి '''చార్ ధామ్ ''' గా వ్యవహరిస్తారు. ఆదిశంకరాచార్యులచే ఉపదేశించబడిన ఈ క్షేత్రాలలో మూడు వైష్ణవ క్షేత్రాలు మరియు ఒక శైవ క్షేత్రము కలదు. కాలక్రమేణా చార్ ధామ్ అనే పదము హిమాలయాలలోని పుణ్యక్షేత్రాలను ఉద్దేశించేదిగా వ్యవహారంలోకి వచ్చింది.
==చరిత్ర==
మూలాధారాలు లేనప్పటికీ భారతదేశంలో హిందూమత వ్యాప్తికి విస్తృతంగా కృషిచేసిన [[m:en:Shankaracharya|ఆది శంకరాచార్య]] ఈ నాలుగు పుణ్యక్షేత్రాలకు చార్ధాం హోదాను ఆపాదించారుఆపాదించాడు. ఈ నాలుగు ఆలయాలు భారతదేశం యొక్క నాలుగు వైపులా ఏర్పడటం గమనార్హం. ఉత్తరాన బద్రీనాధ్బద్రీనాథ్ ఆలయం, తూర్పున పూరీ లోని జగన్నాధజగన్నాథ ఆలయం, పశ్చిమాన ద్వారక లోని ద్వారకానాధీశద్వారకాధీశ ఆలయం మరియు దక్షిణాన రామేశ్వరం లో రామనాధస్వామిరామనాథస్వామి ఆలయం స్థాపితమై ఉన్నాయి. సిద్ధాంతపరంగా ఈ దేవాలయాలు హిందూ, అవి శైవమతానికి మరియు వైష్ణవ శాఖలలోశాఖలకు మధ్య విభజించబడి ఉన్నప్పటికీ, చార్ ధామ్ తీర్థయాత్ర ఒక హిందూ మతం వ్యవహారంలావ్యవహారంగా భావింపబడుతుంది. 20వ శతాబ్ద మధ్యకాలం నుండి హిమాలయా పర్వత సానువులలో ఉన్న [[బద్రీనాధ్బద్రీనాథ్]], [[కేదార్నాధ్కేదార్నాథ్]], [[గంగోత్రి]] మరియు [[యమునోత్రి]] ఆలయాలను కలిపి ఛోటా చార్ధామ్ గా వ్యవహరిస్తున్నారు. ఈ యాత్ర ద్వారా [[ఉత్తరాఖండ్]] పర్యాటకం అత్యధికంగా లాభపడుతున్నందున ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యాత్రను బాగా ప్రోత్సహిస్తున్నది.