శ్రీలంక: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 226:
 
శ్రీలంక కూడా పలు మతాలకు నిలయం. దేశంలో 70% బౌద్ధులు ఉన్నారు. వారిలో చాలామంది తరవాడా బుద్ధిజానికి చెందిన వారు. బౌద్ధులలో అత్యధికులు సింహళ సంప్రదాయానికి చెందిన ప్రజలు. శ్రీలంకలో క్రీ.పూ 2 వ శతాబ్ధంలో గౌరవనీయులైన మహీందా చేత బుద్ధిజం ప్రవేశపెట్టబడింది. బుద్ధునికి ఙానోదయం అయిన బోధివృక్షం నుండి తీసుకురాబడిన మొక్కను తీసుకురాబడింది. శాబ్ధికంగా మాత్రమే అచరించబడుతున్న పాలి కెనాన్ (త్రిపీఠిక) కు శ్రీలంకలో క్రీ.పూ 30లో లిఖితరూపం ఇవ్వబడింది. బుద్ధమతం నిరంతరాయంగా ఆచరించబడుతూన్న దేశాలలో శ్రీలంక ప్రధమస్థానంలో ఉంది. శ్రీలంకలో క్రీ.పూ 2 వ శతాబ్ధంలో ఆరంభించబడిన సంఘ గురుశిష్య సంప్రదాయం ఆటంకం లేకుండా నిరంతరంగా కొనసాగుతుంది. క్షీణదశలో ఉన్నకాలంలో శ్రీలంక మతపరమైన గురుశిష్య వారసత్వం తాయ్‌లాండ్ మరియు బర్మా దేశాల సహకారంతో కొనసాగించబడింది. శ్రీలంకలో బుద్ధిజానికి ప్రత్యేక గుర్తింపు లభించడమే కాక " బుద్ధమతానికి శ్రీలంకలో " రక్షణ మరియు పోషణ " లభిస్తుంది.
[[File:Distribution of Languages and Religious groups of Sri Lanka 1981.jpg|thumbnail|Distribution of languages and religious groups in Sri Lanka <!--on D.S. Division and Sector level--> according to the 1981 census.]]
 
శ్రీలంకలో హిందూమతం రెండవ స్థానంలో ప్రాబల్యం వహిస్తున్నది. అంతేకాక హిందూమతం బుద్ధమతాని కంటే పురాతనమైంది. ప్రస్థుతం తూర్పు మరియు మద్య శ్రీలంకలో హిందూమతం
ఆధిక్యతవహిస్తింది. తమిళులు ప్రధానంగ హిందూమతాన్ని అవలంబిస్తున్నారు. దేశంలో మూడవ స్థానంలో ఉన్నది ఇస్లాం మతం. దేశంలోఇస్లాం మతాన్ని మొదటిసారిగా క్రీ.శ 7వ శతాబ్ధంలోంఅరబ్ వ్యాపారులు ఆరంభించారు. ముస్లిం మతస్థులలో అత్యధికులు షాఫీసంప్రదాయాన్ని అనుసరిస్తున్న సూఫీమతస్థులు. శ్రీలంకలో ప్రస్థుతం ఉన్న ముస్లిములు అరబ్ మరియు శ్రీలంక దంపతులకు జన్మించినవారని అంచనా.
"https://te.wikipedia.org/wiki/శ్రీలంక" నుండి వెలికితీశారు