తుళువ నరస నాయకుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
[[సాళువ నరసింహ రాయలు]] మరణ శయ్యపై ఉండి విజయనర రాజ్యాన్నీ, తన కుమారులనూ [[తుళువ నరస నాయకుడు | తుళువ నరస నాయకునికి ]] అప్పగించినాడు. ఇచ్చిన మాట ప్రకారం ముందు పెద్ద కుమారుడైన [[తిమ్మ భూపాలుడు]]ను తరువాత [[రెండవ నరసింహ రాయలు]]ను సింహాసనం అధిస్టింపచేసి తాను రాజ్యభారాన్ని వహించినాడు, లేదా అధికారాన్ని చెలాయించినాడు
 
==మొదటి దండయాత్ర==
ఇతను అధికారాన్ని సహించలేని సామంతులు స్వతంత్రించినారు, గజపతులు విజృంభించి చాలా ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నారు. [[చోళ]], [[పాండ్య]], [[మధుర]] సామంతులు స్వతంత్రించినారు. వీటన్నింటినీ చక్కబరచడానికి [[1496]] లో దండయాత్రకు బయలుదేరినాడు. [[తూర్పు సముద్రం]]వరకూగల భూమిని అందున్న సామంతులను అణచి, దక్షిణమునకు వచ్చి [[చోళ]] రాజును ముట్టడించినాడు. అప్పటి [[తిరుచినాపల్లి]] పాలకుడు [[కోనేటి రాజు]] ఓడిపోయినాడు, తరువాత [[మధుర]] పాలకుడైన [[మానభూషనుడు]]ని ఓడించి తరువాత [[పాండ్య]] రాజ్యముపై దండెత్తి ఆ రాజ్యమును సామంత రాజ్యముగా చేసుకున్నాడు. తరువాత [[కర్నాట]] ప్రాంతమునందున్న [[ఉమ్మత్తూరు]] పై దండెత్తినాడు.
 
ఇలాగే విజయోత్సాహంతో ముందుకు వెళ్తున్న '''నరస నాయకునికి''' [[శ్రీరంగపట్టణం]], [[శివసముద్రం]]లను ముట్టడించకుండా పొంగిపొరలుతున్న [[కావేరీ నది]] అడ్డు వచ్చినది.
 
దానితో [[కావేరీ నది]]కి ఆనకట్ట కట్టి [[శ్రీరంగము]]ను ముట్టడించి భీకర యుద్దం చేసినాడు, దుర్గరక్షణాధికారి [[హోయ్సణేంద్రుడు]] బంధీ అయినాడు. [[శ్రీరంగము]] నరసనాయకుని వశం అయినది. [[ఉమ్మత్తూరు]] కూడా ఇతని ఆధీనంలోనిని వచ్చినది.
 
 
==బీజాపూరు పాలకునితో యుద్దం==
[[బీజాపూరు]] పాలకుడైన [[యాసిఫ్ ఆదిల్షా]] విజయనగర రాజ్యానికి చెందిన [[మానువ]] కోటను ఆక్రమించినాడు, దానితో '''నరసనాయకుడు''' వారిపైకి సైన్యాలను నడిపి [[యాసిఫ్ ఆదిల్షా]]ను బంధీగా పట్టుకోని దయతో వదిలివేసినాడు.
 
==గజపతుల దండయాత్రను అడ్డుకొనుట==
[[1496]]న గజపతుల రాజు [[పురుషోత్తమ గజపతి]] మరణించినాడు, అతని కుమారుడు [[ప్రతాపరుద్ర గజపతి]] సింహాసనం అధిస్టించి, దక్షిణ దేశ దిగ్విజయ యాత్రకు బయలుదేరినాడు, [[కృష్ణా నది]] దాటి రాకుండా '''నరస నాయకుడు''' వీనిని ఓడించినాడు.
 
==మరణం==
ఇతను [[1503]] లో మరణించినాడు
 
 
"https://te.wikipedia.org/wiki/తుళువ_నరస_నాయకుడు" నుండి వెలికితీశారు