శ్యామశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

Removing all content from page
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
సంగీత త్రిమూర్తులలో మూడవవారైన శ్యామశాస్రి [[తిరువారూరు]] గ్రామస్థులు. వీరి అసలు పేరు వేంకట సుబ్రహ్మణ్యము, ముద్దుగా ''శ్యామకృష్ణా'' యని పిలిచేవారు. అదే వీరి కృతులలో వీరి ముద్ర అయినది. వీరు బంగారు [[కామాక్షి]] ఉపాసకులు. అమ్మపై తప్ప వేరొకరిపై రచనలు చేయలేదు. వీరు కలగడ, మాంజి, చింతామణి మొదలగు అపూర్వ రాగములను కల్పించారు. [[త్యాగరాజు|త్యాగరాజా]]దులచే కొనియాడబడిన వీరి లయజ్ఞానము శ్లాఘనీయమైనది. ఆనందభైరవి రాగమన్న వీరికి చాల యిష్టమని చెప్తారు. ఆంధ్ర గీర్వాణ భాషా కోవిదులైన వీరి కృతులలో ముఖ్యమైనవి: ఓ జగదంబా, హిమాచలతనయ, మరి వేరే గతి యెవ్వరమ్మా, హిమాద్రిసుతే పాహిమాం, శంకరి శంకురు, సరోజదళనేత్రి, పాలించు కామాక్షి, కామాక్షీ ([[స్వరజతి]]) ,కనకశైలవిహారిణి, దేవీ బ్రోవ సమయమిదే, దురుసుగా, నన్ను బ్రోవు లలిత, మొదలగునవి. ప్రఖ్యాత వాగ్గేయకారులైన [[సుబ్బరాయశాస్త్రి]] వీరి కుమారులే.
"https://te.wikipedia.org/wiki/శ్యామశాస్త్రి" నుండి వెలికితీశారు