వెల్చేరు నారాయణరావు: కూర్పుల మధ్య తేడాలు

మూలాల చేర్పు
పంక్తి 9:
ప్రతీ రచనకు నిర్దుష్టమైన రచయిత, ఒకే శుద్ధమైన పాఠం ఉంటుందని భావిస్తూ చేస్తున్న పరిశోధనల మూలాలను నారాయణరావు ప్రశ్నిస్తారు. అటువంటి పరిశోధనలు, వాటికి మూలమైన అవగాహన వలసవాద భావజాలంలో భాగమే తప్ప నిజానికి అవి భారతీయ సాహిత్య క్రమానికి ఉపయోగపడవని ఆయన సిద్ధాంతీకరించారు. ఈ క్రమంలో వలసవాద భావజాల ప్రభావిత విమర్శకులకు కొరుకుడు పడని చాటువులను ఎంచుకుని ప్రామాణిక పరిశోధన వ్యాసాలు, పుస్తకాలు రచించారు. ముఖ్యంగా "పొయెం ఎట్ ద రైట్ మూముంట్" గ్రంథంలో చాటు సాహిత్యంలోని వివిధ అంశాలను సవివరంగా చర్చించారు.
=== ఆసక్తికరమైన కొన్ని పరిశోధనాంశాలు ===
* నాయకరాజుల కాలాన్ని ఆనాటి శృంగార కావ్యాల కారణంగా తెలుగు సాహిత్య విమర్శకులు "క్షీణయుగం"గా ముద్రవేశారు. బ్రిటీష్ కాలంలో ఆనాటి కావ్యాలపై నిషేధం కూడా విధించారు. ఈ నేపథ్యంలో నారాయణరావు "సింబల్స్ ఆఫ్ సబ్స్టెన్స్" గ్రంథంలో అటువంటి కాలాన్ని ఎంచుకుని చేసిన పరిశోధనల్లో ఆనాటి సాహిత్యం భూ కేంద్రక వ్యవస్థ నుంచి ధన కేంద్రక వ్యవస్థగా మారుతున్న క్రమంలో తయారైన కొత్త విలువల ఫలితంగా నిరూపిస్తారు.<ref >[http://pustakam.net/?p=11764]Symbols of Substance: Court and State in Nayaka Period Tamilnadu శీర్షికన ఆ పుస్తకం గురించి కె.వి.ఎస్.రామారావు సమీక్ష</ref>
* గురజాడ అప్పారావు "కన్యాశుల్కం" నాటకాన్ని ప్రధానస్రవంతిలోని సాహిత్య విమర్శకులు కుళ్లిపోయిన సమాజాన్ని, సమాజాన్ని బాగుజేయడానికి వచ్చిన సంస్కరణల్నీ చిత్రించినట్టుగా విశ్లేషించారు. నారాయణరావు ఈ ధోరణికి పూర్తి భిన్నంగా నారాయణ రావు గారి విశ్లేషణ ప్రకారం అప్పారావు గారి దృష్టి భిన్నమైంది. ఆయన ఈ నాటకంలో చిత్రించిన సమాజం కుళ్లిపోయింది కాదు, చక్కగా హాయిగా వున్నది. అంతేకాదు, ‘ఆధునిక’మైంది కూడ. ఈ ఆధునికత వలససంస్కృతి వల్ల కలిగిన ఆధునికత కాదు, అంతకుముందు ఎప్పటినుంచో వస్తూ వున్న ఆధునికత. ఇందులో మనుషులు సంప్రదాయాల భారంతో కుంగిపోతున్నవారు కారు, మారుతున్న పరిస్థితులకి అనుగుణంగా, తమకు ఏం కావాలో దాన్ని ఎలా సాధించుకోవాలో స్పష్టంగా తెలుసుకుని ఆచరిస్తున్న వాళ్లు. అప్పారావు గారు చిత్రించిన ‘కన్యాశుల్కం’లో ఈ రెండురకాల ఆధునికతల మధ్య సంఘర్షణని చూస్తాం. వలససంస్కృతి ఆధునికతకి ప్రతినిథిగా సౌజన్యారావు పంతులు నిలబడితే, పరిణామ ఆధునికతని మధురవాణిలో స్పష్టంగా చూస్తాం. అవసరాన్ని బట్టి అటూ ఇటూ దూకే గోడమీది పిల్లిగా గిరీశం నిలబడతాడు. దాదాపుగా మిగిలిన అన్ని పాత్రలు కూడ ఆ సంధికాలానికి అనుగుణంగా పరిణమిస్తున్నవే, జీవనప్రయాణం చేస్తున్నవే. వలససంస్కృతి మీద ఇలాటి ఎదురుదాడి చేసిన రచయితలు ఆ కాలంలో అప్పారావు గారు తప్ప మరొకరు లేరు. భారతదేశంలోనే కాదు, ప్రపంచసాహిత్యంలో ఎక్కడా ఇలా జరగలేదని నారాయణ రావు గారి సిద్ధాంతం. ఇలా ఎన్నో కొత్తకోణాల్ని ఆవిష్కరించి, నారాయణ రావు గారీ గ్రంథంలో కన్యాశుల్కం మీద ఆసక్తికరమైన, ఆలోచనాకారకమైన వివేచనని చేశారు.<ref >[http://pustakam.net/?p=11817]Girls for Sale: Kanyasulkam, a Play from Colonial India పుస్తకం గురించి కె.వి.ఎస్.రామారావు సమీక్ష</ref><ref >[http://eemaata.com/em/issues/200709/1146.html]Girls for Sale: Kanyasulkam, a Play from Colonial India పుస్తకం గురించి "కన్యాశుల్కం మళ్లీ ఎందుకు చదవాలంటే" శీర్షికన వేలూరి వెంకటేశ్వరరావు సమీక్ష</ref>
*