ఆత్మబలం (1964 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 24:
అప్పట్లో తెలుగు సినిమా వాళ్లందరికీ కలకత్తానే పెద్ద అడ్డా. బోలెడన్ని బెంగాలీ సినిమాలు. తెలుగు ప్రేక్షకులకు నచ్చే ఉద్వేగాలు వాటిల్లో పుష్కలం. వి.బి.రాజేంద్రప్రసాద్ కూడా కలకత్తా ప్రయాణం కట్టాడు. అప్పుడు అక్కడ ఉత్తమ్‌కుమార్ నటించిన ‘అగ్ని సంస్కార’ సినిమా ఆడుతోంది. ఈయనకు బాగా నచ్చేసింది. అప్పటికప్పుడు నిర్మాతను కలిసి హక్కులు కొనేశారు. ప్రింట్ తీసుకుని మద్రాసులో దిగారు.ఇప్పుడు దీన్ని అక్కినేనికి చూపించాలి. ఆయన చూడ్డానికి కొంచెం టైం పట్టింది. కానీ చూడగానే ‘ఓకే’ అనేశారాయన. ఇంకేముంది... ‘ఆత్మబలం’ సినిమా ప్రారంభం. వి.మధుసూదనరావు దర్శకుడు. [[కేవీ మహదేవన్]] సంగీతం. సి.నాగేశ్వర్రావు ఛాయాగ్రహణం. [[ఆత్రేయ]] మాటలూ పాటలూ. ప్రధాన నాయికగా[[బి.సరోజాదేవి]] ని ఎంచుకున్నారు. [[జగ్గయ్య]], [[కన్నాంబ]], [[రేలంగి]], [[రమణారెడ్డి]], [[గిరిజ]], [[సూర్యకాంతం]]... ఇలా హేమాహేమీలను మిగిలిన పాత్రలకు ఎన్నుకున్నారు.
 
చిత్ర తారాగణం ఎంపికైన తర్వాత పిడుగు లాంటి వార్త వినవలసి వచ్చించి. అదేమంటే 'అక్కినేని మద్రాసు వదిలిపెట్టి హైదరాబాద్ వెళ్లిపోతున్నారు. ఇక ఏ నిర్మాత అయినా అక్కడకు వెళ్లి సినిమా తీయాల్సిందే'. దాంతో వి.బి.రాజేంద్రప్రసాద్ కూడా హైదరాబాద్‌కు పయనమయ్యారు. మొదట పాటల తయారీ మొదలైంది. స్వరాల కోసం [[కె. వి. మహదేవన్]], ఆత్రేయ, మధుసూదనరావు, వి.బి.రాజేంద్రప్రసాద్... నలుగురూ [[బెంగళూరు]] వెళ్లారు. బృందావన్ హోటల్‌లో బస. కె. వి. మహదేవన్ కు కథ చెబితే ‘‘ఇందులో పాటలు పెట్టడం కష్టం. సిట్యుయేషన్స్ కుదరవు’’ అనేశారు. అప్పటికాయన సుప్రసిద్ద సంగీత దర్శకుడు. ‘ఆంధ్రపత్రిక’ ఎడిటోరియల్ ఇచ్చినా ట్యూన్ కట్టేస్తాడని ప్రతీతి. అలాంటాయనే ఇందులో సిట్యుయేషన్ కుదరదన్నాడంటే?.. వి.మధుసూదనరావుకి గుండెల్లో రాయి పడింది. రాత్రంతా ఆలోచించి సిట్యుయేషన్స్ ఎంచుకున్నారు. పొద్దున్నే మహదేవన్ కు చెబితే ఓకే అన్నారు. మనసుకవి ఆత్రేయ కూడా పాటలు రాయడానికి సిద్దం అయిపోయారు.
 
==పాటలు==
 
"https://te.wikipedia.org/wiki/ఆత్మబలం_(1964_సినిమా)" నుండి వెలికితీశారు